ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ కరోనా టెస్టింగ్ మీద కొన్ని రోజులుగా ఎంత రగడ నడుస్తోందో తెలిసిందే. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఒక్కోటి రూ.337 రూపాయలకే కొన్న కిట్లను ఏపీ సర్కారు రూ.700 చొప్పున పెట్టి కొనడంపై దుమారం రేగింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ముందు బుకాయించినప్పటికీ.. తర్వాత దిద్దుబాటు చర్యలకు దిగింది. చివరికి రేటు తగ్గించే ప్రభుత్వానికి అందజేసేందుకు మధ్యవర్తిగా వ్యవహరించిన కంపెనీ అంగీకరించినట్లు చెబుతున్నారు. ఐతే ఈ వ్యవహారం ఇంతటితో సద్దుమణిగిందిలే అనుకుంటే.. ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ.. రెండు రోజుల పాటు వాటి వినియోగాన్ని ఆపేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు పది నుంచి 30 నిమిషాల లోపే ఫలితాలు వెల్లడిస్తాయని అంటున్నారు. ఐతే వీటి ఫలితాల్లో కచ్చితత్వంపై ముందు నుంచి సందేహాలున్నాయి. ఈ కిట్లు తయారైన కొరియాలోనే వీటి నాణ్యత మీద సందేహాలు వ్యక్తమయ్యాయి. అక్కడి వైద్యులు ఈ కిట్లను ఉపయోగించవద్దని సూచించారు. అయినా సరే.. ఏపీ సహా కొన్ని రాష్ట్రాలు ఆ కిట్లను తెప్పించుకున్నాయి. ఐతే ఈ కిట్ల పనితీరును పరిశీలిస్తే కచ్చితమైన ఫలితాలు రావట్లేదని వెల్లడైందని.. ఫలితాల్లో తేడా ఉంటోందని.. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు ఈ కిట్ల వినియోగం ఆపాలని.. తదుపరి మార్గదర్శకాలు వచ్చే వరకు ఎదురు చూడాలని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతినిధి మీడియా సమవేశంలో తెలిపారు. మరి లక్ష ర్యాపిడ్ కిట్లు వచ్చేశాయ్.. టెస్టింగ్స్ సంఖ్య ఒక్కసారిగే పెంచేద్దాం అనుకున్న ఏపీ సర్కారుకు ఇది ఇబ్బందికర పరిణామమే.
This post was last modified on April 22, 2020 3:45 pm
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…