Political News

మాచ‌ర్ల ఘ‌ట‌న ఎన్నిక‌ల సీన్‌కి రిహార్స‌ల్సా!?

కొన్ని కొన్ని ఘ‌ట‌న‌లు ప‌రిశీలిస్తే.. భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌ను ముందుగానే క‌ళ్ల‌కు క‌డుతు న్నట్టుగా అనిపిస్తాయి. ఇప్పుడు ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ఘ‌ట‌న కూడా ఇదే త‌ర‌హాలో క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డ అస‌లు ఏం జ‌రిగింది? అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ఈ ప్రాంతంలోకి అస‌లు టీడీపీ నేత‌లు వ‌చ్చేందుకే లేద‌న్న‌ట్టుగా వైసీపీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రించారు.

మొత్తంగా చాలా ముందస్తు పథకం ప్రకారమే.. విధ్వంసానికి దిగినట్లు స్పష్టంగా క‌నిపిస్తోంద‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు చెబుతున్నారు. టీడీపీ నేతలతో పాటు వారికి అండగా నిలిచిన వారిని సైతం.. భయపెట్టి మాన‌సికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా దాడులు జ‌రిగాయ‌ని చెబుతున్నారు. రాడ్లు ప‌ట్టుకుని.. క‌ర్ర‌లు తిప్పుతూ…. ఆటోలెక్కి ఈలలు, కేకలతో హల్‌చల్‌ చేస్తూ వైసీపీ మూక‌.. పట్టణంలో మూడు గంటలపాటు భయానక వాతావరణాన్ని సృష్టించింది.

అంతేకాదు.. టీడీపీ నేత‌ల ఇళ్లలోకి వెళ్లి పలుగు, పారలతో తలుపులు పగలగొట్టి అక్కడ విధ్వంసం సృష్టించ‌డం, మహిళలని కూడా చూడకుండా ఇళ్ల నుంచి తరిమేయ‌డం… బంగారం, నగదుతోపాటు ఆస్తుల దోపిడీకి సైతం పాల్పడ్డారు.. దీంతో ఆయా ఇళ్ల‌లోని ప్ర‌జ‌లు ప్రాణాలు అరచేత పట్టుకుని ఇళ్ల నుంచి ప‌రార‌య్యారు.

ఎందుకు జ‌రిగింది?

ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించేందుకు టీడీపీ కార్యాచరణ ప్రకటించడంతో.. వైసీపీ నేతలు కూడా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఫ్యాక్షన్‌ ముసుగులో.. విధ్వంసం సృష్టించాలనే వ్యూహం కన్పిస్తోంది. అందుకు అనుగుణంగానే వైసీపీ కార్యకర్తలతో తొలుత అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు.. టీడీపీ నేత‌ జూలకంటి బ్రహ్మారెడ్డిని మాచర్ల నుంచి పంపేశారు. అయితే.. వైసీపీ వారిని అదుపు చేయ‌డంలో పోలీసులు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. దీంతో విధ్వంసానికి దారి తీసింది.

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు రిహార్స‌ల్సా?!

ఔను.. తాజాగా జ‌రిగిన ప‌రిణామాన్ని గ‌మ‌నిస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇది రిహార్స‌ల్సా? అనే చ‌ర్చ జ‌రుగు తోంది. అధికారం చేతిలో ఉంది.. పోలీసు వ్య‌వ‌స్థ త‌మ గుప్పిట్లో ఉంది. సో.. ఎన్నికల స‌మ‌యంలోనూ ఇలానే రెచ్చిపోయినా.. అడిగేనాథుడు ఎవ‌రు ఉంటారు? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. అధికార మే ప‌ర‌మావ‌ధిగా అడుగులు వేస్తున్న వైసీపీ.. దానిని అంది పుచ్చుకునేందుకు. ఎంత‌టి ప‌రిస్థితికైనా దిగ‌జారుతుంద‌నే వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి.

దౌర్జ‌న్యాలు.. దాడుల‌తోపాటు.. ప్ర‌జ‌ల‌ను బెదిరించ‌డం.. వారిని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేయ‌డం కూడా.. తాజా ప‌రిణామాల‌తో వైసీపీ నాయ‌కుల‌కు ఎంత ఈజీనో..!! అనే చ‌ర్చ‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా మాచ‌ర్ల ఘ‌ట‌న రాబోయే ఎన్నిక‌ల‌కు రిహార్స‌ల్సేనా? అనేది.. మేధావుల మాట‌.

This post was last modified on December 18, 2022 1:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బ‌డ్జెట్ స‌మావేశాల‌ కోసం అసెంబ్లీకి జ‌గ‌న్‌.. ?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. పార్టీ వ‌ర్గాలతో చ‌ర్చ‌లు జ‌రిపిన ఆయ‌న‌..…

42 minutes ago

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

4 hours ago

స‌రిహ‌ద్దు కంచె: ఇది క‌దా `ఎన్నిక‌ల‌ రాజ‌కీయం` అంటే!

+ దేశ స‌రిహ‌ద్దులను కాపాడాల్సిన బాధ్య‌త ఎవ‌రిది? నిస్సందేహంగా కేంద్ర ప్ర‌భుత్వానిదే. + దేశ స‌రిహ‌ద్దుల నుంచి పెరుగుతున్న చొర‌బాట్ల‌ను…

6 hours ago

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

14 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

14 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

14 hours ago