నిద్రాహారాలు మాని ఉద్యమిస్తున్న అన్నదాతలు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతి ఉద్యమానికి మూడేళ్లు నిండుతున్న సందర్భంగా హస్తినలో హల్ చల్ చేయాలనుకుంటున్నారు.
1580 మంది రైతులు ఢిల్లీలో దిగుతారు. జంతర్ మంతర్ ఆందోళన, కిసాన్ ధర్నా కార్యక్రమం ఇవన్నీ బాగానే ఉన్నా…. రైతుల అసలు ఉద్దేశం ఏమిటనేది పెద్ద ప్రశ్న. అలాంటి ప్రశ్న వేసిన వారికి దిమ్మతిరిగే సమాధానం వస్తోంది…
జగన్, మోదీ ఇద్దరూ తమ పాలిట శాపమేనని అమరావతి రైతులు ఆందోళన చెందుతున్నారు. నాడు రాజధానికి శంకుస్థాపన చేసి మట్టి, నీళ్లు ఇచ్చిన మోదీ చేతులు దులుపుకున్నారని గుర్తు చేస్తున్న రైతు సోదరులు.. తదనంతర పరిణామాలపై కూడా ఆగ్రహం చెందుతున్నారు.
మూడు రాజధానుల సహేతుకం కాదని అమరావతి మాత్రమే రాజధాని అవుతుందని కోర్టు వరుస తీర్పులిచ్చినా… కేంద్రం ఎందుకు జగన్ ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు మొక్కుబడి ధర్నాలు చేస్తున్నారని, వాళ్లు తలిస్తే జగన్ ను దారికి తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదని రైతుల వాదన.
అందరి దగ్గర ప్రస్తావిస్తాం…
ఢిల్లీలో ఉండే రెండు మూడు రోజుల్లోనే జగన్, మోదీ తీరును అందరి దగ్గర ఎండగట్టాలని అమరావతి రైతులు నిర్ణయానికి వచ్చారు. బృందాలుగా విడిపోయి వేర్వేరు పార్టీల నేతలను కలుసుకోబోతున్నారు. తమకు సింపథీ అవసరం లేదని, న్యాయమైన డిమాండ్ల సాధన కోసమే ఢిల్లీ రైలెక్కామని చెప్పబోతున్నారు.
నిజానికి అమరావతి రైతలపై దేశంలో సానుభూతి ఉన్న మాట వాస్తవం. అందుకే ఢిల్లీలో ప్రతిపక్ష పెద్దల దృష్టికి మరో సారి ఈ అంశాన్ని తీసుకెళ్లి జగన్ పై వత్తిడి తెచ్చే విధంగా ప్రయత్నించాలని రైతులు ప్రయత్నిస్తున్నారు. వీలైతే కొందరు నేతలను ఏపీకి తీసుకొచ్చి అమరావతి దుస్థితిని చూపించాలనుకుంటున్నారు. మరి అందుకు మార్గం సుగమం అవుతుందో లేదో….
This post was last modified on December 15, 2022 9:13 pm
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…