Political News

భాగ్యనగరంపై దేశం నేత గురి

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణపై గురి పెట్టారు. 2023 ఎన్నికల్లో తెలంగాణను ఓ పట్టుపట్టాలనుకుంటున్న దేశం అధినేత హైదరాబాద్లో విజయవకాశాలు బేరీజు వేసుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ తీరుపై సెటిలర్లతో పాటు తెలంగాణ జనం కూడా విసుగు చెందారని గ్రహించిన చంద్రబాబు.. దాన్ని క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు. హెదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని నియోజవర్గాల ప్రజల్లో టీడీపీపై విశ్వాసం కలిగించేందుకు ఆయన వ్యూహరచన చేస్తున్నారు..

రాజధానిలో భారీ సభ

హైదరాబాద్ మహానగరంలో టీడీపీ త్వరలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. కనీ వినీ ఎరుగుని రీతిలో జన సమీకరణ చేయాలని భావిస్తోంది. ఈ బాధ్యతను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు అప్పగించారు. హైదరాబాద్ సభ సాధారణ ఓటర్లను ఆకర్షించేదిగా ఉంటూనే, బీసీ ఓటర్లలో నమ్మకం పెంచేదిగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారట. సభ నిర్వహించే తేదీ ఖరారైన తర్వాత ఏర్పాట్లను తానే స్వయంగా రోజువారీ పర్యవేక్షిస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో పార్టీ తెలంగాణ యూనిట్లో జోష్ పెరిగింది..గతంలో పార్టీ నిర్వహించిన సింహ గర్జన తరహాలో హైదరాబాద్ సభ ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు..

బుధవారం ఖమ్మంలో భారీ బహిరంగ సభ

ఖమ్మం బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం చంద్రబాబు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఖమ్మం సభకు వెళతారు. రసూల్ పురా జంక్షన్లో ఎన్టీయార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన తర్వాత మార్గమధ్యంలో చాలా మందిని కలుస్తూ ఆయన ఖమ్మం చేరుకుంటారు, ఖమ్మం సభకు మూడు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. యువత భారీ సంఖ్యలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో పార్టీ పునరుజ్జీవనానికి ఖమ్మం సభ నాంది పలుకుతుంది..

వేర్వేరు నగరాల్లో టీడీపీ సభ

ఖమ్మం సభతో టీడీపీ కార్యకర్తల్లో ఊపు వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం తర్వాత నిజామాబాద్, వరంగల్ , మహబూబ్ నగర్ సభలు ఉంటాయి. వాటికి కూడా ఖమ్మం తరహాలోనే భారీ జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ సభను ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై తర్జన భర్జనలు పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేసేందుకు బహిరంగ సభను వినియోగించుకోవాలని నిర్ణయించారు..

This post was last modified on December 20, 2022 1:35 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

3 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

3 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

4 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

4 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

5 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

5 hours ago