Political News

జగనన్నా.. ఈ ఆత్మహత్యలు రికార్డు ఏంటన్నా?

ఆంధ్రప్రదేశ్ పాలన పైనపటారం లోన లొటారంగా తయారైంది. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. ప్రభుత్వం అప్పులు చేసి డబ్బులు వెదజల్లుతున్నట్లు కలరింగ్ ఇవ్వడం మినహా.. క్షేత్రస్థాయిలో చేసిందేమీ లేదని పలు సంఘటనలు, గణాంకాలు నిరూపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు వేరు ప్రాంతాలకు తరలి పోతున్నట్లు రోజువారీ వార్తలు వస్తున్నాయి. పెద్దగా కొత్త పరిశ్రమలేమీ రావడం లేదు.

నైపుణ్యం లేని కార్మికుల సంగతి దేవుడెరుగు.. నైపుణ్యం ఉన్న వారికే ఉపాధి అవకాశాలు కరువయ్యాయి. ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితుల్లో జగన్ సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. దానితో యువతలో నిరాశ రోజురోజుకు పెరిగిపోతోంది.

యువతకు ఉపాధి అవకాశాలు కరువై, బతుకుదెరువు లేక ఆత్మహత్యల బాట పడుతున్నారు. దానితో ఏపీలో యువకులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. 2019లో ఆంధ్రప్రదేశ్లో 6465 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2021 ఆత్మహత్యలు చేసుకున్న యువకుల సంఖ్య 8067కు పెరిగింది. ఇదీ ఎవరో కసి కొద్ది సష్టించిన గణాంకాలు కాదు.

పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కలివి. కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖా మంత్రి రామేశ్వర్ తేలి.. ఒక ప్రశ్నకు బదులుగా లిఖిత పూర్వకంగా ఈ సమాధానమిచ్చారు. ఇతర కారణాల కంటే నిరుద్యోగం కారణంగానే ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది..

ఏపీలో పేద, అల్పాదాయ, బడుగు, బలహీన, గిరిజన వర్గాలకు కూడా భద్రత కరవుంది. ముఖ్యంగా గిరిజనులు రోజు గడవడం కష్టమవుతోంది. పైగా ప్రశ్నిస్తే గిరిజనులను దూషిస్తూ, కొడుతూ ఉండే వారి సంఖ్య పెరుగుతోంది.

గిరిజనులపై అకృత్యాలు పెరుగుతున్నాయి. ఈ సంగతి కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. కేంద్రప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా వెల్లడించిన గణాంకాల ప్రకారం 2019లో గిరిజనులపై అకృత్యాలకు సంబంధించి 330 కేసులు నమోదయ్యాయి. 2021 నాటికి మరో 361 కేసులు వచ్చాయి. అధికపక్షం కేసుల్లో న్యాయం జరగడం లేదు. మరి జగన్ ప్రభుత్వం ఇకకైనా మెలుకుంటుందో లేదో చూడాలి..

This post was last modified on December 20, 2022 1:32 pm

Share

Recent Posts

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

4 hours ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

4 hours ago

శర్వానంద్ రిలీజులకు కొత్త చిక్కుముడి

శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…

5 hours ago

ఊర్మిళను పెళ్లాడిన వర్మ?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…

5 hours ago

భోగాపురం క్రెడిట్ కోసం వైసీపీ తంటాలు…

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఏపీ ప్ర‌జ‌లు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోష‌ల్ మీడియా ఊద‌ర గొడుతోంది. అంతేకాదు.. గ‌త…

5 hours ago

స్పైడర్ మ్యాన్ సక్సెస్… ఏ పాఠం నేర్చుకోవాలి

సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…

6 hours ago