Political News

50 కొత్త మొఖాల‌కు టికెట్లు.. వైసీపీలో గుస‌గుస‌

ఏపీ అధికార పార్టీ వైసీపీలో అంద‌రూ పాత‌వారికే టికెట్లు ఇస్తాం. అంద‌రూ క‌ష్ట‌ప‌డి ప‌నిచేయండి.. పార్టీని గెలిపించండి. మీరు ప‌ట్టుద‌ల‌గా గెల‌వండి! అని పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే త‌ర‌చుగా నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఎమ్మెల్యేల‌ను తాడేప‌ల్లికి పిలిచి మ‌రీ క్లాసులు ఇస్తున్నారు. ఓకే.. అంటూ.. నేత‌లు కూడా త‌ల‌లూపుతున్నారు. తీరా చూస్తే.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో మ‌రో కోణం క‌నిపిస్తోంది.

ప్ర‌స్తుతం వైసీపీకి జ‌గ‌న్ మిన‌హా.. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా చేసిన ప్ర‌క‌ట‌న మేర‌కు 32 మందిపై తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. వాస్త‌వానికి ఈ సంఖ్య మ‌రింత ఎక్కువ‌గానే ఉంది. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో చాలా మంది వైసీపీ నేత‌ల‌కు చుక్కెదురు అవుతుంద‌ని అంటున్నారు. కాకినాడ సిటీ, రూర‌ల్‌, కొవ్వూరు, ఆచంట.. ఇలా అనేక నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఇవ‌న్నీ ప‌ట్టుబ‌ట్టినా గ‌ట్టెక్క‌డం క‌ష్ట‌మేన‌ని చెబుతున్నారు.

ఇలా.. చూసుకుంటే.. మ‌రో ఐదారు టికెట్లు పెరిగే అవ‌కాశం ఉంటుంది. అంటే.. ఇప్పుడు ఉన్న 150 మంది ఎమ్మెల్యేల్లో క‌నీసం 40 మందిని మార్చ‌డం ఖాయ‌మ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇక‌, దీంతో పాటు.. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన నియోజ‌క‌వ‌ర్గాలు 23. వీటిలోనూ నాయకులను ఎంచాల్సిన అవ‌స‌రం ఉంది. ఒక్క‌ట టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వారిని మిన‌హా.. మిగిలిన చోట్ల ఖ‌చ్చితంగా కొత్త‌వారికి అవ‌కాశం క‌ల్పించాలి.

అంటే.. ఇత‌మిత్థంగా.. వైసీపీ అధినేత జ‌గ‌న్..ఎంత గీసిగీసి కొత్త‌వారిని తీసుకుందామ‌ని అనుకున్నా.. క‌నీసంలో క‌నీసం 50 సీట్లు ఖాళీగా క‌నిపిస్తున్నాయి. వీరంతా కొత్త ముఖాలే అవుతార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికిప్పుడు వార‌సుల‌కు టికెట్లు ఇచ్చేది లేద‌ని వైసీపీ అధినేత చెబుతున్నా.. కొంద‌రు మాత్రం ప్ర‌య‌త్నాలు మాన‌డం లేదు. దీంతో ఇలాంటి వారికి 5 సీట్ల వ‌ర‌కు అవ‌కాశం ఉన్నా.. మిగిలిన సీట్లు మాత్రం కొత్తవారికే ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on December 18, 2022 10:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

12 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

55 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago