Categories: Political News

ఏపీ స‌ర్కారు కిట్లకు కేంద్రం బ్రేక్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ క‌రోనా టెస్టింగ్ మీద కొన్ని రోజులుగా ఎంత ర‌గ‌డ న‌డుస్తోందో తెలిసిందే. ఛ‌త్తీస్ గ‌ఢ్ ప్ర‌భుత్వం ఒక్కోటి రూ.337 రూపాయ‌ల‌కే కొన్న కిట్ల‌ను ఏపీ స‌ర్కారు రూ.700 చొప్పున‌ పెట్టి కొన‌డంపై దుమారం రేగింది. దీనిపై ఏపీ ప్ర‌భుత్వం ముందు బుకాయించిన‌ప్ప‌టికీ.. త‌ర్వాత దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది. చివ‌రికి రేటు త‌గ్గించే ప్ర‌భుత్వానికి అంద‌జేసేందుకు మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రించిన కంపెనీ అంగీక‌రించిన‌ట్లు చెబుతున్నారు. ఐతే ఈ వ్య‌వ‌హారం ఇంత‌టితో స‌ద్దుమ‌ణిగిందిలే అనుకుంటే.. ఇప్పుడు కొత్త త‌ల‌నొప్పి వ‌చ్చి ప‌డింది. ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల నాణ్య‌త‌పై సందేహాలు వ్య‌క్తం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ‌.. రెండు రోజుల పాటు వాటి వినియోగాన్ని ఆపేయాల‌ని అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు ఆదేశాలు జారీ చేసింది.

ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు ప‌ది నుంచి 30 నిమిషాల లోపే ఫ‌లితాలు వెల్ల‌డిస్తాయ‌ని అంటున్నారు. ఐతే వీటి ఫ‌లితాల్లో క‌చ్చిత‌త్వంపై ముందు నుంచి సందేహాలున్నాయి. ఈ కిట్లు త‌యారైన కొరియాలోనే వీటి నాణ్య‌త మీద సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అక్క‌డి వైద్యులు ఈ కిట్ల‌ను ఉప‌యోగించ‌వ‌ద్ద‌ని సూచించారు. అయినా స‌రే.. ఏపీ స‌హా కొన్ని రాష్ట్రాలు ఆ కిట్ల‌ను తెప్పించుకున్నాయి. ఐతే ఈ కిట్ల ప‌నితీరును ప‌రిశీలిస్తే క‌చ్చిత‌మైన ఫ‌లితాలు రావ‌ట్లేద‌ని వెల్ల‌డైంద‌ని.. ఫలితాల్లో తేడా ఉంటోంద‌ని.. ఈ నేప‌థ్యంలో రెండు రోజుల పాటు ఈ కిట్ల విని‌యోగం ఆపాల‌ని.. త‌దుప‌రి మార్గ‌ద‌ర్శ‌కాలు వ‌చ్చే వ‌ర‌కు ఎదురు చూడాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌తినిధి మీడియా స‌మ‌వేశంలో తెలిపారు. మ‌రి ల‌క్ష ర్యాపిడ్ కిట్లు వ‌చ్చేశాయ్.. టెస్టింగ్స్ సంఖ్య ఒక్క‌సారిగే పెంచేద్దాం అనుకున్న ఏపీ స‌ర్కారుకు ఇది ఇబ్బందిక‌ర ప‌రిణామ‌మే.

This post was last modified on April 22, 2020 3:45 pm

Share

Recent Posts

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

2 hours ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

4 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

4 hours ago

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…

5 hours ago

తెలుగు రామాయణ మీద 100 కోట్లు సేఫేనా

నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…

6 hours ago

ఓజి 2 సౌండ్ చెయ్యడం లేదేంటి

సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…

6 hours ago