Political News

రాహుల్ జోడో యాత్ర‌కు కేంద్రం బ్రేక్‌.. రీజ‌న్ ఇదే!

చైనాలో విజృంభిస్తున్న క‌రోనా.. కొత్త వేరియెంట్ల ఫ‌లితంగా.. భార‌త్‌లోనూ ప్ర‌భుత్వం యుద్ధ ప్రాతిప‌దిక‌న ఏర్పాట్లు చేస్తోంది. ఇప్ప‌టికే తాజాగా దేశంలో మ‌ళ్లీ మాస్కులు ధ‌రించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఇది లాంటే.. కరోనా నిబంధ‌న‌ల పేరుతో.. కాంగ్రెస్‌పైనా.. కేంద్రం వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంది. కొవిడ్‌ నిబంధనలు పాటించే పరిస్థితి లేకుంటే భారత్‌ జోడో యాత్రను నిలిపివేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్రం కాంగ్రెస్‌కు సూచించింది.

ఈ మేరకు రాహుల్‌ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌కు కేంద్ర మంత్రి లేఖ రాశారు. ఇటీవ‌ల యాత్రలో పాల్గొని వెళ్లిన హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్‌..కరోనా బారిన పడినట్లు మంత్రి ప్ర‌స్తావించారు. సో.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో త‌ప్ప‌నిస‌రిగా క‌రోనా.. ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కేంద్రం సూచించింది. లేక‌పోతే.. యాత్ర‌ను నిలుపుద‌ల చేయాల‌ని కోరింది.

అయితే.. తాజా లేఖపై కాంగ్రెస్ స్పందించింది. “దయచేసి కొవిడ్ ప్రోటోకాల్‌లను ప్రకటించండి. మేము వాటిని అనుసరిస్తాం. అయితే రాజస్థాన్, కర్ణాటకలో బీజేపీ యాత్రలు చేస్తోంది.. మరి వారికి కూడా లేఖలు పంపారా?” అని కాంగ్రెస్ ఎదురు దాడి చేయ‌డం గ‌మ‌నార్హం. భారత్ జోడో యాత్రలో భాగంగా హరియాణా నుహ్లో ప్రవేశించిన రాహుల్ గాంధీ, బీజేపీ లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

“ద్వేషపూరితమైన మార్కెట్లో ప్రేమ అనే షాప్ను భారత జోడో యాత్ర ద్వారా ప్రారంభిస్తాను. మీలాంటి వాళ్లు దేశంలో ద్వేషాన్ని నింపేందుకు ప్రయత్నిస్తే, మాలాంటి వాళ్లు ప్రేమను పంచేందుకు వెళ్తారు“ అని రాహుల్ కామెంట్లు చేశారు. ప్ర‌స్తుతం ఈ కామెంట్లు జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.

This post was last modified on December 22, 2022 6:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

5 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

8 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

9 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

10 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

10 hours ago