Political News

మాచ‌ర్ల టాక్‌: చూసిర‌మ్మంటే.. కాల్చి వ‌చ్చార‌ట‌..

రాజ‌కీయాల్లో కొన్ని విష‌యాలు దాచాల‌న్నా.. దాగ‌వు. ఇది నిష్టుర స‌త్యం. నాయ‌కుల మ‌న‌సులో ఏముందో .. వారి చేత‌ల్లోనో.. మాట‌ల్లో స్ప‌ష్టంగా తెలుస్తుంది. తాజాగా ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని మాచ‌ర్ల‌లో వైసీపీ వ‌ర్సెస్‌ టీడీపీ వ‌ర్గాల మ‌ధ్య పోరు ఏ రేంజ్‌లో సాగిందో అంద‌రికీ తెలిసిందే. కేవ‌లం మాచ‌ర్ల నియోజ‌క‌ వర్గంలోనే కాదు.. ఆ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లోకి కూడా టీడీపీని రాకుండా చేయ‌డంలో వైసీపీ నాయ‌కులు కృత‌కృత్యుల‌య్యారు.

అయితే.. ఎంత కార్య‌క‌ర్త‌ల‌ను అనుకున్నా.. నాయ‌కుల‌ను అనుకున్నా..వెనుక ఉన్న మూల‌విరాట్లు చెప్పకుండా.. ఏమైనా జ‌రుగుతుందా? శివుడి ఆజ్ఞ‌లేకుండా.. అన్న‌ట్టుగా మాచ‌ర్ల‌లోనూ అదే జ‌రిగింద‌ని పిన్నెల్లి వ‌ర్గ‌మే చెబుతోంది. తాజాగా జ‌రిగిన ప‌రిణామాల‌కు.. గ‌త స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన ప‌రిణామాల‌కు పెద్ద‌గా తేడా ఏమీలేదు. నియోజ‌క‌వ‌ర్గాన్ని మూడు ద‌శాబ్దాలుగా ఏలుతున్న పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి మాటే.. ఇక్క‌డ నెగ్గుతోంది.

ఇటీవ‌ల కాలంలో ఇది మ‌రింత‌గా పెరిగింద‌ని అంటున్నారు ప‌రిశీలకులు. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని భావించారు. కానీ, రాలేదు. ఈ క్ర‌మంలోనే కొంత దుమారం రేపారు. అయితే.. సీఎం జ‌గ‌న్ దీనిని ప‌ట్టించుకోలేదు. ఇది పార్టీ అనుచ‌రుల్లో అసంతృప్తిని పెంచేలా చేసింది. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా టీడీపీ ఇక్క‌డ ఇదేం ఖ‌ర్మ చేప‌డితే.. అది కాస్తా.. విజ‌య‌వంతం అయింద‌ని మీడియాలో వ‌స్తే.. త‌న‌కు ఇబ్బంది త‌ప్ప‌ద‌ని ఎమ్మెల్యే అంచ‌నా వేశారు.

ఈ క్ర‌మంలోనే చూసిర‌మ్మ‌ని.. త‌న వారిని పంపిస్తే.. వారు కాస్తా.. కాల్చుకొచ్చేశార‌ని మాచ‌ర్ల పొలిటీసియ‌న్ల మ‌ధ్య జోరుగా చ‌ర్చ సాగుతోంది. స‌రే.. ఇప్పుడు ఇదంతా ఎందుకు ? అంటే.. పార్టీ అధిష్టానం త‌ర‌ఫున కీల‌క స‌ల‌హాదారు ఒక‌రు.. అసలు ఏం జ‌రిగింద‌నే విష‌యంపై ఆరా తీశారు. ఈ క్ర‌మంలోనే .. ఎమ్మెల్యే త‌ప్పులేదు.. ఆయ‌న చూసిర‌మ్మ‌న్నారంటూ.. ఆయ‌న‌త‌ర‌ఫున కీల‌క అనుచ‌రులు.. చెప్పుకొస్తున్నారు. ఇదీ.. సంగ‌తి!!

This post was last modified on December 19, 2022 9:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

38 minutes ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

2 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

3 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

3 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

5 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

6 hours ago