Political News

జగన్ ను మరో సారి హెచ్చరించిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన జగన్ ప్రభుత్వం రోజురోజుకు అప్పుల భారాన్ని పెంచుతోంది. సంక్షేమ పథకాల..ఇతర లెక్కలు చూపిస్తూ ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తోందని కేంద్ర ప్రభుత్వం మరోసారి వెల్లడించింది. పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఆర్థిక శాఖా సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ సంగతి తెలియజేశారు.

బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఆంధ్రప్రదేశ్ అప్పు 2,29,333.8 కోట్లు ఉండగా ప్రస్తుతం 3,98,903.6 కోట్ల కు చేరింది. పైగా ఏటా బడ్జెట్లో అప్పుల శాతం కూడా పెరిగిపోతోంది. 2017-18లో గతంతో పోలిస్తే -9.8 శాతం తగ్గితే 2020 21నాటికి అది 17.1 శాతానికి పెరిగింది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలోనూ గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతోంది.

తెలుగుదేశం అధికారంలోకొచ్చే నాటికి 2014లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పులు 42.3% ఉండగా ఆ తరువాత భారీగా తగ్గుదల నమోదు చేసుకుంది. 2015 లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో ఉన్న అప్పులు 23.3 శాతం ఉండగా 2021 నాటికి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 36.5% గా నమోదైంది. బడ్జెట్ లో చూపించిన అప్పులు కంటే బడ్జెటేతర అప్పులు ఎక్కువగా ఉన్నాయని అది సహేతుకం కాదని కేంద్రం హెచ్చరిస్తోంది.

కొత్త అప్పులు పుట్టక ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. అందిన అప్పులు కూడా పాత అప్పులకు వడ్డీ కట్టేందుకు సరిపోతోంది. దానితో ఉద్యోగులు వేతనాలు, పెన్షన్లు చెల్లించేందుకు ప్రతీ నెల ఇబ్బందులు ఎదరువుతున్నాయి. నెల నెల వేతనాలు, పెన్షన్లకు 5,500 కోట్ల నిధులు అవసరమవుతాయి. ఒకటో తారీఖున ప్రభుత్వం దగ్గర రెండు వేల కోట్ల రూపాయలు కూడా లేని పరిస్థితుల్లో కొందరికి జీతాలు ఇచ్చి.. మరికొందరికి ఆపాల్సి వస్తోంది. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు ఉంటుందో చెప్పలేమని అధికార వర్గాలు అంటున్నాయి…..

This post was last modified on December 19, 2022 4:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్షమాపణలు చెప్పిన నాయుడు గారి అబ్బాయి

తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్‌కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…

1 hour ago

తెలుగు అభిమానులకు దురంధర్ స్ట్రోక్

భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…

2 hours ago

ట్రెండింగ్ మొదలుపెట్టిన భగత్ సింగ్

ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…

4 hours ago

దురంధర్ 2 ప్రీమియర్లు…..వాటి మీదే అందరి కళ్ళు

మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…

5 hours ago

బీఆర్ఎస్ టాక్‌: రోహిత్‌రెడ్డిపై ఇంత‌క‌న్నా చేయ‌లేం

'మొయినాబాద్ డ్ర‌గ్స్ పార్టీ' కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత‌, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్‌రెడ్డి విష‌యం మాజీ…

5 hours ago

జ‌గ‌న్‌ను చిక్కుల్లో పెట్టేశారుగా!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రోసారి చిక్కుల్లో ప‌డ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయ‌న‌కు పెద్ద చిక్కు వ‌చ్చింది.…

5 hours ago