Political News

రాహుల్ జోడో యాత్ర‌కు కేంద్రం బ్రేక్‌.. రీజ‌న్ ఇదే!

చైనాలో విజృంభిస్తున్న క‌రోనా.. కొత్త వేరియెంట్ల ఫ‌లితంగా.. భార‌త్‌లోనూ ప్ర‌భుత్వం యుద్ధ ప్రాతిప‌దిక‌న ఏర్పాట్లు చేస్తోంది. ఇప్ప‌టికే తాజాగా దేశంలో మ‌ళ్లీ మాస్కులు ధ‌రించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఇది లాంటే.. కరోనా నిబంధ‌న‌ల పేరుతో.. కాంగ్రెస్‌పైనా.. కేంద్రం వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంది. కొవిడ్‌ నిబంధనలు పాటించే పరిస్థితి లేకుంటే భారత్‌ జోడో యాత్రను నిలిపివేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్రం కాంగ్రెస్‌కు సూచించింది.

ఈ మేరకు రాహుల్‌ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌కు కేంద్ర మంత్రి లేఖ రాశారు. ఇటీవ‌ల యాత్రలో పాల్గొని వెళ్లిన హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్‌..కరోనా బారిన పడినట్లు మంత్రి ప్ర‌స్తావించారు. సో.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో త‌ప్ప‌నిస‌రిగా క‌రోనా.. ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కేంద్రం సూచించింది. లేక‌పోతే.. యాత్ర‌ను నిలుపుద‌ల చేయాల‌ని కోరింది.

అయితే.. తాజా లేఖపై కాంగ్రెస్ స్పందించింది. “దయచేసి కొవిడ్ ప్రోటోకాల్‌లను ప్రకటించండి. మేము వాటిని అనుసరిస్తాం. అయితే రాజస్థాన్, కర్ణాటకలో బీజేపీ యాత్రలు చేస్తోంది.. మరి వారికి కూడా లేఖలు పంపారా?” అని కాంగ్రెస్ ఎదురు దాడి చేయ‌డం గ‌మ‌నార్హం. భారత్ జోడో యాత్రలో భాగంగా హరియాణా నుహ్లో ప్రవేశించిన రాహుల్ గాంధీ, బీజేపీ లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

“ద్వేషపూరితమైన మార్కెట్లో ప్రేమ అనే షాప్ను భారత జోడో యాత్ర ద్వారా ప్రారంభిస్తాను. మీలాంటి వాళ్లు దేశంలో ద్వేషాన్ని నింపేందుకు ప్రయత్నిస్తే, మాలాంటి వాళ్లు ప్రేమను పంచేందుకు వెళ్తారు“ అని రాహుల్ కామెంట్లు చేశారు. ప్ర‌స్తుతం ఈ కామెంట్లు జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.

This post was last modified on December 22, 2022 6:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

24 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

1 hour ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago