సినీ దిగ్గజంగా ఒక వెలుగు వెలిగిన కైకాల సత్యనారాయణ మృతితో తెలుగు సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. సీనీరంగంలో సుదీర్ఘ కాలం అంటే.. దాదాపు 60 ఏళ్లకు పైగానే బంధం ఏర్పరుచుకున్న కైకాల సత్యనారాయణ రాజకీయాల్లోనూ అజాతశతృవుగా వ్యవహరించారు. రాజకీయాల్లో ఉన్నది చాలా స్వల్ప కాలమే అయినా.. ఆయన నిబద్ధతను చాటుకున్నారు.
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రోత్సాహంతో టీడీపీ తరఫున అనేక సందర్భాల్లో కైకాల ఎన్నికల ప్రచారం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణాజిల్లా కౌతవరంలో జన్మించిన సత్యనారాయణ.. సినీ రంగంలోకి ప్రవేశిం చాక.. ఇదే జిల్లాకు చెందిన ఎన్టీఆర్తో అనుబంధం ఏర్పడింది. ఇదే..రాజకీయాల వైపు కూడా కైకాలను నడిపించింది. ఈ క్రమంలో నే 1996లో టీడీపీ తరఫున ఆయన మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు.
అప్పట్లో కాంగ్రెస్-టీడీపీలు మాత్రమే బలమైన ప్రత్యర్థులు. కాంగ్రెస్ తరఫున కొలుసు పెదరెడ్డయ్య యాద వ్ పోటీ చేశారు. కైకాల వర్సెస్ యాదవ్ల మధ్య హోరా హోరీ పోరు సాగింది. అయినా.. ఇక్కడి ప్రజలు కైకాల వైపే మొగ్గు చూపారు. 81,507 ఓట్ల మెజారిటీతో కైకాల విజయం దక్కించుకున్నారు. పార్టీ పట్ల అంకిత భావంతో ఆయన రూపాయి కూడా ఎన్నికల ఖర్చు తీసుకోకుండా.. తన సొంత సొమ్మును వినియోగించారని .. అప్పట్లో పార్టీలో చర్చ సాగింది.
అయితే అనూహ్యంగా అప్పటి వాజపేయి ప్రభుత్వం కూలిపోవడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఇక.. అప్పటికే టీడీపీలో మారిన పరిణామాలు.. సినీ రంగంలో అవకాశాల నేపథ్యంలో కైకాల.. రాజకీయాల నుంచి నిష్క్రమించారు. ఉన్న రెండేళ్ల పాటైనా.. ఆయన మచిలీపట్నంపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. నరసాపురం-హైదరాబాద్ మధ్య నడిచే నరసాపురం ఎక్స్ప్రెస్ ఆక్యుపెన్సీ పెంచేలా బోగీలు ఏర్పాటు చేయించారు.
This post was last modified on December 23, 2022 12:40 pm
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల విధ్వంసం ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తోకముడిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో…
ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిజంగానే పట్టు వదలని విక్రమార్కుడి మాదిరిగా సాగుతున్నారు. గిరిజనుల సమస్యల…