Political News

ఆంధ్రప్రదేశ్ జనం బీఆర్ఎస్ ను పట్టించుకోవడం లేదా ?

జాతీయ రాజకీయాల కోసం భారత రాష్ట్ర సమితి…(బీఆర్ఎస్)ను స్థాపించిన కేసీఆర్ …ఏపీ వైపు చూస్తున్నారు. ఢిల్లీలో కార్యాలయ ప్రారంభోత్సవం తర్వాత హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ సీఎం… ఇకపై పార్టీ విస్తరణకు ప్రాధాన్యమిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేయడంపైనే తొలుత దృష్టి పెడతారని పార్టీ నేతలు చెబుతున్నారు.

సంక్రాంతి తర్వాత ఏపీ వైపుకు బీఆర్ఎస్ కదులుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి శ్రీనివాస యాదవ్ కు ఏపీ బాధ్యతలు అప్పగించారు. ఆయనకు ఏపీలో ఉన్న పరిచయాలు, బంధుత్వాలు బీఆర్ఎస్ కు ఉపయోగపడతాయని విశ్వసిస్తున్నారు. ఒక పక్క యనమల రామకృష్ణుడు మరో పక్క పుట్టా సుధాకర్ యాదవ్ లు తలసానికి బంధువులు కావడంతో వారి ద్వారా బీఆర్ఎస్ ను అభివృద్ధి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు..

ఏపీలో ఎవరైనా పట్టించుకున్నారా…

కేసీఆర్ పార్టీ పెడతానని చెప్పినప్పుడు ఊరు పేరు లేని ఒకరిద్దరూ మాత్రమే స్పందించారు. రెండు పర్యాయాలు విజయవాడలో ఫ్లేక్సీలు ఏర్పాటు చేశారు. పార్టీ కార్యక్రమాలు అంతటితో ఆగిపోయాయి. బీఆర్ఎస్ లో చేరతామని గానీ, బీఆర్ఎస్ కు మద్దతిస్తామని గానీ ఏ ఒక్క నాయకుడు ప్రకటించలేదు. రాజకీయ నిరుద్యోగులు సైతం బీఆర్ఎస్ వైపు చూస్తున్న దాఖలాలు లేవు.
ఎవైరనా నాయకులతో తలసాని చర్చలు జరుపుతున్నట్లు కూడా వార్తలు రావడం లేదు..

ఆ ప్రశ్నలకు బదులేది..

తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీ ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ చాలా మాటలు మాట్లాడారు. రాష్ట్ర సరిహద్దుల్లో గోడ కడతామన్నారు. ఏపీ ప్రజల ఆహార అలవాట్లను విమర్శించారు. చివరకు బిర్యానీని కూడా ఎగతాళి చేశారు. కొన్ని సందర్భాల్లో ఆన్ పార్లమంటరీ మాటలు కూడా మాట్లాడారు. వాటన్నింటికీ కేసీఆర్ ఏపీ వెళ్లినప్పుడు సారీ చెబుతారో లేదో చూడాలి..

విభజన సమస్యలు

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం సవాలక్ష సమస్యలతో శతమతమవుతోంది. కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీ వివాదం ఒక కొలిక్కి రావడం లేదు. ఆస్తుల వ్యవహారంపై కూడా తెలంగాణ స్పందించడం లేదు. లక్షా 42 వేల కోట్ల ఆస్తుల పంపిణీకి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది. అందులో 91 శాతం ఆస్తులు హైదరాబాద్లోనే ఉన్నాయి. చంద్రబాబు హైదారాబాద్ ను అభివృద్ధి చేసే కేసీఆర్ ఎంజాయ్ చేస్తున్నారని వాదించే వారూ ఉన్నారు. మరి ఏపీలో అడుగుపెట్టినప్పుడే విభజన వివాదాలను పరిష్కారానికి కేసీఆర్ ఏదోక మాట చెప్పాల్సిందే..

అమరావతికి మద్దతేనా…

సంక్రాంతి తర్వాత ఏపీలో కార్యాలయ ఏర్పాటు, బహిరంగ సభ ఉంటుందంటున్నారు. విజయవాడలో కార్యాలయం, గుంటూరు – విజయవాడ మధ్య బహిరంగ సభ ఉండొచ్చు. ఇదీ అమరావతి రాజధానికి కేసీఆర్ ఇస్తున్న మద్దతులో భాగమేనని కొందరి వాదన. ఆ మాట కేసీఆర్ వెంట రావాలి. మరి జగన్ ను తన ఆప్తమిత్రుడిగా భావించే కేసీఆర్.. మూడు రాజధానుల ప్రతిపాదనను బహిరంగంగా వ్యతిరేకిస్తారో లేదో కూడా చూడాలి.. ఏం చేస్తారో మరి….

Share

Recent Posts

డీఎస్సీ నిర్వహణ సూపర్… లోకేష్ కు ఢిల్లీ మంత్రి అభినందనలు

రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షల నిర్వాహణపై ప్రతిపక్ష వైసీపీ రాద్దాంతం చేస్తున్న విషయం తెలిసిందే. ఆధారాలు లేకుండా…

21 minutes ago

మూడో బిడ్డను కంటే సంవత్సరం సెలవు

దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతున్న జననాల రేటు నేపథ్యంలో కుటుంబాల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ…

1 hour ago

వెంకీ త్రివిక్రమ్… ఇంకా ఆ ఒక్క కిక్ రాలేదే!

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదటిసారి కలిసి చేస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’. దీని మీద మంచి…

1 hour ago

20 గంటలు పని… 4 గంటలు రెస్ట్?

తమిళ సినిమాలో అగ్ర నటుడిగా వెలుగొందిన నటుడు విజయ్ అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. స్వర్గ సుఖాల జీవితం నుంచి…

1 hour ago

మూడేళ్ల ముందు 100 కోట్లు… ఇప్పుడు 3 కోట్లు

తమిళంలో చాలా ఏళ్ల నుంచి మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఉంటున్నాడు తెలుగువాడైన విశాల్. ‘సెండై కోళి’తో తమిళనాట స్టార్ ఇమేజ్…

7 hours ago

ఏపీలో ఉద్యోగాల పండగ

ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల‌కు ఏపీ ప్ర‌భుత్వం తీపిక‌బురు చెప్పింది. ఈ ఏడాదిలో 10 వేల‌కుపైగా స‌ర్కారీ…

11 hours ago