Categories: Political News

ఏపీ స‌ర్కారు కిట్లకు కేంద్రం బ్రేక్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ క‌రోనా టెస్టింగ్ మీద కొన్ని రోజులుగా ఎంత ర‌గ‌డ న‌డుస్తోందో తెలిసిందే. ఛ‌త్తీస్ గ‌ఢ్ ప్ర‌భుత్వం ఒక్కోటి రూ.337 రూపాయ‌ల‌కే కొన్న కిట్ల‌ను ఏపీ స‌ర్కారు రూ.700 చొప్పున‌ పెట్టి కొన‌డంపై దుమారం రేగింది. దీనిపై ఏపీ ప్ర‌భుత్వం ముందు బుకాయించిన‌ప్ప‌టికీ.. త‌ర్వాత దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది. చివ‌రికి రేటు త‌గ్గించే ప్ర‌భుత్వానికి అంద‌జేసేందుకు మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రించిన కంపెనీ అంగీక‌రించిన‌ట్లు చెబుతున్నారు. ఐతే ఈ వ్య‌వ‌హారం ఇంత‌టితో స‌ద్దుమ‌ణిగిందిలే అనుకుంటే.. ఇప్పుడు కొత్త త‌ల‌నొప్పి వ‌చ్చి ప‌డింది. ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల నాణ్య‌త‌పై సందేహాలు వ్య‌క్తం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ‌.. రెండు రోజుల పాటు వాటి వినియోగాన్ని ఆపేయాల‌ని అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు ఆదేశాలు జారీ చేసింది.

ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు ప‌ది నుంచి 30 నిమిషాల లోపే ఫ‌లితాలు వెల్ల‌డిస్తాయ‌ని అంటున్నారు. ఐతే వీటి ఫ‌లితాల్లో క‌చ్చిత‌త్వంపై ముందు నుంచి సందేహాలున్నాయి. ఈ కిట్లు త‌యారైన కొరియాలోనే వీటి నాణ్య‌త మీద సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అక్క‌డి వైద్యులు ఈ కిట్ల‌ను ఉప‌యోగించ‌వ‌ద్ద‌ని సూచించారు. అయినా స‌రే.. ఏపీ స‌హా కొన్ని రాష్ట్రాలు ఆ కిట్ల‌ను తెప్పించుకున్నాయి. ఐతే ఈ కిట్ల ప‌నితీరును ప‌రిశీలిస్తే క‌చ్చిత‌మైన ఫ‌లితాలు రావ‌ట్లేద‌ని వెల్ల‌డైంద‌ని.. ఫలితాల్లో తేడా ఉంటోంద‌ని.. ఈ నేప‌థ్యంలో రెండు రోజుల పాటు ఈ కిట్ల విని‌యోగం ఆపాల‌ని.. త‌దుప‌రి మార్గ‌ద‌ర్శ‌కాలు వ‌చ్చే వ‌ర‌కు ఎదురు చూడాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌తినిధి మీడియా స‌మ‌వేశంలో తెలిపారు. మ‌రి ల‌క్ష ర్యాపిడ్ కిట్లు వ‌చ్చేశాయ్.. టెస్టింగ్స్ సంఖ్య ఒక్క‌సారిగే పెంచేద్దాం అనుకున్న ఏపీ స‌ర్కారుకు ఇది ఇబ్బందిక‌ర ప‌రిణామ‌మే.

This post was last modified on April 22, 2020 3:45 pm

Share

Recent Posts

ఆగస్ట్ 7… ఓటిటిలో కంటెంట్ వర్షం

థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…

29 minutes ago

టీమిండియా కొత్త చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?

బీసీసీఐలో ఇప్పుడు కీలక మార్పులు జరగబోతున్నాయా? అవుననే అంటున్నాయి క్రీడా వర్గాలు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవికి…

49 minutes ago

పిఠాపురం ఇకపై పవన్ కంచు కోట

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్…

1 hour ago

రక్తంతో రాసుకున్న ‘ప్యారడైజ్’ శాసనం

న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…

3 hours ago

డీఎస్సీపైనే వైసీపీకి ఎందుకంత మంకుపట్టు?

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…

3 hours ago

కొత్త మార్పుల వైపు చరణ్ & సుకుమార్ ?

ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…

4 hours ago