ఏపీ సీఎం జగన్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వారాహి ప్రచార వాహనంలో త్వరలోనే తాను ప్రజల మధ్యకు రానున్నట్టుపవన్ తెలిపారు. ఈ క్రమంలో తనను ఎవరు ఆపుతారో చూస్తానని సవాల్ రువ్వారు. నా వారాహి వాహనంతో ప్రచారానికి వస్తున్నా. నన్ను ఎవడు ఆపుతాడో రండి. మీ సీఎంను రమ్మనండి. కూసే గాడిదలను రమ్మనండి. నా వారాహిని ఆపమనండి. అప్పుడు చూపిస్తా నేనేంటో!! అని పవన్ వ్యాఖ్యానించారు.
తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో కౌలు రైతులను పవన్ పరామర్శించారు. ఆత్మ హత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆయన సాయం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోందని, ప్రజలంతా కోరుకుంటే తాను సీఎం అవుతానన్నారు.
మంత్రి అంబటి రాంబాబుది శవాల మీద పేలాలు ఏరుకునే మనస్తత్వమని పవన్ నిప్పులు చెరిగారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని ఆయన ఒక మంత్రా? అని ప్రశ్నించారు. తనపై బాధ్యత లేకుండా మాట్లాడే వైసీపీ నాయకులకు సరైన సమాధానం చెబుతానన్నారు. తాను ఏ పార్టీకి కొమ్ముకాయనని, ఏ పార్టీకి అమ్ముడుపోయే ఖర్మ తనకు పట్టలేదన్నారు. తన సినిమాలు ఆపేసినా భయం లేదన్నారు. వారాహి వాహనంలో ఏపీ రోడ్లపై తిరుగుతా.. ఎవరూ ఆపుతారో చూస్తానని సవాల్ విసిరారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…