ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ అనంతబాబు బాబు.. కొన్ని నెలల కిందట ఒక హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తన దగ్గరే డ్రైవర్గా పని చేసి మానేసిన సుబ్రహ్మణ్యం అనే ఎస్సీ కుర్రాడిని కొట్టి చంపిన కేసులో బాబు ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొన్నారు. బాబునే స్వయంగా సుబ్రహ్మణ్యంను అతడి ఇంటి నుంచి తీసుకెళ్లడం.. తర్వాత తన శవాన్ని కార్లో తీసుకొచ్చి ఇంటిదగ్గర విడిచిపెట్టడం సంచలనం రేపింది. ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఈ కేసుల్లో అరెస్టయిన బాబుకు బెయిల్ దొరకడం కష్టమైంది. కేసు విచారణ జరుగుతుండగా.. రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు బాబు. ఆయన బెయిల్ పిటిషన్లను కొట్టి వేస్తూ వచ్చిన కోర్టు.. ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. ఇది బాబుకు గొప్ప ఊరట అనే చెప్పాలి.
ఐతే సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటూ.. బెయిల్ మీద బయటకు వచ్చిన బాబుకు.. జైలు బయట లభించిన ఘనస్వాగతం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయనేదో ఘనకార్యం చేసి బయటికి వచ్చినట్లుగా అభిమానులు ‘జై బాబు జై బాబు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
ఆయనకు పూల మాలలు వేసి సత్కరించారు. తర్వాత ఊరేగింపు కార్యక్రమం కూడా చేపట్టారు. సంబంధిత ఫొటోలు, వీడియోలు చూసి సోషల్ మీడియా జనాలు షాకవుతున్నారు. బాబు ఏం సాధించారని ఈ నినాదాలు, సత్కారాలు, ఊరేగింపులు అని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో జైలు నుంచి విడుదలైనపుడు ఆయన అభిమానులు కూడా ఇలాగే చేశారని.. వైసీపీ అంటేనే క్రిమినల్ పాలిటిక్స్కు కేరాఫ్ అడ్రస్ అనడానికి ఇది నిదర్శనమని పేర్కొంటూ ఆ పార్టీ వ్యతిరేకులతో పాటు న్యూట్రల్ జనాలు కూడా వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.
This post was last modified on December 15, 2022 3:53 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…