ఏ నాయకుడికైనా.. సొంత జిల్లా.. సొంత ప్రాంతం అంటే.. సొంత ఇల్లు లెక్క. ఎలాంటి భద్రతా అవసరం లేదు. ఇటీవల గుజరాత్ ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ అక్కడ పర్యటించారు. అయితే.. ఆయన వ్యక్తిగత భద్రత ను పక్కన పెట్టి.. ఇది సొంత రాష్ట్రం ఇక్కడనాకు ఎలాంటి భయం లేదన్నారు.
అంటే.. సొంత రాష్ట్రంపై ఆయనకు అంత నమ్మకం. కానీ,ఏపీలో సీఎం జగన్కు తన సొంత జిల్లాపైనే నమ్మకం లేనట్టు ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
సీఎం జగన్ శుక్రవారం నుంచి మూడు రోజులు పాటు తన సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. అంటే.. ఒకరకంగా ఆయన తన పుట్టింటికి వచ్చినట్టే కదా! పైగా.. గత ఎన్నికల్లో రెండు ఎంపీ, 10 ఎమ్మెల్యే స్థానాలను కూడా సీఎం జగన్ గెలుచుకున్నారు. అంటే.. ప్రత్యర్థి అన్న మాటే లేదు. అయినా.. కూడా ఇక్కడ 3 వేల మందితో సీఎం జగన్ భద్రత కల్పించుకున్నారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
కడప జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీసులు కాకుండా ఇతర జిల్లాల నుంచి భారీ సంఖ్యలో పోలీసులను బందోబస్తుకు రప్పించారు. సుమారు 3000 మంది పోలీసులతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులందరికీ ఎస్పీ అన్బురాజన్ విధులను కేటాయించారు.
అంతేకాదు.. బాంబు స్క్వాడ్, పోలీస్ జాగిలాలు, మెటల్ డిటెక్టివ్ తదితర వాటితో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలు అన్నింటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మరి ఇదేం చోద్యమో.. అని నెటిజన్లు బుగ్గలు నొక్కుకుంటున్నారు.
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం నాడు హైదరాబాద్ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదులను…