Political News

పీఏసీకి పొగ‌.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంతే గురూ!!

పీఏసీ.. ప్ర‌జా ప‌ద్దుల క‌మిటీ.. ఇది ఏ రాష్ట్రంలో అయినా.. ప్ర‌భుత్వం చేసే ఖ‌ర్చులు, వ్య‌యాల‌కు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు నిశితంగా ప‌రిశీలిస్తూ.. హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం.. ప్ర‌జ‌లు ప‌న్నుల ద్వారా క‌డుతున్న సొమ్మును ప్ర‌భుత్వాలు ఎలా ఖ‌ర్చు చేస్తున్నాయో.. లెక్క‌లు కోర‌డం.. దానిని మదింపు చేయ‌డం, శాస‌న స‌భ‌కు వివ‌రించ‌డం.. ముఖ్యంగా స్పీక‌ర్‌కు నివేదిక అందించ‌డం అనేది పీఏసీ ప‌ని. ఇదేమీ.. ఊరికేనే ప‌నిలేక ఏర్పాటు చేసిన క‌మిటీ కాదు. శాస‌నస‌భ‌, కాగ్ నిబంధ‌న‌ల మేర‌కు ప్ర‌తిరాష్ట్రంలోనూ ఏర్పాటు చేయాల‌నే నిబంధ‌న ఉంది.

పార్ల‌మెంటులో అయితే.. పీఏసీని చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తారు. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల విష‌యంలో పీఏసీ అన్న మాటే వినిపించ‌డం లేదు. నిబంధ‌న‌ల ప్ర‌కారం.. పీఏసీని ఏర్పాటు చేశారు. అయితే. దీనికి సంబంధించి ఇటు శాస‌న స‌భ‌కానీ, అటు ప్ర‌భుత్వం కానీ.. ప‌ట్టించుకోక‌పోవ‌డంతో రెండు రాష్ట్రాల్లోనూ పీఏసీలు సుప్త‌చేత‌నావ‌స్థ‌ను ఎదుర్కొంటున్నాయ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తెలంగాణ‌లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఒవైసీ నేతృత్వంలో పీఏసీని ఏర్పాటు చేశారు. దీనిలో ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు.

కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కటంటే ఒక్క స‌మావేశం నిర్వ‌హించ‌లేదు. దీనిని ప్ర‌శ్నించేవారు కూడా లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. ప్ర‌తిప‌క్షంగా ఉన్న ఎంఐఎం.. అధికార పార్టీకి మిత్ర‌ప‌క్షంగా ఉండ‌డ‌మేన‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. దీంతో ప్ర‌భుత్వం ప్ర‌జాధనాన్ని ఇష్టానుసారం ఖ‌ర్చు చేసిన అడిగే నాథుడు లేకుండా పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్యే ప‌య్యావుల కేశ‌వ్‌.. పీఏసీ చైర్మ‌న్‌గా ఉన్నారు.

ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. కేశ‌వ్ బలంగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం మాత్రం పీఏసీకి స‌హ‌క‌రించ‌డం లేద‌నే విమ‌ర్శలు వున్నాయి. పీఏసీలో మొత్తం 12 మంది స‌భ్యులు ఉన్నారు. వీరిలో అస‌లు ఏడుగురిని నియ‌మించ‌నేలేదు. పోనీ.. ఏదో ఒక విదంగా స‌మావేశం అవుదామ‌న్నా.. మిగిలిన స‌భ్యుల‌ను స‌మావేశాల‌కు వెళ్ల‌కుండా స‌ర్కారు అడ్డంకులు సృష్టిస్తోంద‌నే వాద‌న ఉంది. మొత్తంగా ఈ రెండు రాష్ట్రాల్లోనూ పీఏసీ గురించి అడిగేవారు.. ప‌ట్టించుకునే వారు కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 14, 2022 12:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్వాలిటీ క్యాస్టింగ్ – పూరి జగన్నాథ్ ప్లానింగ్

మాములుగా సీనియర్ దర్శకులకు వరసగా డిజాస్టర్లు పడితే కంబ్యాక్ కావడం అంత సులభంగా ఉండదు. అసలు వాళ్ళ కథలు వినడానికే…

20 minutes ago

ఇంజెక్షన్‌ల భయానికి చెక్ పెట్టిన కొత్త టెక్నాలజీ

ఇంజెక్షన్ అని వినగానే చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్లలో కూడా భయం కనిపిస్తుంది. దీనికి వైద్య పరంగా ట్రిపనోఫోబియా అని…

1 hour ago

ఏపీలో ఎన్నిక‌.. షెడ్యూల్ విడుద‌ల‌!

ఏపీలో కీల‌క‌మైన ఓ రాజ్య‌స‌భ సీటు ఎన్నిక‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా షెడ్యూల్ ప్ర‌క‌టించింది. వైసీపీ నుంచి…

1 hour ago

ప్రేమకథతో తిరిగి వస్తున్న బుట్టబొమ్మ

డీజే దువ్వాడ జగన్నాథంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నా హీరోయిన్ గా తన స్థాయిని అమాంతం పెంచేసిన సినిమాల్లో అల వైకుంఠపురములో…

1 hour ago

వరుసగా ఏఐ మేధావుల మరణాలు.. ఏం జరుగుతోంది?

చాట్ GPT - డీప్ సీక్ - మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి…

2 hours ago

పెద్ది గురించి శివన్న….హైప్ పెంచేశాడన్నా

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ట్రెండింగ్…

2 hours ago