జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కామెంట్లలో కొంత తడబాటు ఉందేమోకానీ.. ఆయన వ్యూహంలో మా త్రం లేదని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో ఓటు బ్యాంకు చీలనివ్వనని పవన్ పదే పదే చెబుతున్నారు. అయితే.. దీనిని కొన్ని కొన్ని సార్లు దాట వేస్తున్నారు. ఒంటరి యుద్ధమేనని కొన్ని సార్లు చెబుతున్నారు. సో.. ఇలా.. ఆయన చేస్తున్న డైలాగుల్లో కొంత తేడా అయితే.. ఉంది.
కానీ, వ్యూహానికి మాత్రం తేడా లేదని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడం తప్ప పవన్ ముందున్న లక్ష్యం పెద్దగా ఏమీ కనిపించడం లేదు. ప్రత్యేక హోదా ను లడ్డూతోను.. ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతోనూ పోల్చి.. కొంత రాజకీయం చేసిన విషయం తెలిసిందే. తర్వాత.. చంద్రబాబు పై విమర్శలను దారి తప్పించేందుకు తానే హోదా ఉద్యమాన్ని భుజాన వేసుకుంటానని అన్నారు.
కానీ, తర్వాత ఏపీ ప్రజల్లో పోరాడే సత్తాలేదని.. వారు కారం తినడం లేదని అనేసి దానిని మరిచిపోయారు. ఇక, ఇప్పుడు కూడా అంతే అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తానని.. కొంత సేపు, అధికారంలోకి రావడం.. రాకపోవడం.. సీఎం కావడం .. కాకపోవడం.. తన చేతుల్లో లేదని తాజాగాను చెప్పడం ఆశ్చర్యంగా అనిపిస్తుండడం గమనార్హం. ఇదిలావుంటే.. ఓటు బ్యాంకు చీలకుండా చూస్తానని పవన్ చెబుతున్నారు.
అయితే.. ఇది జరగాలంటే.. బలమైన టీడీపీతో కలిసి ముందుకు సాగాలి. ఓకే.. ఇప్పటికే వైసీపీ చెప్పినట్టు 30-40 స్థానాలకు ఈ రెండు పార్టీల మధ్య బేరం జరుగుతోంది. ఇదే నిజమైతే.. వచ్చే ఎన్నికల్లో సీఎం పోస్టు ను చంద్రబాబు వదులుకుంటారా? అనేది ప్రశ్న. సో.. పవన్కు సీఎం ఛాన్స్ దక్కేది లేదు. కాకపోతే.. గెలిచే 10-20 మందిలో ఓ రెండు మంత్రి పదవులు మాత్రం దక్కే అవకాశం ఉంటుంది. అంటే ఇతమిత్థంగా.. పవన్ మాటల్లో తడబాటు ఉన్నా.. వ్యూహం మాత్రం స్పష్టంగా ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on December 19, 2022 3:13 pm
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…