రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బలంగా వినిపిస్తున్న మాట.. వచ్చే ఎన్నికల్లో అఖిల భారత సర్వీసు అధికారు లు భారీ సంఖ్యలో పోటీకి దిగుతారని!! పరిణామాలను గమనిస్తే.. ఇది ఔననే అంటున్నారు పరిశీలకులు. కొన్ని కొన్ని విషయాల్లో అధికార పార్టీలు వేస్తున్న అడుగులకు కొందరు అధికారులు ఫక్తు.. రాజకీయ నాయకుల్లాగా మద్దతు తెలుపుతున్నారు. అధికార పార్టీ నేతలకంటే ముందే వారు స్పందిస్తున్నారు.
ఇది ఒక్క ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ కనిపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ అధినేతలకు సలాంలు కొడుతూ.. గులాం గిరీ చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. ఇటీవల తెలంగాణలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు సీఎం కేసీఆర్కు పదే పదే పాద నమస్కారాలు చేశారు. ఇటు ఏపీలో చూసుకుంటే.. సీఎం జగన్ కు ఇలా పాదనమస్కారాలు చేయాలని ఉన్నా..ఆయనే వద్దని అంటున్నారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
మీరు ఒక్క నమస్కారం చేస్తారు. గిట్టని మీడియా వంద సార్లు ప్రసారం చేస్తుంది. వద్దులే అని కొన్నాళ్ల కిందటే ఆయన కుండబద్దలు కొట్టినట్టు తేల్చి చెప్పారట. దీంతో అధికారులు నమస్కారాల మాట ఎలా ఉన్నా.. సీఎం జగన్ను ప్రత్యక్షంలోనూ.. పరోక్షంలోనూ కొనియాడుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటివారిలో ఐఏఎస్ మాత్రమే కాదు.. కీలకమైన ఐపీఎస్లు కూడా ఉన్నారు. ఇటు ఏపీ, అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
జిల్లాల కలెక్టర్ల నుంచి.. సచివాలయంలో పనిచేసే ఉన్నతస్థాయి అధికారుల వరకు కూడా వచ్చే ఎన్నిక ల్లో పోటీకి రెడీ అవుతున్నారు. వీరిలో కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. సో.. ఇలా చూసుకుంటే రెండు రాష్ట్రాల్లోనూ ప్రజాక్షేత్రంలోకి వచ్చే ఐఏఎస్, ఐపీఎస్లు పెరగడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఎంత మందికి అవకాశం ఇస్తారో.. ఎవరెవరు.. పుంజుకుంటారో చూడాలి.
This post was last modified on December 19, 2022 8:02 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…