ఏపీ అధికార పార్టీ వైసీపీలో చాలా మంది ఫైర్ బ్రాండ్ నాయకులు ఉన్నారు. వీరికి తిరుగులేదని.. వారి అనుచరులు, పార్టీ అధిష్టానం కూడా నమ్ముతోంది. అయితే, ఎంతైనా ప్రజాస్వామ్యం కదా.. ప్రజాభీష్టం లేకుంటే.. పవన్ లాంటి వాడే ఓడిపోయిన పరిస్థితి ని చూశాం కదా! ఇప్పుడు వీరి పరిస్థితి కూడా ఇలానే ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇక, ఫైర్ బ్రాండ్లలో మరింత ఫైర్ అయ్యేవారి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం..
మంత్రి రోజా: నగరి నియోజకవర్గం నుంచి ప్రాధాన్యం వహిస్తున్నారు. రెండు సార్లుగా వరుస విజయాలు అందుకుంటున్నారు. మాజీ మంత్రి దివంగత గాలి ముద్దుకృష్ణమ ను ఓడించారనే రికార్డు సొంతం చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన కుమారుడు భాను ప్రకాష్ను కూడా ఓడించారు. కానీ, ఇప్పుడు సొంత నేతలే ఆమెపై కత్తి కట్టారు. ప్రత్యర్థి ఎవరో కూడా తెలియనంతగా ఇప్పుడు ఆమెకు వ్యతిరేకత పెరిగిపోయింది. దీంతో సొంత పార్టీ నేతలే తన పుట్టి ముంచడం ఖాయమని రోజా తలపోస్తున్నారు.
మాజీ మంత్రి కురసాల: కురసాల కన్నబాబు.. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కాపు నాయకుడు.. ఫైర్ బ్రాండ్. ఈయన పరిస్థితి కూడా ఇంతే. రెడ్డి వర్గంతో ఆయనకు ఏర్పడిన విభేదాలు.. నియోజకవర్గంలో ఆయనను ఓడిస్తామని.. రెడ్డి వర్గం బెదిరించే వరకు వచ్చేసింది. కాపులు కూడా ఇప్పుడు పవన్ జపం చేస్తున్నారు. పవన్ ఇక్కడ నుంచి పోటీ చేస్తే గెలిపించుకుంటామని కాకినాడ కాపు సంఘం.. ఇటీవల వనభోజనాల సమయంలో తీర్మానం చేసింది.
మంత్రి అంబటి: జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు.. సత్తెన పల్లి నుంచి సుదీర్ఘ కాలం తర్వాత.. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. టీడీపీ కీలక నేత దివంగత కోడెల శివప్రసాద్పై విజయం దక్కించుకున్నానన్న ఆనందం.. ఆయనలో కనిపించడం లేదు. ఎందుకంటే.. సొంత పార్టీలోనే వేరు కుంపట్లు.. అంబటికి వ్యతిరేకంగా రాజకీయాలు ఆయనను కలవర పెడుతున్నారు. అధిష్టానం కూడా.. ఈసారి అక్కడ కాదులే అనే సంకేతాలు పంపేసింది.
మాజీ మంత్రి కొడాలినాని: గుడివాడ నుంచి వరుస విజయాలు తప్ప.. పరాజయం ఎరుగని.. నానికి..ఇప్పుడు సైలెంట్ యాంటి ఓటు బ్యాంకు పెరుగుతోంది. మంత్రిగా కూడా తమకు న్యాయం చేయలేక పోయారని.. ఇక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైకి మాత్రం ఆహా ఓహో అంటున్నా.. క్యాసినో వ్యవహారం తర్వాత.. మాజీ మంత్రి గ్రాఫ్ అమాంతం ఢమాల్ మందట. ఇలా..చాలా మంది ఫైర్ బ్రాండ్ల పరిస్థితి ఇలానే ఉందని పార్టీలోనే ఓవర్గం చెబుతుండడం గమనార్హం.
This post was last modified on December 20, 2022 1:25 pm
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…