ఏపీ సీఎం జగన్ ఆలోచనలను తమపై రుద్దవద్దంటూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఘాటు రిప్లయ్ ఇచ్చింది. జగన్ పేరు ఎత్తకుండానే దుమ్ముదులిపేసింది. “ఏపీ సీఎం ఆలోచనలు ఆయనకు ఉంటాయి. అవి మేం పుణికి పుచ్చుకున్నామని ఎవరు చెప్పారు? అలా అనుకుంటే..దేశంలో 30 మంది ముఖ్యమంత్రులు ఉన్నా రు. వారు చేస్తున్నవన్నీ కేంద్రం చేస్తుందా? మీ ఆలోచన తప్పు” అని కేంద్రం వైసీపీ ఎంపీలకు తగిన విధంగా సమాధానం చెప్పింది.
ఇంతకీ ఏం జరిగింది?
ఏపీలో అమలుచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ గురించి.. పార్లమెంట్లో తాజాగా చర్చ జరిగింది.. దేశ వ్యాప్తంగా ఇటువంటి వ్యవస్థను అమలు చేసే ఆలోచనలో కేంద్రం ఏమైనా ఉందానని వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారు. దీంతో దిగ్గున తన సీటులోంచి లేచిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి, ఫైర్ బ్రాండ్ నిరంజన్ జ్యోతి ఘాటు సమాధనం ఇచ్చారు. ఇది లిఖిత పూర్వకమే అయినా.. చదివి వినిపించారు.
“గ్రామ సచివాలయ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలుచేసే ప్రతిపాదనేమీ మా వద్ద లేదు. ఇది ఏపీ సీఎంకు వచ్చిన ఆలోచన. దీనిని అక్కడే కొనసాగించుకోండి. మాపై రుద్దొద్దు” అని మంత్రి చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్వహించిన సమీక్షలో.. ప్రభుత్వ సేవలు అందించడానికి ప్రతి 2వేల మందికి ఒకటి చొప్పున ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ గురించి.. సీఆర్ఎం నివేదికలో పేర్కొన్న విషయం నిజమేనని ఆమె తెలిపారు.
అయితే.. వీటిని దేశ వ్యాప్తంగా అమలు చేసే ఉద్దేశం ఉందా అని… వైసీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరిలు పార్లమెంటులో ప్రశ్నించారు. దీంతో ఆమె ప్రస్తుతానికి ఆ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రతిపాదనేదీ లేదని చెప్పడంతో పాటు ఒకింత ఘాటుగా.. రిప్లయ్ ఇచ్చారు. దీంతో ఎంపీలు సైలెంట్ అయ్యారు. అయితే.. ఎందుకు అమలు చేయడం లేదనే విషయంపై మాత్రం ఆమె రియాక్ట్ కాలేదు.
This post was last modified on December 21, 2022 3:39 pm
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…
అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్ని రివర్స్లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…