సినీ దిగ్గజంగా ఒక వెలుగు వెలిగిన కైకాల సత్యనారాయణ మృతితో తెలుగు సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. సీనీరంగంలో సుదీర్ఘ కాలం అంటే.. దాదాపు 60 ఏళ్లకు పైగానే బంధం ఏర్పరుచుకున్న కైకాల సత్యనారాయణ రాజకీయాల్లోనూ అజాతశతృవుగా వ్యవహరించారు. రాజకీయాల్లో ఉన్నది చాలా స్వల్ప కాలమే అయినా.. ఆయన నిబద్ధతను చాటుకున్నారు.
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రోత్సాహంతో టీడీపీ తరఫున అనేక సందర్భాల్లో కైకాల ఎన్నికల ప్రచారం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణాజిల్లా కౌతవరంలో జన్మించిన సత్యనారాయణ.. సినీ రంగంలోకి ప్రవేశిం చాక.. ఇదే జిల్లాకు చెందిన ఎన్టీఆర్తో అనుబంధం ఏర్పడింది. ఇదే..రాజకీయాల వైపు కూడా కైకాలను నడిపించింది. ఈ క్రమంలో నే 1996లో టీడీపీ తరఫున ఆయన మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు.
అప్పట్లో కాంగ్రెస్-టీడీపీలు మాత్రమే బలమైన ప్రత్యర్థులు. కాంగ్రెస్ తరఫున కొలుసు పెదరెడ్డయ్య యాద వ్ పోటీ చేశారు. కైకాల వర్సెస్ యాదవ్ల మధ్య హోరా హోరీ పోరు సాగింది. అయినా.. ఇక్కడి ప్రజలు కైకాల వైపే మొగ్గు చూపారు. 81,507 ఓట్ల మెజారిటీతో కైకాల విజయం దక్కించుకున్నారు. పార్టీ పట్ల అంకిత భావంతో ఆయన రూపాయి కూడా ఎన్నికల ఖర్చు తీసుకోకుండా.. తన సొంత సొమ్మును వినియోగించారని .. అప్పట్లో పార్టీలో చర్చ సాగింది.
అయితే అనూహ్యంగా అప్పటి వాజపేయి ప్రభుత్వం కూలిపోవడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఇక.. అప్పటికే టీడీపీలో మారిన పరిణామాలు.. సినీ రంగంలో అవకాశాల నేపథ్యంలో కైకాల.. రాజకీయాల నుంచి నిష్క్రమించారు. ఉన్న రెండేళ్ల పాటైనా.. ఆయన మచిలీపట్నంపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. నరసాపురం-హైదరాబాద్ మధ్య నడిచే నరసాపురం ఎక్స్ప్రెస్ ఆక్యుపెన్సీ పెంచేలా బోగీలు ఏర్పాటు చేయించారు.
This post was last modified on December 23, 2022 12:40 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…