ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మూడు రాజధానులకు ఈ నెల 17వ తేదీతో మూడేళ్లు పూర్త య్యాయి. అసెంబ్లీ సీఎం జగన్ మాట్లాడుతూ.. వచ్చే రెండేళ్లలోనే మూడు రాజధానులు సాకారం అవుతా యని చెప్పారు. అయితే.. ఇవి ఎక్కడిగొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయాయి. సరే.. ఇవి అలా ఉండడానికి న్యాయపరమైన సమస్యలు మాత్రమే కారణం కాదు.. రాజకీయ పరమైన కారణాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పుడు ఎలానూ.. మూడు రాజధానులపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. అమరావతి ఏకైక రాజధాని అనే విషయం న్యాయపరిధిలో ఉంది. దీంతో మూడు రాజధానులు ప్రకటించినా.. ప్రయోజనం లేకుండా పోయిందనే వాదన అయితే ప్రధానంగా వినిపిస్తోంది. అయితే.. దీనివెనుక.. రాజకీయంగా వైసీపీకి మరో వ్యూహం కూడా ఉందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి.. సంక్షేమం పనిచేయకపోతే.. వెంటనే ఈ కత్తిని ప్రయోగించే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు.
అంటే.. మూడు రాజధానులతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామనే అజెండాను వైసీపీ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. కర్నూలులో ఇప్పటికే హైకోర్టును కాంక్షిస్తూ.. పెద్ద ఎత్తున వైసీపీ సభలు నిర్వహించింది. ఇక, విశాఖలో రాజధాని కోసం అక్కడ కూడా మంత్రులు గడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణలు సభ పెట్టారు. వీటిపై ఇతమిత్థంగా పార్టీ తరఫున ప్రకటన లేదు.
అయినా.. వీటిని లైవ్లో ఉంచి.. సంక్షేమం కుదరకపోతే.. మూడు రాజధానుల అస్త్రాన్ని ప్రయోగించే వ్యూహంతో వైసీపీ ఉందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. అయితే.ఇప్పటి వరకు చూసుకుంటే.. మూడు రాజధానులను ప్రకటించినా.. పార్టికీ అనుకున్న విధంగా మైలేజీ అయితే దక్కలేదు. సో.. ఈ క్రమంలోనే పార్టీ వ్యూహాలు మారతాయని.. వచ్చే ఎన్నికల నాటికిఎలాగైనా ముందుకు సాగడం ఖాయమని మరికొందరు చెబుతున్నారు.
This post was last modified on December 17, 2022 2:22 pm
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…
సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…
పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడం ఇటీవల పెద్ద సమస్యగా మారుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు…