Political News

తెలంగాణపై బాబు టోన్ మారలేదు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కూసుమంచి మండలం కేశవాపురంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీనేన‌ని చంద్ర‌బాబు అన్నారు. పార్టీకి పూర్వవైభవంతోపాటు శ్రేణుల్లో నూతనోత్తేజం నింపడమే లక్ష్యంగా పార్టీ నాయ‌కులు ప‌నిచేయాల‌ని బాబు సూచించారు. అనేక అభివృద్ధి ప‌నుల‌తో తెలంగాణ‌ను తీర్చిదిద్దామ‌ని చంద్ర‌బాబు చెప్పారు.

ఈ రోజు హైద‌రాబాద్ పురోగామి ప‌థంలో ప‌య‌నిస్తోందంటే.. దీనికి టీడీపీనే కార‌ణ‌మ‌ని చంద్ర‌బాబు చెప్పారు. రాష్ట్రానికి ప్ర‌ధాన ఆదాయం హైద‌రాబాద్ నుంచే వ‌స్తోంద‌న్న ఆయ‌న‌.. ప్ర‌భుత్వం అప్పులు చేయాల్సిన ప‌రిస్థితిలేకుండా హైద‌రాబాద్ కాపాడుతోంద‌ని అన్నారు. అదేస‌మ‌యంలో ఖమ్మం జిల్లాను కూడా తీర్చిదిద్దామని చంద్ర‌బాబు గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఐటీ స్థాపించామని చెప్పారు. అప్పట్లో సెల్‌ఫోన్‌ బువ్వ పెడుతుందా అని ఎగతాళి చేశారని.. ఇప్పుడు సెల్‌ఫోన్ లేకుండా ఎవరూ ఉండటం లేదని తెలిపారు.

ఎన్టీఆర్ తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టారు. ఎన్టీఆర్‌ విగ్రహం ముందు తీసుకున్న ఏ సంకల్పమైనా నెరవేరుతుంది. టీడీపీ స్థాపించి 40 ఏళ్లు కావొస్తుంది. తెలుగు వాళ్ల అభివృద్ధి కోసమే టీడీపీ పనిచేస్తుంది. తెలంగాణ అయినా, ఏపీ అయినా.. తెలుగువారి అభివృద్ధి కోసం పనిచేస్తాం. అని చంద్ర‌బాబు నొక్కి చెప్పారు.

తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో ఖమ్మం నగరమంతా జెండాలు, హోర్డింగ్లు, ఫ్లెక్సీలతో పసుపుమయంగా మారింది. ఉమ్మడి ఖమ్మం సహా రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను సమీకరించారు.

This post was last modified on December 22, 2022 9:26 am

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

10 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

11 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

14 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

14 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

15 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

15 hours ago