ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడ్డాయా? విశాఖకు రాజధానిని తరలించే ప్రక్రియలో భాగంగా.. ముందుగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తరలించేందుకు ప్రతిపాదనలు ఓకే అయ్యాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా .. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది.
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మూడు రాజధానుల అంశంపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
ఎంత వేగంగా అయితే.. అంత వేగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని..ముఖ్యంగా విశాఖకు వెళ్లిపోవాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. అయితే, దీనికి సంబంధించిన అడుగులు వేయాలన్నా.. తీయాలన్నా.. న్యాయవ్యవస్థ కొన్ని ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో ఈ ప్రతిపాదనలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అయితే.. ఇటీవల సుప్రీంకోర్టును ఒప్పించే ప్రయత్నం చేసినా.. అది ఫలించలేదు.
ఇదిలావుంటే, తక్షణం విశాకకు వెళ్లిపోవాలన్న వైసీపీ సర్కారు వ్యూహంలో భాగంగా తాజాగా కేబినెట్ ఒక కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేసినట్టు సమాచారం. రాజధాని తరలింపులో భాగంగా.. ముందుగా.. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తరలించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం తరలింపునకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో తొలుత దీనిని తరలించాలన్న ప్రతిపాదనను మంత్రులు ఓకేచేశారని సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ 11న సీఎంవో విశాఖకు తరలిపోతుందని తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
This post was last modified on December 13, 2022 4:19 pm
వ్యక్తిగత జీవితంలో నువ్వా నేనా అంటూ వివాదాలు, గొడవల్లో ఉంటున్న మంచు సోదరులు విష్ణు, మనోజ్ బాక్సాఫీస్ వద్ద కూడా…
రజనీకాంత్ లాంటి పెద్ద సూపర్ స్టార్. టాలీవుడ్ సీనియర్ మోస్ట్ అగ్ర హీరో నాగార్జున ప్రత్యేక పాత్ర. కన్నడలోనే బిజీగా…
మాములుగా ఏదైనా పెద్ద సినిమాకు పాటల రికార్డింగ్ జరిగిపోయాక వాటిని ఎప్పుడు షూట్ చేస్తారు, ఎంత టైంలో విడుదలవుతుందనేది మ్యూజిక్…
ఇటీవల విడుదలైన ఛావా సినిమాలో శంబాజి మహరాజ్ సీన్స్ చాలామందిని కదిలించాయి. ముఖ్యంగా ఔరంగజేబు క్యారెక్టర్ శంబాజిని అతి క్రూరంగా…
పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఎదుర్కొంటుండగా, ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ మరింత కష్టాల్లోకి నెట్టేసింది. భారత్…
భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) పై కఠిన చర్యలు…