Political News

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌.. సీబీఐ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!

దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన లిక్క‌ర్ కుంభ‌కోణంపై లోతుగా విచార‌ణ జ‌రిపిన సీబీఐ.. తాజాగా సీబీఐ ప్ర‌త్యేక కోర్టులో ఛార్జ్‌షీట్‌ను దాఖ‌లు చేసింది. దీనిలో అనేక సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఈ ఆరోప‌ణ‌ల‌ను కోర్టు సైతం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ప్ర‌ధానంగా త‌న‌కు ఏ పాపం తెలియ‌ద‌ని చెబుతున్న తెలంగాణ సీఎం కుమార్తె క‌విత‌, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిల పాత్ర‌ల‌ను సీబీఐ పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించ‌డం గ‌మ‌నార్హం.

ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న కీల‌క విష‌యాలు ..

  • లిక్క‌ర్ కుంభ‌కోణంలో ముడుపులు నగదు రూపంలో హవాలా మార్గంలో తరలించారు.
  • అభిషేక్ బోయిన్‌పల్లి 20 నుంచి 30 కోట్ల రూపా యల నగదును హవాలా మార్గంలో త‌ర‌లించారు.
  • ఈ డబ్బంతా అడ్వాన్స్‌గా 2021 జులై, సెప్టెంబర్ మధ్య కాలంలో.. రూ.30 కోట్లను దినేష్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు అందజేశారు.
  • దక్షిణాది ప్రాంతానికి చెందిన మద్యం ఉత్పత్తిదారుల తరపున అభిషేక్ బోయిన్‌పల్లి వ్యవహారం న‌డిపాడు.
  • శరత్ చంద్రారెడ్డి, క‌ల్వ‌కుంట్ల కవిత, మాగుంట శ్రీనువాసులు రెడ్డి సౌత్ గ్రూప్‌ను కంట్రోల్ చేశారు.
  • మద్యం ఉత్పత్తిదారులు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు ఏ ఇద్దరి మధ్య ఎక్కడా గుత్తాధిపత్యం కానీ సమూహాలకు కానీ లబ్ధిచేకూర్చకూడదనే విధానాన్ని రూపకల్పన చేశారు.
  • మద్యం పాలసీ రూపకూల్పన జరుగుతున్న సమయంలోనే నిందితులు కుట్రకు పాల్పడ్డారు.
  • హోల్‌సేల్ వ్యాపారులు 12 శాతం లాభాలు ఆర్జించేలా, దీనిలో 6 శాతం అభిషేక్ బోయిన్‌పల్లికి తిరిగి వచ్చేలా కుట్ర చేశారు.
  • హోల్‌సేల్ వ్యాపారంలో వచ్చే లాభాల్లో రామచంద్రన్ పిళ్లై నుంచి బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ముత్తా గౌతమ్‌కు రూ.4,756 కోట్లు అందాయని.. అతని అకౌంట్ నుంచి అభిషేక్ బోయిన్‌పల్లికి రూ.3.85 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయినట్లుగా సీబీఐ తెలిపింది.
  • గౌతమ్‌కు చెందిన మీడియా సంస్థలకు కూడా కొంత డబ్బు బదిలీ అయింది.
  • ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో మొత్తం ఏడుగురు నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. పేర్కొంది.
  • కొందరు ప్రజా ప్ర‌తినిధులు, ఇతర సంస్థలతో కలిసి ఈ అక్రమాలకు పాల్పడ్డారు.
    +మౌఖిక, డాక్యుమెంటరీ ఆధారాలను కూడా సేక‌రించిన‌ట్టు సీబీఐ ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది.
Satya

Recent Posts

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

52 minutes ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

2 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

3 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

4 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

10 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

10 hours ago