జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కామెంట్లలో కొంత తడబాటు ఉందేమోకానీ.. ఆయన వ్యూహంలో మా త్రం లేదని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో ఓటు బ్యాంకు చీలనివ్వనని పవన్ పదే పదే చెబుతున్నారు. అయితే.. దీనిని కొన్ని కొన్ని సార్లు దాట వేస్తున్నారు. ఒంటరి యుద్ధమేనని కొన్ని సార్లు చెబుతున్నారు. సో.. ఇలా.. ఆయన చేస్తున్న డైలాగుల్లో కొంత తేడా అయితే.. ఉంది.
కానీ, వ్యూహానికి మాత్రం తేడా లేదని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడం తప్ప పవన్ ముందున్న లక్ష్యం పెద్దగా ఏమీ కనిపించడం లేదు. ప్రత్యేక హోదా ను లడ్డూతోను.. ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతోనూ పోల్చి.. కొంత రాజకీయం చేసిన విషయం తెలిసిందే. తర్వాత.. చంద్రబాబు పై విమర్శలను దారి తప్పించేందుకు తానే హోదా ఉద్యమాన్ని భుజాన వేసుకుంటానని అన్నారు.
కానీ, తర్వాత ఏపీ ప్రజల్లో పోరాడే సత్తాలేదని.. వారు కారం తినడం లేదని అనేసి దానిని మరిచిపోయారు. ఇక, ఇప్పుడు కూడా అంతే అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తానని.. కొంత సేపు, అధికారంలోకి రావడం.. రాకపోవడం.. సీఎం కావడం .. కాకపోవడం.. తన చేతుల్లో లేదని తాజాగాను చెప్పడం ఆశ్చర్యంగా అనిపిస్తుండడం గమనార్హం. ఇదిలావుంటే.. ఓటు బ్యాంకు చీలకుండా చూస్తానని పవన్ చెబుతున్నారు.
అయితే.. ఇది జరగాలంటే.. బలమైన టీడీపీతో కలిసి ముందుకు సాగాలి. ఓకే.. ఇప్పటికే వైసీపీ చెప్పినట్టు 30-40 స్థానాలకు ఈ రెండు పార్టీల మధ్య బేరం జరుగుతోంది. ఇదే నిజమైతే.. వచ్చే ఎన్నికల్లో సీఎం పోస్టు ను చంద్రబాబు వదులుకుంటారా? అనేది ప్రశ్న. సో.. పవన్కు సీఎం ఛాన్స్ దక్కేది లేదు. కాకపోతే.. గెలిచే 10-20 మందిలో ఓ రెండు మంత్రి పదవులు మాత్రం దక్కే అవకాశం ఉంటుంది. అంటే ఇతమిత్థంగా.. పవన్ మాటల్లో తడబాటు ఉన్నా.. వ్యూహం మాత్రం స్పష్టంగా ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on December 19, 2022 3:13 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…