వచ్చే ఎన్నికలకు సంబంధించి పొత్తులు.. పొర్లాటలు.. అంటూ ఏపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటాయని.. కొన్నాళ్లుగా చర్చ నడుస్తోంది. అయితే.. ఇప్ప టికే బీజేపీ-జనసేన పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. ఇక, టీడీపీ ప్రస్తుతానికి ఒంటరిగా ఉంది. కమ్యూనిస్టులు కూడా ఎటూ దారి లేక.. అలానే ఉండిపోయారు. ఏదో ఒక మార్గం దక్కకపోతుందా.. అని కామ్రేడ్స్ ఎదురు చూస్తున్నారు.
ఇక, మిగిలిన చిన్నా చితకా పార్టీలు బీఎస్పీ, జైభీమ్ వంటివి యథాలాపంగా.. ఎన్నికల సమయానికి ఏదో ఒక పార్టీకి మద్దతుగా నిలుస్తాయి. ఇతమిత్థంగా చెప్పాలంటే.. ప్రధాన పోరు మాత్రం వైసీపీ-టీడీపీ-జనసేనల మధ్యే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చూస్తే.. పవన్ వ్యతిరేక ఓట్లు చీలనివ్వబోమని చెబుతున్నారు. అలాగని బీజేపీని వదులకుని.. ఆయన టీడీపీతో జతకట్టడం కూడా లేదు.
అన్ని పార్టీలను ఏకం చేస్తానని.. ఆ ప్రయత్నంలోనే ఉన్నానని తాజాగా పవన్ చెప్పారు. అంటే.. దాదాపు పవన్ చెప్పిన సూత్రం ప్రకారం.. ఏపీలో ఏ రెండు పార్టీలో పొత్తు పెట్టుకోవన్నమాట! కష్టమో.. నష్టమో.. బీజేపీ-టీడీపీ-జనసేన -బీఎస్పీ ఇతర చిన్నా చితకా పార్టీలన్నీ కలిసి.. మహాకూటమిగా ఏర్పడడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. 2009లోనూ ఇలానే అప్పటి వైఎస్పై మహాకూటమి గా ఏర్పడిన పార్టీలు పోటీకి దిగాయి.
ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. అయితే, కమ్యూనిస్టులు మాత్రం బీజేపీతో అంటకాగరు కాబట్టి.. ఆ కామ్రెడ్స్ను పక్కన పెడితే.. మొత్తంగా వైసీపీ ఒకవైపు, మరోవైపు మహాకూటమి రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఈ మహాకూటమి ద్వారా రాష్ట్రంలో ఓటు బ్యాంకు చీలకుండా ఉంటుందని.. ఇదే వ్యూహంతో పవన్ కూడా ఉన్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుంటే, వైసీపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశాలను కొట్టిపారేయలేమనే వారు కూడా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 19, 2022 9:20 pm
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…