ఏపీ అధికార పార్టీ వైసీపీ వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కి రికార్డు సృష్టించాలని భావిస్తున్న సీఎం జగన్.. దీనికి అనుగుణంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా ఆయన మరో రెండు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ప్రచారం కల్పించేలా పదునైన అస్త్రాలను రెడీ చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా జనవరి నుంచి బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇప్పటికే సచివాలయ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థ వంటివి తీసుకువచ్చిన సీఎం జగన్.. తాజాగా పార్టీ కోసం.. బూత్ స్థాయిలో మరింత వేగం పెంచనున్నారు. ప్రతి సచివాలయ పరిధిలోనూ ఒక బూత్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క కమిటీలోనూ ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరిలో ఒకరు మహిళా నాయకురాలు ఖచ్చితంగా ఉండాలని సీఎం జగన్ నిర్దేశించారు. వీరంతా కూడా పార్టీకి అనుకూలంగా పనిచేయాల్సి ఉంటుంది.
ఇదిలావుంటే.. మరోవైపు, ఇప్పటికే గృహ సారథులు అనే కాన్సెప్టును ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కూడా మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఈ గృహ సారథుల్లో ప్రతి 50 ఇళ్ళకు ఇద్దరు చొప్పున ఉంటారు. వీరిలోనూ ఒక మహిళ ఉంటారు. మరొకరిని పురుషుడిని నియమిస్తారు. వీరు ఖచ్చితంగా తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి.. ప్రబుత్వ పథకాలను వివరించడంతోపాటు.. వైసీపీకి ఓటు వేయించే బాధ్యతను తీసుకుంటారు.
ఇలాప్రతి 50 ఇళ్లకు గృహసారథులు ఇద్దరు చొప్పున నిత్యం అందుబాటులో ఉంటారు. వచ్చే 16 మాసాలు వీరు సచివాలయంతోనూ.. ఇటు బూత్ కమిటీతోనూ సమన్వయం చేసుకుని.. ప్రతి ఇంటికీ వెళ్లనున్నారు. సో.. మొత్తంగా చూస్తే సీఎం జగన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండడం గమనార్హం.
This post was last modified on December 16, 2022 6:16 am
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…
పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…