Political News

ఈ గెలుపు రెడ్డిదా.. జ‌గ‌న్‌దా? భారీ స‌క్సెస్ బ్రో!

రాజ‌కీయాల‌లో చోటు చేసుకుని కొన్ని కొన్ని ప‌రిణామాల‌కు.. మ‌రికొన్నింటితో కార్యాకార‌ణ సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఏపీలో జ‌రిగిన ఒక ప‌రిణామం కూడా అలానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదేంటంటే.. ఏపీ స‌చివాల‌య ఉద్యోగుల‌ సంఘానికి ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇదేమీ .. మామూలుగా అయితే జ‌ర‌గ‌లేదు. అంతేకాదు.. ఈ ఎన్నిక‌ల‌ను టీడీపీ నేత‌లు వెయ్యిక‌ళ్ల‌తో ప‌రిశీలించారు. ఏం జ‌రుగుతుంది? అని లెక్క‌లు కూడా వేసుకున్నారు.

అదేస‌మ‌యంలో వైసీపీ నాయ‌కులు కూడా ఇదే త‌ర‌హాలో ఎదురు చూశారు. దీనికి కార‌ణం.. స‌చివాల‌య ఉద్యోగుల‌ సంఘం అధ్య‌క్షుడు వెంక‌ట్రామిరెడ్డి కేంద్రంగా చోటు చేసుకున్న అనేక రాజ‌కీయాలు. గ‌తంలో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు. వెంక‌ట్రామిరెడ్డి ఉద్యోగుల సంఘానికి నాయ‌కుడుగా ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న నోరు విప్పితే.. సీఎం జ‌గ‌న్ పేరు అల‌వోక‌గా వ‌స్తుంది. సీఎం స‌ర్‌.. లేక‌పోతే.. అంటూ.. ఆయ‌న ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు.

ఒకానొక ద‌శ‌లో ఉద్యోగులు సీఎం పైనా ప్ర‌భుత్వంపైనా నిప్పులు చెరిగిన‌ప్పుడు కూడా వెంక‌ట్రామిరెడ్డి క‌ట్టు త‌ప్ప‌కుండా త‌న అభిమానం చూపించారు. దీంతో ఆయ‌న‌కు టీడీపీకి మ‌ధ్య కూడా ఒక‌ద‌శ‌లో యుద్ధ‌మే జ‌రిగింది. దీంతో ఆయ‌న‌ను ఉద్యోగ సంఘం నాయ‌కుడిగా కంటే.. కూడా వైసీపీ నాయ‌కుడిగానే ఎక్కువ‌గా చూస్తున్నారు. ఇప్పుడు ఈ సంఘానికి జ‌రిగిన ఎన్నిక‌లో వెంక‌ట్రామిరెడ్డి ఓడిపోవాల‌ని.. టీడీపీ అనుకూల ఉద్యోగ సంఘాల నాయ‌కులు భావించారు.

ఎందుకంటే.. వైసీపీపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని.. ఉద్యోగులు ఈ ప్ర‌భుత్వం అంటే మండిప‌డుతున్నార‌ని.. సో.. ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉన్న వెంక‌ట్రామిరెడ్డి వంటివారిని ఓడించ‌డంద్వారా సీఎం జ‌గ‌న్‌కు లెస్స‌న్ చెప్పాల‌ని అనుకున్నారు. నిజానికి ఇది జ‌రిగి ఉంటే.. ప్ర‌భుత్వం డిఫెన్స్‌లో ప‌డి ఉండేది. కానీ, అనూహ్యంగా వెంక‌ట్రామిరెడ్డి భారీ విజ‌యం న‌మోదు చేశారు. ప్యాన‌ల్‌లోని 1,225 ఓట్ల‌కుగాను 1,162 ఓట్లు పోల‌య్యాయి.

అంతేకాదు.. ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి రామ‌కృష్ణ‌పై 288 ఓట్ల మెజార్టీతో వెంక‌ట్రామిరెడ్డి ఘ‌న విజ‌యం సాధించ‌డం విశేషం. అలాగే వెంక‌ట్రామిరెడ్డి ప్యానల్ 9 పోస్టుల్లో ఆరింటిని ద‌క్కించుకుని స‌త్తా చాటింది. ఈ ప‌రిణామాల‌తో ఉద్యోగుల్లో ప్ర‌భుత్వంపై వ్య‌తిర‌క‌త ఉందో లేదో స్ప‌ష్ట‌మ‌వుతోంద‌న్న‌ది వైసీపీ మాట‌. ఇక‌, టీడీపీ నేత‌లు మాత్రం ప్ర‌స్తుతానికి ఈ విష‌యం త‌మ‌కు తెలియ‌ద‌న్న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సో.. మొత్తానికి ఈ విజ‌యం వెంక‌ట్రామిరెడ్డి కంటే.. జ‌గ‌న్‌కే ఎక్కువ‌గా ఖుషీ నింపింద‌నేది వాస్త‌వం.

This post was last modified on December 22, 2022 2:59 pm

Share

Recent Posts

అప్పుడు కుటుంబ పేర్లు… ఇప్పుడు వీరుల పేర్లు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…

31 minutes ago

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

3 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

3 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

3 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

4 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

4 hours ago