ఢిల్లీ మద్యం కేసు ఏమో కానీ కొత్త ప్రశ్నలకు తావిస్తోంది. ఏదైనా మాట్లాడినంతనే ఆంధ్రా.. తెలంగాణ అంటూ పాయింట్ల మీద పాయింట్లు తెర మీదకు తీసుకొచ్చే కల్వకుంట్ల ఫ్యామిలీ ఇప్పటికి తెలంగాణ అంటే తమ పార్టీనేనని.. తమ పార్టీనే తెలంగాణ అన్నట్లుగా మాట్లాడటం తెలిసిందే. మాటల్లో వినిపించే తెలంగానం చేతల్లో ఎందుకు మిస్ అవుతుందన్నది ప్రశ్న. తెలంగాణ ప్రయోజనాల కోసం అహరహం శ్రమించే కల్వకుంట్ల ఫ్యామిలీకి.. ఈడీ ఛార్జిషీట్లో కవిత పేరు ఉండటం ఇబ్బంది కలిగించేదే.
రాజకీయంగా ఇరుకున పడేయటం కోసం కవిత పేరును లాగారన్నదే పాయింట్ అయితే.. ఆ మాట నిజమే అనుకున్నా.. ఆమె వ్యాపారం చేసిన వారిలో అత్యధికులు ఆంధ్రా మూలాలు.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు ఉండటాన్ని ఎలా చూస్తారు? ఏమని చెబుతారు? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. తాజాగా బయటకు వచ్చిన ఈడీ ఛార్జిషీట్ లో కనిపించిన పేర్లలో..
ఈడీ చేసిన ఆరోపణల్లో నిజం లేదని అనుకున్నా.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారితో కలిసి వ్యాపారం చేశారన్న విషయాన్ని మాత్రం కొట్టి పారేయలేం కదా? అన్నది ప్రశ్నగా మారింది. ఇంతకాలం తెలంగాణ పేరుతో సెంటిమెంట్ క్రియేట్ చేసి.. రాజకీయంగా లబ్థి పొందిన కేసీఆర్ కుటుంబం రానున్న రోజుల్లో అలాంటి అస్త్రాన్ని తీసేందుకు సాధ్యం కాదంటున్నారు.
ఒకవేళ అలాంటి ప్రయత్నాలు చేస్తే.. కవిత వ్యాపార భాగస్వాముల వ్యవహారాన్ని విపక్షాలు తెర మీదకు తేవటం ద్వారా ఇరుకున పడేసే అవకాశం ఉందంటున్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో తెలంగాణ ప్రజల్లోనూ కొత్త చర్చ మొదలు కావటం ఖాయమంటున్నారు. ఏమైనా.. ఢిల్లీ మద్యం కేసు కల్వకుంట్ల కుటుంబానికి స్పీడ్ బ్రేకర్ గా మారుతుందన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on December 21, 2022 1:04 pm
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…