Political News

అమరావతి టు ఢిల్లీ: టార్గెట్ జగన్

నిద్రాహారాలు మాని ఉద్యమిస్తున్న అన్నదాతలు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతి ఉద్యమానికి మూడేళ్లు నిండుతున్న సందర్భంగా హస్తినలో హల్ చల్ చేయాలనుకుంటున్నారు.

1580 మంది రైతులు ఢిల్లీలో దిగుతారు. జంతర్ మంతర్ ఆందోళన, కిసాన్ ధర్నా కార్యక్రమం ఇవన్నీ బాగానే ఉన్నా…. రైతుల అసలు ఉద్దేశం ఏమిటనేది పెద్ద ప్రశ్న. అలాంటి ప్రశ్న వేసిన వారికి దిమ్మతిరిగే సమాధానం వస్తోంది…

జగన్, మోదీ ఇద్దరూ తమ పాలిట శాపమేనని అమరావతి రైతులు ఆందోళన చెందుతున్నారు. నాడు రాజధానికి శంకుస్థాపన చేసి మట్టి, నీళ్లు ఇచ్చిన మోదీ చేతులు దులుపుకున్నారని గుర్తు చేస్తున్న రైతు సోదరులు.. తదనంతర పరిణామాలపై కూడా ఆగ్రహం చెందుతున్నారు.

మూడు రాజధానుల సహేతుకం కాదని అమరావతి మాత్రమే రాజధాని అవుతుందని కోర్టు వరుస తీర్పులిచ్చినా… కేంద్రం ఎందుకు జగన్ ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు మొక్కుబడి ధర్నాలు చేస్తున్నారని, వాళ్లు తలిస్తే జగన్ ను దారికి తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదని రైతుల వాదన.

అందరి దగ్గర ప్రస్తావిస్తాం…

ఢిల్లీలో ఉండే రెండు మూడు రోజుల్లోనే జగన్, మోదీ తీరును అందరి దగ్గర ఎండగట్టాలని అమరావతి రైతులు నిర్ణయానికి వచ్చారు. బృందాలుగా విడిపోయి వేర్వేరు పార్టీల నేతలను కలుసుకోబోతున్నారు. తమకు సింపథీ అవసరం లేదని, న్యాయమైన డిమాండ్ల సాధన కోసమే ఢిల్లీ రైలెక్కామని చెప్పబోతున్నారు.

నిజానికి అమరావతి రైతలపై దేశంలో సానుభూతి ఉన్న మాట వాస్తవం. అందుకే ఢిల్లీలో ప్రతిపక్ష పెద్దల దృష్టికి మరో సారి ఈ అంశాన్ని తీసుకెళ్లి జగన్ పై వత్తిడి తెచ్చే విధంగా ప్రయత్నించాలని రైతులు ప్రయత్నిస్తున్నారు. వీలైతే కొందరు నేతలను ఏపీకి తీసుకొచ్చి అమరావతి దుస్థితిని చూపించాలనుకుంటున్నారు. మరి అందుకు మార్గం సుగమం అవుతుందో లేదో….

This post was last modified on December 15, 2022 9:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

59 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago