ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడ్డాయా? విశాఖకు రాజధానిని తరలించే ప్రక్రియలో భాగంగా.. ముందుగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తరలించేందుకు ప్రతిపాదనలు ఓకే అయ్యాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా .. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది.
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మూడు రాజధానుల అంశంపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
ఎంత వేగంగా అయితే.. అంత వేగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని..ముఖ్యంగా విశాఖకు వెళ్లిపోవాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. అయితే, దీనికి సంబంధించిన అడుగులు వేయాలన్నా.. తీయాలన్నా.. న్యాయవ్యవస్థ కొన్ని ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో ఈ ప్రతిపాదనలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అయితే.. ఇటీవల సుప్రీంకోర్టును ఒప్పించే ప్రయత్నం చేసినా.. అది ఫలించలేదు.
ఇదిలావుంటే, తక్షణం విశాకకు వెళ్లిపోవాలన్న వైసీపీ సర్కారు వ్యూహంలో భాగంగా తాజాగా కేబినెట్ ఒక కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేసినట్టు సమాచారం. రాజధాని తరలింపులో భాగంగా.. ముందుగా.. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తరలించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం తరలింపునకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో తొలుత దీనిని తరలించాలన్న ప్రతిపాదనను మంత్రులు ఓకేచేశారని సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ 11న సీఎంవో విశాఖకు తరలిపోతుందని తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
This post was last modified on December 13, 2022 4:19 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…