ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మంగళ వారం సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా పెన్షన్ పెంపుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం రూ. 2,500గా ఉన్న సామాజిక పింఛన్ను వచ్చే నెల నుంచి రూ. 2,750కి పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 62. 31 లక్షల మంది పెన్షన్దారులకు మేలు జరుగనుంది. జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్ను అమలు కానుంది. మరోవైపు వైఎస్సార్ పశుబీమా పథకం ప్రతిపాదనలకు కేబినె ట్ ఆమోదం తెలిపింది.
అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో వర్చువల్ క్లాస్లు, ఫౌండేషన్ స్కూళ్లలో స్మార్ట్ టీవీ రూమ్లను నాడు-నేడు ద్వారా నిర్మించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్రవేసింది. విద్యార్థులకు ట్యాబులను ఇచ్చేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిని స్వయంగా మంత్రులే విద్యార్థులకు అందించాలని సీఎం ఆదేశించారు. అదేవిధంగా పెన్షన్ పెంపు, ఆసరా కార్యక్రమంలో మంత్రులు పాల్గొనాలని కూడా సీఎం నిర్దేశించారు.
గడపగడప కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం మంత్రులు అందరికీ సూచించారు. జిల్లాల అధ్య క్షులతో కలిసి పని చేసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. ఈనెల 16న గడపగడపకు ప్రభుత్వంపై సీఎం సమీక్ష చేయనున్నారు. మొత్తం 151 మంది ఎమ్మెల్యేలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం విశేషం.
This post was last modified on December 14, 2022 12:03 am
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…
సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…
దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…