సినీ దిగ్గజంగా ఒక వెలుగు వెలిగిన కైకాల సత్యనారాయణ మృతితో తెలుగు సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. సీనీరంగంలో సుదీర్ఘ కాలం అంటే.. దాదాపు 60 ఏళ్లకు పైగానే బంధం ఏర్పరుచుకున్న కైకాల సత్యనారాయణ రాజకీయాల్లోనూ అజాతశతృవుగా వ్యవహరించారు. రాజకీయాల్లో ఉన్నది చాలా స్వల్ప కాలమే అయినా.. ఆయన నిబద్ధతను చాటుకున్నారు.
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రోత్సాహంతో టీడీపీ తరఫున అనేక సందర్భాల్లో కైకాల ఎన్నికల ప్రచారం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణాజిల్లా కౌతవరంలో జన్మించిన సత్యనారాయణ.. సినీ రంగంలోకి ప్రవేశిం చాక.. ఇదే జిల్లాకు చెందిన ఎన్టీఆర్తో అనుబంధం ఏర్పడింది. ఇదే..రాజకీయాల వైపు కూడా కైకాలను నడిపించింది. ఈ క్రమంలో నే 1996లో టీడీపీ తరఫున ఆయన మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు.
అప్పట్లో కాంగ్రెస్-టీడీపీలు మాత్రమే బలమైన ప్రత్యర్థులు. కాంగ్రెస్ తరఫున కొలుసు పెదరెడ్డయ్య యాద వ్ పోటీ చేశారు. కైకాల వర్సెస్ యాదవ్ల మధ్య హోరా హోరీ పోరు సాగింది. అయినా.. ఇక్కడి ప్రజలు కైకాల వైపే మొగ్గు చూపారు. 81,507 ఓట్ల మెజారిటీతో కైకాల విజయం దక్కించుకున్నారు. పార్టీ పట్ల అంకిత భావంతో ఆయన రూపాయి కూడా ఎన్నికల ఖర్చు తీసుకోకుండా.. తన సొంత సొమ్మును వినియోగించారని .. అప్పట్లో పార్టీలో చర్చ సాగింది.
అయితే అనూహ్యంగా అప్పటి వాజపేయి ప్రభుత్వం కూలిపోవడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఇక.. అప్పటికే టీడీపీలో మారిన పరిణామాలు.. సినీ రంగంలో అవకాశాల నేపథ్యంలో కైకాల.. రాజకీయాల నుంచి నిష్క్రమించారు. ఉన్న రెండేళ్ల పాటైనా.. ఆయన మచిలీపట్నంపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. నరసాపురం-హైదరాబాద్ మధ్య నడిచే నరసాపురం ఎక్స్ప్రెస్ ఆక్యుపెన్సీ పెంచేలా బోగీలు ఏర్పాటు చేయించారు.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…