Political News

జగన్ ను మరో సారి హెచ్చరించిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన జగన్ ప్రభుత్వం రోజురోజుకు అప్పుల భారాన్ని పెంచుతోంది. సంక్షేమ పథకాల..ఇతర లెక్కలు చూపిస్తూ ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తోందని కేంద్ర ప్రభుత్వం మరోసారి వెల్లడించింది. పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఆర్థిక శాఖా సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ సంగతి తెలియజేశారు.

బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఆంధ్రప్రదేశ్ అప్పు 2,29,333.8 కోట్లు ఉండగా ప్రస్తుతం 3,98,903.6 కోట్ల కు చేరింది. పైగా ఏటా బడ్జెట్లో అప్పుల శాతం కూడా పెరిగిపోతోంది. 2017-18లో గతంతో పోలిస్తే -9.8 శాతం తగ్గితే 2020 21నాటికి అది 17.1 శాతానికి పెరిగింది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలోనూ గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతోంది.

తెలుగుదేశం అధికారంలోకొచ్చే నాటికి 2014లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పులు 42.3% ఉండగా ఆ తరువాత భారీగా తగ్గుదల నమోదు చేసుకుంది. 2015 లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో ఉన్న అప్పులు 23.3 శాతం ఉండగా 2021 నాటికి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 36.5% గా నమోదైంది. బడ్జెట్ లో చూపించిన అప్పులు కంటే బడ్జెటేతర అప్పులు ఎక్కువగా ఉన్నాయని అది సహేతుకం కాదని కేంద్రం హెచ్చరిస్తోంది.

కొత్త అప్పులు పుట్టక ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. అందిన అప్పులు కూడా పాత అప్పులకు వడ్డీ కట్టేందుకు సరిపోతోంది. దానితో ఉద్యోగులు వేతనాలు, పెన్షన్లు చెల్లించేందుకు ప్రతీ నెల ఇబ్బందులు ఎదరువుతున్నాయి. నెల నెల వేతనాలు, పెన్షన్లకు 5,500 కోట్ల నిధులు అవసరమవుతాయి. ఒకటో తారీఖున ప్రభుత్వం దగ్గర రెండు వేల కోట్ల రూపాయలు కూడా లేని పరిస్థితుల్లో కొందరికి జీతాలు ఇచ్చి.. మరికొందరికి ఆపాల్సి వస్తోంది. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు ఉంటుందో చెప్పలేమని అధికార వర్గాలు అంటున్నాయి…..

This post was last modified on December 19, 2022 4:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

6 minutes ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

56 minutes ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

2 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

4 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

6 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

6 hours ago