ఏపీ సీఎం జగన్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వారాహి ప్రచార వాహనంలో త్వరలోనే తాను ప్రజల మధ్యకు రానున్నట్టుపవన్ తెలిపారు. ఈ క్రమంలో తనను ఎవరు ఆపుతారో చూస్తానని సవాల్ రువ్వారు. నా వారాహి వాహనంతో ప్రచారానికి వస్తున్నా. నన్ను ఎవడు ఆపుతాడో రండి. మీ సీఎంను రమ్మనండి. కూసే గాడిదలను రమ్మనండి. నా వారాహిని ఆపమనండి. అప్పుడు చూపిస్తా నేనేంటో!! అని పవన్ వ్యాఖ్యానించారు.
తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో కౌలు రైతులను పవన్ పరామర్శించారు. ఆత్మ హత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆయన సాయం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోందని, ప్రజలంతా కోరుకుంటే తాను సీఎం అవుతానన్నారు.
మంత్రి అంబటి రాంబాబుది శవాల మీద పేలాలు ఏరుకునే మనస్తత్వమని పవన్ నిప్పులు చెరిగారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని ఆయన ఒక మంత్రా? అని ప్రశ్నించారు. తనపై బాధ్యత లేకుండా మాట్లాడే వైసీపీ నాయకులకు సరైన సమాధానం చెబుతానన్నారు. తాను ఏ పార్టీకి కొమ్ముకాయనని, ఏ పార్టీకి అమ్ముడుపోయే ఖర్మ తనకు పట్టలేదన్నారు. తన సినిమాలు ఆపేసినా భయం లేదన్నారు. వారాహి వాహనంలో ఏపీ రోడ్లపై తిరుగుతా.. ఎవరూ ఆపుతారో చూస్తానని సవాల్ విసిరారు.
This post was last modified on December 18, 2022 5:46 pm
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…