రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బలంగా వినిపిస్తున్న మాట.. వచ్చే ఎన్నికల్లో అఖిల భారత సర్వీసు అధికారు లు భారీ సంఖ్యలో పోటీకి దిగుతారని!! పరిణామాలను గమనిస్తే.. ఇది ఔననే అంటున్నారు పరిశీలకులు. కొన్ని కొన్ని విషయాల్లో అధికార పార్టీలు వేస్తున్న అడుగులకు కొందరు అధికారులు ఫక్తు.. రాజకీయ నాయకుల్లాగా మద్దతు తెలుపుతున్నారు. అధికార పార్టీ నేతలకంటే ముందే వారు స్పందిస్తున్నారు.
ఇది ఒక్క ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ కనిపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ అధినేతలకు సలాంలు కొడుతూ.. గులాం గిరీ చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. ఇటీవల తెలంగాణలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు సీఎం కేసీఆర్కు పదే పదే పాద నమస్కారాలు చేశారు. ఇటు ఏపీలో చూసుకుంటే.. సీఎం జగన్ కు ఇలా పాదనమస్కారాలు చేయాలని ఉన్నా..ఆయనే వద్దని అంటున్నారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
మీరు ఒక్క నమస్కారం చేస్తారు. గిట్టని మీడియా వంద సార్లు ప్రసారం చేస్తుంది. వద్దులే అని కొన్నాళ్ల కిందటే ఆయన కుండబద్దలు కొట్టినట్టు తేల్చి చెప్పారట. దీంతో అధికారులు నమస్కారాల మాట ఎలా ఉన్నా.. సీఎం జగన్ను ప్రత్యక్షంలోనూ.. పరోక్షంలోనూ కొనియాడుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటివారిలో ఐఏఎస్ మాత్రమే కాదు.. కీలకమైన ఐపీఎస్లు కూడా ఉన్నారు. ఇటు ఏపీ, అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
జిల్లాల కలెక్టర్ల నుంచి.. సచివాలయంలో పనిచేసే ఉన్నతస్థాయి అధికారుల వరకు కూడా వచ్చే ఎన్నిక ల్లో పోటీకి రెడీ అవుతున్నారు. వీరిలో కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. సో.. ఇలా చూసుకుంటే రెండు రాష్ట్రాల్లోనూ ప్రజాక్షేత్రంలోకి వచ్చే ఐఏఎస్, ఐపీఎస్లు పెరగడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఎంత మందికి అవకాశం ఇస్తారో.. ఎవరెవరు.. పుంజుకుంటారో చూడాలి.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…