Political News

రాజకీయంలో తెలంగానం.. వ్యాపారం ఆంధ్రోళ్లతోనా?

ఢిల్లీ మద్యం కేసు ఏమో కానీ కొత్త ప్రశ్నలకు తావిస్తోంది. ఏదైనా మాట్లాడినంతనే ఆంధ్రా.. తెలంగాణ అంటూ పాయింట్ల మీద పాయింట్లు తెర మీదకు తీసుకొచ్చే కల్వకుంట్ల ఫ్యామిలీ ఇప్పటికి తెలంగాణ అంటే తమ పార్టీనేనని.. తమ పార్టీనే తెలంగాణ అన్నట్లుగా మాట్లాడటం తెలిసిందే. మాటల్లో వినిపించే తెలంగానం చేతల్లో ఎందుకు మిస్ అవుతుందన్నది ప్రశ్న. తెలంగాణ ప్రయోజనాల కోసం అహరహం శ్రమించే కల్వకుంట్ల ఫ్యామిలీకి.. ఈడీ ఛార్జిషీట్లో కవిత పేరు ఉండటం ఇబ్బంది కలిగించేదే.

రాజకీయంగా ఇరుకున పడేయటం కోసం కవిత పేరును లాగారన్నదే పాయింట్ అయితే.. ఆ మాట నిజమే అనుకున్నా.. ఆమె వ్యాపారం చేసిన వారిలో అత్యధికులు ఆంధ్రా మూలాలు.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు ఉండటాన్ని ఎలా చూస్తారు? ఏమని చెబుతారు? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. తాజాగా బయటకు వచ్చిన ఈడీ ఛార్జిషీట్ లో కనిపించిన పేర్లలో..

  • మాగుంట శ్రీనివాసులు రెడ్డి
  • మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ్ రెడ్డి
  • అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి
  • బోయినపల్లి అభిషేక్
  • బుచ్చి బాబు
  • అరుణ్ పిళ్లై
  • సమీర్ మహేంద్రు
  • బినయ్ బాబు
  • విజయ్ నాయర్
  • విజయ్ నాయర్
  • కల్వకుంట్ల కవిత.
    ఈ మొత్తం పేర్లలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారి కంటే కూడా ఆంధ్రా.. ఇతర ప్రాంతాలకు చెందిన వారే ఉండటాన్ని రాజకీయ పక్షాలు ఆయుధంగా మలుచుకుంటాయని చెబుతున్నారు. తాజాగా కవిత పేరు ఎక్కువసార్లు వినపించటానికి.. కనిపించటానికి కారణం ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన సమీర్ మహేంద్రు.. శరత్ చంద్రారెడ్డి.. బినయ్ బాబు.. విజయ్ నాయర్.. బోయినపల్లి అభిషేక్ ల నుంచి తీసుకున్న స్టేట్ మెంట్ల ద్వారానే ఈడీ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు రచ్చ ఒక ఎత్తు అయితే.. అందులో ఉన్న పేర్ల కారణంగా ఇప్పుడు మొదలైన కొత్త చర్చ గులాబీ బాస్ కు ఇబ్బందులకు గురి చేసేలా ఉందంటున్నారు.

ఈడీ చేసిన ఆరోపణల్లో నిజం లేదని అనుకున్నా.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారితో కలిసి వ్యాపారం చేశారన్న విషయాన్ని మాత్రం కొట్టి పారేయలేం కదా? అన్నది ప్రశ్నగా మారింది. ఇంతకాలం తెలంగాణ పేరుతో సెంటిమెంట్ క్రియేట్ చేసి.. రాజకీయంగా లబ్థి పొందిన కేసీఆర్ కుటుంబం రానున్న రోజుల్లో అలాంటి అస్త్రాన్ని తీసేందుకు సాధ్యం కాదంటున్నారు.

ఒకవేళ అలాంటి ప్రయత్నాలు చేస్తే.. కవిత వ్యాపార భాగస్వాముల వ్యవహారాన్ని విపక్షాలు తెర మీదకు తేవటం ద్వారా ఇరుకున పడేసే అవకాశం ఉందంటున్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో తెలంగాణ ప్రజల్లోనూ కొత్త చర్చ మొదలు కావటం ఖాయమంటున్నారు. ఏమైనా.. ఢిల్లీ మద్యం కేసు కల్వకుంట్ల కుటుంబానికి స్పీడ్ బ్రేకర్ గా మారుతుందన్న మాట వినిపిస్తోంది.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

8 minutes ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

12 minutes ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

28 minutes ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

1 hour ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

2 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

3 hours ago