Political News

అబ్బా…! ఏం ప్లాన్ వేశావ్ కన్నా… ?!

కన్నా లక్ష్మీ నారాయణ తెలుగు రాజకీయాల్లో అందరికీ తెలిసిన పేరు. ఉమ్మడి గుంటూరు జిల్లా పెద కూరపాటు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసిన నేతగా ఆయన్ను ఓటర్లు నిత్యం గుర్తు చేసుకుంటారు. వైఎస్ హయాంలో మంత్రిగా ఆయన సేవలను ప్రస్తావిస్తుంటారు. ఆయన ముఖ్యమంత్రి అవుతారని కూడా చెప్పుకున్నారు. ఆ అవకాశం చేజారిన తర్వాత రాజకీయాల్లో కన్నా కొంచెం నిదానించినట్లే కనిపిస్తోంది. విభజన తర్వాత కొంతకాలానికి కాంగ్రెస్ ను వీడిన కన్నా… వైసీపీలోకి వెళ్లాలనుకున్నారు. అయితే బీజేపీలో చేరారు. ఇప్పుడు కమలం పార్టీ అసంతృప్తిపరులకు ఆయన నాయకుడిగా ఉన్నట్లు చెబుతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి పోయిన తర్వాత కన్నా.. పార్టీకి కూడా కొంచెం దూరం జరిగారు. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై కన్నా తీవ్ర ఆగ్రహం, అసంతృప్తితో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు…వీర్రాజుపై ఆయన డైరెక్టుగానే విరుచుకుపడ్డారు…

అయితే అలా… కాకపోతే ఇలా…

కన్నా, బీజేపీ నుంచి బయటకు వస్తారన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. సామాజిక వర్గాల లెక్కలు వేసే కొందరు విశ్లేషకులు ఆయన జనసేన వైపుకు వెళ్తారని చెప్పారు. ఇప్పుడు వారి మాటే నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేనలో నెంబరు టూ గా ఉన్న నాదెండ్ల మనోహర్ తన బృందంతో వెళ్లి కన్నాను కలుసుకోవడం, 40 నిమిషాల పాటు చర్చలు జరపడం పార్టీ మారతారన్న వాదనకు మరింత ఊతమిచ్చినట్లయ్యింది. కన్నా ఇంట్లోనే జరిగిన భేటీ సందర్భంగా ఎన్నికల్లో పోటీ అంశం చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. బీజేపీ జనసేన పొత్తు ఉంటే..కన్నా కమలం పార్టీలో కొనసాగుతూ జనసేనకు మద్దతివ్వాలని పవన్ కల్యాణ్ మాటగా మనోహర్ చెప్పారట. పొత్తు కుదరక ఇరు పార్టీలు ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం బీజేపీకి రాజీనామా చేసి జనసేనలోకి రావాలని ఆహ్వానించారట. అప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కన్నా కోరుకున్న నియోజకవర్గం కేటాయిస్తామని చెప్పారట. కన్నా మాత్రం గుంటూరు నగరంలోనే పోటీ చేయాలనుకుంటున్నారు.. దానితో నాదెండ్ల మనోహర్ ప్రతిపాదన కన్నాకు బాగా నచ్చేసిందట. సరే అలాగే చేద్దామని చెబుతూ కాఫీ ఇచ్చి పంపించారట. బీజేపీలో సోము వీర్రాజు వ్యతిరేకులకు ప్రస్తుత పరిణామాలు కొత్త కిక్కునిస్తున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి….

తనయుడి రాజకీయ భవిష్యత్తు కోసం..

2009 తర్వాత కన్నా ఏ ఎన్నికలోనూ గెలిచింది లేదు. కన్నా మంత్రిగా చేసిన రోజుల్లో ఆయన తనయుడు నాగరాజు గుంటూరు మేయర్ గా ఉండేవారు. తండ్రీ కొడుకులు జిల్లాను ఏలేస్తున్నారన్న ప్రచారం ఉండేది. కాంగ్రెస్ పార్టీ ఏపీలో వీక్ అయిపోయిన తర్వాత కన్నా కుటుంబం కూడా రాజకీయాల్లో అంతంతమాత్రంగా ఉంది. ఇప్పుడు మళ్లీ పుంజుకోవాలన్న ఆరాటం వారిలో కనిపిస్తోంది. ఇకపై తాను వేయబోయే రాజకీయ అడుగులు తనకంటే తన కుమారుడు కన్నా నాగరాజు రాజకీయ భవితవ్యానికి ఉపయోగపడతాయని లక్ష్మి నారాయణ అంటున్నారట…. చూడాలి..

This post was last modified on December 15, 2022 9:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

2 hours ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

2 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

3 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

3 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

4 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

5 hours ago