రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ దోస్తీ ఉంటుందా? ఉండదా? అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యక్షేత్రంగా పనిచేసే తెలుగుదేశం పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కూటమి కట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణకు చెందిన ఓ నేత అడ్డం పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీలోని వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో మంచి సంబంధాలే ఉన్న ఆ నేత కేంద్రంలోని బీజేపీ పెద్దలను టీడీపీకి చేరువ కాకుండా అడ్డం పడుతున్నారని దిల్లీలో వినిపిస్తోంది.
నిజానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం సులభవుతుందని తమ అధిష్ఠానానికి పలుమార్లు స్పస్టం చేశారని.. ఆయన టీడీపీతో పొత్తుకు చాలా సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు. అయితే… తెలంగాణ బీజేపీ నుంచి కేంద్రంలో పెద్ద పదవుల్లో ఉన్న మరో నేత మాత్రం వైసీపీ మంత్రం జపిస్తున్నారట. ఆయన తన పలుకుబడిని ఉపయోగించి బీజేపీ అధిష్ఠానం వద్ద వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వారితోనే కలిసి సాగడం మంచిదని చెప్తున్నారట.
టీడీపీ, బీజేపీలు కలిస్తే ఆ కూటమిలో ఏపీలో జనసేన కూడా ఉంటుంది. ఆ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే తమ ఓటమి ఖాయమని వైసీపీ నేతలూ ఆందోళన చెందుతున్నారట. ఇప్పటికే అంతర్గత సర్వేలన్నీ రానున్న ఎన్నికల్లో విజయం కష్టమని చెబుతున్న నేపథ్యంలో వైసీపీ ఇప్పుడు టీడీపీ, బీజేపీ కలిసికట్టుగా వస్తే ఎదుర్కోవడం కష్టమని భావిస్తోంది. దీంతో ఎలాగైనా టీడీపీ, బీజేపీ దోస్తీకి బ్రేక్ వేయాలని ఆ బీజేపీ నేతను కోరుతోందట.
కానీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, మరికొందరు ఆ పార్టీ నేతలు మాత్రం తెలంగాణలో ఇప్పటికీ టీడీపీకి క్యాడర్ ఉండడం… టీఆర్ఎస్లో చేరిన టీడీపీ నాయకులు కూడా కొందరు అక్కడ ఇమడలేకపోతుండడంతో.. బీజేపీ, టీడీపీ పొత్తు తెలంగాణలో అలాంటి నేతలను ఆకర్షించడంతో పాటు కార్యకర్తలనూ ఉత్తేజపరుస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్లో అనేక సీట్లు గెలవడానికి టీడీపీతో పొత్తు ఉపయోగపడుతుందని బండి వర్గీయులు చెబతున్నారు.
రెండు పార్టీలూ కలిస్తే ఏపీలో టీడీపీ సీఎం, తెలంగాణ బీజేపీ సీఎం ఉంటూ రెండు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం సాఫీగా నడపొచ్చని విశ్లేషిస్తున్నారు. మరి.. బీజేపీ అధిష్ఠానం బండి మాట వింటుందా కేంద్రంలోని పదవిలో ఉన్న నేత మాట వింటుందా చూడాలి.
This post was last modified on December 16, 2022 10:18 am
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…