వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు అనేక వ్యయ ప్రయాసలు పడుతున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ.. గెలుపు గుర్రం ఎక్కేందుకు ఉన్న అన్ని అవకాశాలను కూడా వినియోగించుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే రెండు వ్యూహాలను అమలు చేస్తోంది. ఒకటి సంక్షేమం. సమాజంలోని లబ్ధి దారులకు అందరికీ.. సంక్షేమాన్ని అందిస్తున్నామని.. ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందుతోందని ప్రభుత్వం చెబుతోంది.
ఈ క్రమంలో లబ్దిదారులను తమవైపు తిప్పుకొనేందుకు గడపగడపకు కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. అయితే.. ఇక్కడ చిక్కేంటంటే.. సంక్షేమం తీసుకున్నవారు మాత్రమే సర్కారుకు అనుకూలంగా ఉండ డం. ఇది కూడా కష్టమే. ఎన్నికల సమయానికి గాలి ఎటు వీస్తే.. అటే అన్నట్టుగా వ్యవహరిస్తే మరింత ఇబ్బంది. అందుకే.. మరో వ్యూహానికి రెడీ అయింది.. మూడు ప్రాంతాల అభివృద్ధి మూడు రాజధానులతోనే నని ప్రచారం చేస్తోంది.
ఇది ఎక్కువగా సక్సెస్ అవుతుందని వైసీపీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నవారు కూడా.. మూడు ప్రాంతాల అభివృద్ధిని అయితే.. కాదనరు కదా! ఇదే వైసీపీకి అనుకూలించే అంశమని అంటున్నారు. ఒకవేళ ఇది కూడా వర్కవుట్ కాదని అనుకుంటే.. బీసీ కార్డును ఉపయోగించా లనే వ్యూహంతో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. వచ్చే ఎన్నికల నాటికి.. వ్యూహాలు ఎటు నుంచి ఎటైనా మారే అవకాశం ఉంటుంది. ప్రజల మూడ్.. అప్పటికి ఎన్నికల సరళి.. ఇతర పార్టీల వ్యూహాలు.. వీటన్నింటినీ బేరీజు వేసుకుని.. బీసీ కార్డును బయటకు తీసే యోచనలో ఉన్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అంటే.. అవసరం అనుకుంటే.. జనరల్ స్థానాలను సైతం 20 శాతం బీసీలకు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇటీవల స్థానిక ఎన్నికల్లో ఈ ప్రయోగం చేసి సక్సెస్ అయిన వైసీపీ.. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే ప్రయోగం చేయనున్నట్టు సమాచారం. జనరల్ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకపోయినా.. పార్టీలోను.. నామినేటెడ్లోనూ కీలక పదవులు ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
This post was last modified on December 19, 2022 2:47 pm
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…