ఢిల్లీ మద్యం కేసు ఏమో కానీ కొత్త ప్రశ్నలకు తావిస్తోంది. ఏదైనా మాట్లాడినంతనే ఆంధ్రా.. తెలంగాణ అంటూ పాయింట్ల మీద పాయింట్లు తెర మీదకు తీసుకొచ్చే కల్వకుంట్ల ఫ్యామిలీ ఇప్పటికి తెలంగాణ అంటే తమ పార్టీనేనని.. తమ పార్టీనే తెలంగాణ అన్నట్లుగా మాట్లాడటం తెలిసిందే. మాటల్లో వినిపించే తెలంగానం చేతల్లో ఎందుకు మిస్ అవుతుందన్నది ప్రశ్న. తెలంగాణ ప్రయోజనాల కోసం అహరహం శ్రమించే కల్వకుంట్ల ఫ్యామిలీకి.. ఈడీ ఛార్జిషీట్లో కవిత పేరు ఉండటం ఇబ్బంది కలిగించేదే.
రాజకీయంగా ఇరుకున పడేయటం కోసం కవిత పేరును లాగారన్నదే పాయింట్ అయితే.. ఆ మాట నిజమే అనుకున్నా.. ఆమె వ్యాపారం చేసిన వారిలో అత్యధికులు ఆంధ్రా మూలాలు.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు ఉండటాన్ని ఎలా చూస్తారు? ఏమని చెబుతారు? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. తాజాగా బయటకు వచ్చిన ఈడీ ఛార్జిషీట్ లో కనిపించిన పేర్లలో..
ఈడీ చేసిన ఆరోపణల్లో నిజం లేదని అనుకున్నా.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారితో కలిసి వ్యాపారం చేశారన్న విషయాన్ని మాత్రం కొట్టి పారేయలేం కదా? అన్నది ప్రశ్నగా మారింది. ఇంతకాలం తెలంగాణ పేరుతో సెంటిమెంట్ క్రియేట్ చేసి.. రాజకీయంగా లబ్థి పొందిన కేసీఆర్ కుటుంబం రానున్న రోజుల్లో అలాంటి అస్త్రాన్ని తీసేందుకు సాధ్యం కాదంటున్నారు.
ఒకవేళ అలాంటి ప్రయత్నాలు చేస్తే.. కవిత వ్యాపార భాగస్వాముల వ్యవహారాన్ని విపక్షాలు తెర మీదకు తేవటం ద్వారా ఇరుకున పడేసే అవకాశం ఉందంటున్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో తెలంగాణ ప్రజల్లోనూ కొత్త చర్చ మొదలు కావటం ఖాయమంటున్నారు. ఏమైనా.. ఢిల్లీ మద్యం కేసు కల్వకుంట్ల కుటుంబానికి స్పీడ్ బ్రేకర్ గా మారుతుందన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on December 21, 2022 1:04 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…