Political News

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌.. సీబీఐ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!

దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన లిక్క‌ర్ కుంభ‌కోణంపై లోతుగా విచార‌ణ జ‌రిపిన సీబీఐ.. తాజాగా సీబీఐ ప్ర‌త్యేక కోర్టులో ఛార్జ్‌షీట్‌ను దాఖ‌లు చేసింది. దీనిలో అనేక సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఈ ఆరోప‌ణ‌ల‌ను కోర్టు సైతం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ప్ర‌ధానంగా త‌న‌కు ఏ పాపం తెలియ‌ద‌ని చెబుతున్న తెలంగాణ సీఎం కుమార్తె క‌విత‌, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిల పాత్ర‌ల‌ను సీబీఐ పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించ‌డం గ‌మ‌నార్హం.

ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న కీల‌క విష‌యాలు ..

  • లిక్క‌ర్ కుంభ‌కోణంలో ముడుపులు నగదు రూపంలో హవాలా మార్గంలో తరలించారు.
  • అభిషేక్ బోయిన్‌పల్లి 20 నుంచి 30 కోట్ల రూపా యల నగదును హవాలా మార్గంలో త‌ర‌లించారు.
  • ఈ డబ్బంతా అడ్వాన్స్‌గా 2021 జులై, సెప్టెంబర్ మధ్య కాలంలో.. రూ.30 కోట్లను దినేష్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు అందజేశారు.
  • దక్షిణాది ప్రాంతానికి చెందిన మద్యం ఉత్పత్తిదారుల తరపున అభిషేక్ బోయిన్‌పల్లి వ్యవహారం న‌డిపాడు.
  • శరత్ చంద్రారెడ్డి, క‌ల్వ‌కుంట్ల కవిత, మాగుంట శ్రీనువాసులు రెడ్డి సౌత్ గ్రూప్‌ను కంట్రోల్ చేశారు.
  • మద్యం ఉత్పత్తిదారులు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు ఏ ఇద్దరి మధ్య ఎక్కడా గుత్తాధిపత్యం కానీ సమూహాలకు కానీ లబ్ధిచేకూర్చకూడదనే విధానాన్ని రూపకల్పన చేశారు.
  • మద్యం పాలసీ రూపకూల్పన జరుగుతున్న సమయంలోనే నిందితులు కుట్రకు పాల్పడ్డారు.
  • హోల్‌సేల్ వ్యాపారులు 12 శాతం లాభాలు ఆర్జించేలా, దీనిలో 6 శాతం అభిషేక్ బోయిన్‌పల్లికి తిరిగి వచ్చేలా కుట్ర చేశారు.
  • హోల్‌సేల్ వ్యాపారంలో వచ్చే లాభాల్లో రామచంద్రన్ పిళ్లై నుంచి బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ముత్తా గౌతమ్‌కు రూ.4,756 కోట్లు అందాయని.. అతని అకౌంట్ నుంచి అభిషేక్ బోయిన్‌పల్లికి రూ.3.85 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయినట్లుగా సీబీఐ తెలిపింది.
  • గౌతమ్‌కు చెందిన మీడియా సంస్థలకు కూడా కొంత డబ్బు బదిలీ అయింది.
  • ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో మొత్తం ఏడుగురు నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. పేర్కొంది.
  • కొందరు ప్రజా ప్ర‌తినిధులు, ఇతర సంస్థలతో కలిసి ఈ అక్రమాలకు పాల్పడ్డారు.
    +మౌఖిక, డాక్యుమెంటరీ ఆధారాలను కూడా సేక‌రించిన‌ట్టు సీబీఐ ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది.

This post was last modified on December 16, 2022 6:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్వయంభు సౌండ్ గట్టిగా వినిపించాల్సిందే

నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…

11 minutes ago

తాప్సి నుంచి మరో స్ట్రాంగ్ మూవీ

తెలుగులో సినిమాలు చేస్తున్నంత వరకు సగటు గ్లామర్ హీరోయిన్లలో ఒకరి లాగే ఉండేది తాప్సి పన్ను. కానీ తర్వాత బాలీవుడ్‌కు…

19 minutes ago

నిధి అగర్వాల్… అయిదేళ్ల కష్టం వృథా

నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే  కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…

2 hours ago

ట్రాఫిక్ జామ్ అయ్యిందని హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడా?

ముంబై పుణె ఎక్స్‌ప్రెస్‌వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…

2 hours ago

లెనిన్ అవరోధాలకు బ్రేక్ ఎక్కడ

అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…

2 hours ago

కాపులపై ‘అంబటి’ సెంటిమెంట్ ఎంత?

అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు…

3 hours ago