Political News

హత్య కేసులో బయటికొస్తే విజయయాత్ర

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ అనంతబాబు బాబు.. కొన్ని నెలల కిందట ఒక హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తన దగ్గరే డ్రైవర్‌గా పని చేసి మానేసిన సుబ్రహ్మణ్యం అనే ఎస్సీ కుర్రాడిని కొట్టి చంపిన కేసులో బాబు ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొన్నారు. బాబునే స్వయంగా సుబ్రహ్మణ్యంను అతడి ఇంటి నుంచి తీసుకెళ్లడం.. తర్వాత తన శవాన్ని కార్లో తీసుకొచ్చి ఇంటిదగ్గర విడిచిపెట్టడం సంచలనం రేపింది. ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

ఈ కేసుల్లో అరెస్టయిన బాబుకు బెయిల్ దొరకడం కష్టమైంది. కేసు విచారణ జరుగుతుండగా.. రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు బాబు. ఆయన బెయిల్ పిటిషన్లను కొట్టి వేస్తూ వచ్చిన కోర్టు.. ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. ఇది బాబుకు గొప్ప ఊరట అనే చెప్పాలి.
ఐతే సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటూ.. బెయిల్ మీద బయటకు వచ్చిన బాబుకు.. జైలు బయట లభించిన ఘనస్వాగతం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయనేదో ఘనకార్యం చేసి బయటికి వచ్చినట్లుగా అభిమానులు ‘జై బాబు జై బాబు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

ఆయనకు పూల మాలలు వేసి సత్కరించారు. తర్వాత ఊరేగింపు కార్యక్రమం కూడా చేపట్టారు. సంబంధిత ఫొటోలు, వీడియోలు చూసి సోషల్ మీడియా జనాలు షాకవుతున్నారు. బాబు ఏం సాధించారని ఈ నినాదాలు, సత్కారాలు, ఊరేగింపులు అని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో జైలు నుంచి విడుదలైనపుడు ఆయన అభిమానులు కూడా ఇలాగే చేశారని.. వైసీపీ అంటేనే క్రిమినల్ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్ అనడానికి ఇది నిదర్శనమని పేర్కొంటూ ఆ పార్టీ వ్యతిరేకులతో పాటు న్యూట్రల్ జనాలు కూడా వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.

This post was last modified on December 15, 2022 3:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago