Political News

అమరావతి టు ఢిల్లీ: టార్గెట్ జగన్

నిద్రాహారాలు మాని ఉద్యమిస్తున్న అన్నదాతలు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతి ఉద్యమానికి మూడేళ్లు నిండుతున్న సందర్భంగా హస్తినలో హల్ చల్ చేయాలనుకుంటున్నారు.

1580 మంది రైతులు ఢిల్లీలో దిగుతారు. జంతర్ మంతర్ ఆందోళన, కిసాన్ ధర్నా కార్యక్రమం ఇవన్నీ బాగానే ఉన్నా…. రైతుల అసలు ఉద్దేశం ఏమిటనేది పెద్ద ప్రశ్న. అలాంటి ప్రశ్న వేసిన వారికి దిమ్మతిరిగే సమాధానం వస్తోంది…

జగన్, మోదీ ఇద్దరూ తమ పాలిట శాపమేనని అమరావతి రైతులు ఆందోళన చెందుతున్నారు. నాడు రాజధానికి శంకుస్థాపన చేసి మట్టి, నీళ్లు ఇచ్చిన మోదీ చేతులు దులుపుకున్నారని గుర్తు చేస్తున్న రైతు సోదరులు.. తదనంతర పరిణామాలపై కూడా ఆగ్రహం చెందుతున్నారు.

మూడు రాజధానుల సహేతుకం కాదని అమరావతి మాత్రమే రాజధాని అవుతుందని కోర్టు వరుస తీర్పులిచ్చినా… కేంద్రం ఎందుకు జగన్ ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు మొక్కుబడి ధర్నాలు చేస్తున్నారని, వాళ్లు తలిస్తే జగన్ ను దారికి తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదని రైతుల వాదన.

అందరి దగ్గర ప్రస్తావిస్తాం…

ఢిల్లీలో ఉండే రెండు మూడు రోజుల్లోనే జగన్, మోదీ తీరును అందరి దగ్గర ఎండగట్టాలని అమరావతి రైతులు నిర్ణయానికి వచ్చారు. బృందాలుగా విడిపోయి వేర్వేరు పార్టీల నేతలను కలుసుకోబోతున్నారు. తమకు సింపథీ అవసరం లేదని, న్యాయమైన డిమాండ్ల సాధన కోసమే ఢిల్లీ రైలెక్కామని చెప్పబోతున్నారు.

నిజానికి అమరావతి రైతలపై దేశంలో సానుభూతి ఉన్న మాట వాస్తవం. అందుకే ఢిల్లీలో ప్రతిపక్ష పెద్దల దృష్టికి మరో సారి ఈ అంశాన్ని తీసుకెళ్లి జగన్ పై వత్తిడి తెచ్చే విధంగా ప్రయత్నించాలని రైతులు ప్రయత్నిస్తున్నారు. వీలైతే కొందరు నేతలను ఏపీకి తీసుకొచ్చి అమరావతి దుస్థితిని చూపించాలనుకుంటున్నారు. మరి అందుకు మార్గం సుగమం అవుతుందో లేదో….

This post was last modified on December 15, 2022 9:13 pm

Share

Recent Posts

ఎట్ట‌కేల‌కు తెలుగులో తొలి హిట్టు

త‌మిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన‌ శివ కార్తికేయ‌న్ లాగే టీవీ రంగం నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అమ్మాయి ప్రియ భ‌వానీ…

29 minutes ago

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

1 hour ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

1 hour ago

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

2 hours ago

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

2 hours ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

2 hours ago