ఢిల్లీ మద్యం కేసు ఏమో కానీ కొత్త ప్రశ్నలకు తావిస్తోంది. ఏదైనా మాట్లాడినంతనే ఆంధ్రా.. తెలంగాణ అంటూ పాయింట్ల మీద పాయింట్లు తెర మీదకు తీసుకొచ్చే కల్వకుంట్ల ఫ్యామిలీ ఇప్పటికి తెలంగాణ అంటే తమ పార్టీనేనని.. తమ పార్టీనే తెలంగాణ అన్నట్లుగా మాట్లాడటం తెలిసిందే. మాటల్లో వినిపించే తెలంగానం చేతల్లో ఎందుకు మిస్ అవుతుందన్నది ప్రశ్న. తెలంగాణ ప్రయోజనాల కోసం అహరహం శ్రమించే కల్వకుంట్ల ఫ్యామిలీకి.. ఈడీ ఛార్జిషీట్లో కవిత పేరు ఉండటం ఇబ్బంది కలిగించేదే.
రాజకీయంగా ఇరుకున పడేయటం కోసం కవిత పేరును లాగారన్నదే పాయింట్ అయితే.. ఆ మాట నిజమే అనుకున్నా.. ఆమె వ్యాపారం చేసిన వారిలో అత్యధికులు ఆంధ్రా మూలాలు.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు ఉండటాన్ని ఎలా చూస్తారు? ఏమని చెబుతారు? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. తాజాగా బయటకు వచ్చిన ఈడీ ఛార్జిషీట్ లో కనిపించిన పేర్లలో..
ఈడీ చేసిన ఆరోపణల్లో నిజం లేదని అనుకున్నా.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారితో కలిసి వ్యాపారం చేశారన్న విషయాన్ని మాత్రం కొట్టి పారేయలేం కదా? అన్నది ప్రశ్నగా మారింది. ఇంతకాలం తెలంగాణ పేరుతో సెంటిమెంట్ క్రియేట్ చేసి.. రాజకీయంగా లబ్థి పొందిన కేసీఆర్ కుటుంబం రానున్న రోజుల్లో అలాంటి అస్త్రాన్ని తీసేందుకు సాధ్యం కాదంటున్నారు.
ఒకవేళ అలాంటి ప్రయత్నాలు చేస్తే.. కవిత వ్యాపార భాగస్వాముల వ్యవహారాన్ని విపక్షాలు తెర మీదకు తేవటం ద్వారా ఇరుకున పడేసే అవకాశం ఉందంటున్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో తెలంగాణ ప్రజల్లోనూ కొత్త చర్చ మొదలు కావటం ఖాయమంటున్నారు. ఏమైనా.. ఢిల్లీ మద్యం కేసు కల్వకుంట్ల కుటుంబానికి స్పీడ్ బ్రేకర్ గా మారుతుందన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on December 21, 2022 1:04 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…