Political News

అమరావతి టు ఢిల్లీ: టార్గెట్ జగన్

నిద్రాహారాలు మాని ఉద్యమిస్తున్న అన్నదాతలు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతి ఉద్యమానికి మూడేళ్లు నిండుతున్న సందర్భంగా హస్తినలో హల్ చల్ చేయాలనుకుంటున్నారు.

1580 మంది రైతులు ఢిల్లీలో దిగుతారు. జంతర్ మంతర్ ఆందోళన, కిసాన్ ధర్నా కార్యక్రమం ఇవన్నీ బాగానే ఉన్నా…. రైతుల అసలు ఉద్దేశం ఏమిటనేది పెద్ద ప్రశ్న. అలాంటి ప్రశ్న వేసిన వారికి దిమ్మతిరిగే సమాధానం వస్తోంది…

జగన్, మోదీ ఇద్దరూ తమ పాలిట శాపమేనని అమరావతి రైతులు ఆందోళన చెందుతున్నారు. నాడు రాజధానికి శంకుస్థాపన చేసి మట్టి, నీళ్లు ఇచ్చిన మోదీ చేతులు దులుపుకున్నారని గుర్తు చేస్తున్న రైతు సోదరులు.. తదనంతర పరిణామాలపై కూడా ఆగ్రహం చెందుతున్నారు.

మూడు రాజధానుల సహేతుకం కాదని అమరావతి మాత్రమే రాజధాని అవుతుందని కోర్టు వరుస తీర్పులిచ్చినా… కేంద్రం ఎందుకు జగన్ ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు మొక్కుబడి ధర్నాలు చేస్తున్నారని, వాళ్లు తలిస్తే జగన్ ను దారికి తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదని రైతుల వాదన.

అందరి దగ్గర ప్రస్తావిస్తాం…

ఢిల్లీలో ఉండే రెండు మూడు రోజుల్లోనే జగన్, మోదీ తీరును అందరి దగ్గర ఎండగట్టాలని అమరావతి రైతులు నిర్ణయానికి వచ్చారు. బృందాలుగా విడిపోయి వేర్వేరు పార్టీల నేతలను కలుసుకోబోతున్నారు. తమకు సింపథీ అవసరం లేదని, న్యాయమైన డిమాండ్ల సాధన కోసమే ఢిల్లీ రైలెక్కామని చెప్పబోతున్నారు.

నిజానికి అమరావతి రైతలపై దేశంలో సానుభూతి ఉన్న మాట వాస్తవం. అందుకే ఢిల్లీలో ప్రతిపక్ష పెద్దల దృష్టికి మరో సారి ఈ అంశాన్ని తీసుకెళ్లి జగన్ పై వత్తిడి తెచ్చే విధంగా ప్రయత్నించాలని రైతులు ప్రయత్నిస్తున్నారు. వీలైతే కొందరు నేతలను ఏపీకి తీసుకొచ్చి అమరావతి దుస్థితిని చూపించాలనుకుంటున్నారు. మరి అందుకు మార్గం సుగమం అవుతుందో లేదో….

This post was last modified on December 15, 2022 9:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

39 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

1 hour ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

1 hour ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago

జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

3 hours ago