Political News

జగన్ ను ఇరుకున పడేసిన అంబటి

ఏపీ మంత్రి అంబటికి కష్టకాలం వచ్చేసింది. ఆయనపై ఆరోపణలు రావటం.. తనకున్న వాయిస్ బేస్ తో తన మీద వచ్చే విమర్శల్ని.. ఆరోపణల్ని కొట్టిపారేస్తుంటారు. అదే సమయంలో అధినేతకు నచ్చిన రీతిలో రాజకీయ ప్రత్యర్థులపై మసాలా గుప్పించి మరీ విమర్శలు చేస్తూ మనసును దోచేస్తుంటారు. అలాంటి ఆయనకు.. ఆయన్ను అభిమానించే సీఎం జగన్ కు కష్టకాలం వచ్చినట్లుగా చెప్పక తప్పదు. తాజాగా ఒక ఉదంతంలో చిక్కుకుపోయిన అంబటి ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి.

ఒక కార్మికుడి మరణం నేపథ్యంలో రూ.5 లక్షలు ప్రభుత్వం నుంచి సాయంగా బాదితుడికుటుంబానికి అందగా.. ఆ డబ్బులు చేతికి రావాలంటే మంత్రి అంబటి రూ.2.5 లక్షలు అడిగారన్న ఆరోపణలు వచ్చిన రెండు రోజులు కావటం.. ఈ ఇష్యూ పెను సంచలనంగా మారటం తెలిసిందే. అయితే.. ఈ ఎపిసోడ్ లో తాజాగా బాధితుడి తల్లితండ్రి ఇద్దరు తమ కుమార్తె మీద ఒట్టేసి మరీ ప్రమాణం చేయటం.. తాము చేస్తున్న ఆరోపణలు నిజమని.. మంత్రి అంబటి తమను లంచం అడిగినట్లుగా వారు పేర్కొన్న వైనం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది.

చనిపోయి.. పుట్టెడు శోకంలో ఉన్న బాధితుడి కుటుంబాన్ని మరింత వేదనకు గురి చేసేలా మంత్రిఅంబటి వ్యవహరించారని.. వచ్చిన పరిహారంలో సగం తనకు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఇప్పటికే బాధిత కుటుంబం వీడియోలో వెల్లడించటం తెలిసిందే. అయితే.. ఈ ఆరోపణను అంబటి తీవ్రంగా కొట్టేశారు. ఊహించని విధంగా అంబటి తమను డబ్బులు అడిగారన్న బాధితులు అక్కడితో ఆగకుండా.. తమ కుమార్తె మీద ఒట్టు వేయటంతో ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయిన పరిస్థితి.

ఆరోపణలు రావటం.. ఆ వెంటనే రియాక్టు అయి డ్యామేజ్ కంట్రోల్ చేసే దానికి భిన్నంగా తాజా పరిస్థితి ఉందంటున్నారు. ఈ మధ్యనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రులు.. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని.. రానున్నది ఎన్నికల కాలమని ప్రజలు గమిస్తుంటారని తప్పులు చేస్తే ఇబ్బందులు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు. అలా తాను ఓపెన్ అయ్యాక బయటకు వచ్చిన అంబటి వ్యవహారంలో ఆయన ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఆరోపణల బురదలో నిండా మునిగిపోయిన అంబటి విషయంలో సీఎం జగన్ కఠినంగా వ్యవహరిస్తారా? చూసి చూడనట్లుగా ఉంటారన్నది ఒక ప్రశ్న. ఈ రియాక్షన్ ఆధారంగానే జగన్ మాటలకు విలువ ఉంటుందని చెబుతున్నారు. తాను ఇరుక్కుపోవటమే కాదు.. సీఎం జగన్ ను సైతం అంబటి ఇరికించేశారన్న విమర్శ వినిపిస్తోంది.

This post was last modified on December 21, 2022 6:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

51 minutes ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

1 hour ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

1 hour ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

2 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

5 hours ago