Political News

ఏపీ కేబినెట్ సంచ‌ల‌న ఆమోదం.. సీఎంవో త‌ర‌లింపున‌కు ఓకే!

ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా అడుగులు పడ్డాయా? విశాఖ‌కు రాజ‌ధానిని త‌ర‌లించే ప్ర‌క్రియ‌లో భాగంగా.. ముందుగా ముఖ్య‌మంత్రి కార్యాల‌యాన్ని త‌ర‌లించేందుకు ప్ర‌తిపాద‌న‌లు ఓకే అయ్యాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా .. రాష్ట్ర మంత్రి వ‌ర్గ స‌మావేశం జ‌రిగింది.
ముఖ్యమంత్రి జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో మూడు రాజ‌ధానుల అంశంపైనా చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

ఎంత వేగంగా అయితే.. అంత వేగంగా మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేయాల‌ని..ముఖ్యంగా విశాఖ‌కు వెళ్లిపోవాల‌ని వైసీపీ ప్ర‌భుత్వం భావిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, దీనికి సంబంధించిన అడుగులు వేయాల‌న్నా.. తీయాల‌న్నా.. న్యాయ‌వ్య‌వ‌స్థ కొన్ని ఆదేశాలు జారీచేసింది. ఈ క్ర‌మంలో ఈ ప్ర‌తిపాద‌న‌లు ఎక్క‌డిక‌క్క‌డే నిలిచిపోయాయి. అయితే.. ఇటీవ‌ల సుప్రీంకోర్టును ఒప్పించే ప్ర‌య‌త్నం చేసినా.. అది ఫ‌లించ‌లేదు.

ఇదిలావుంటే, త‌క్ష‌ణం విశాక‌కు వెళ్లిపోవాల‌న్న వైసీపీ స‌ర్కారు వ్యూహంలో భాగంగా తాజాగా కేబినెట్ ఒక కీల‌క నిర్ణ‌యానికి ఆమోద ముద్ర వేసిన‌ట్టు స‌మాచారం. రాజ‌ధాని త‌ర‌లింపులో భాగంగా.. ముందుగా.. ముఖ్య‌మంత్రి కార్యాల‌యాన్ని త‌ర‌లించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని తెలుస్తోంది. ముఖ్య‌మంత్రి కార్యాల‌యం త‌ర‌లింపున‌కు ఎలాంటి ఇబ్బంది లేక‌పోవ‌డంతో తొలుత దీనిని త‌ర‌లించాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను మంత్రులు ఓకేచేశార‌ని స‌మాచారం. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 11న సీఎంవో విశాఖ‌కు త‌ర‌లిపోతుంద‌ని తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Satya

Recent Posts

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

18 minutes ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

46 minutes ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

2 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

2 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

2 hours ago

సేనానికి అభిమానమే అడ్డు కాకూడదు

భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…

2 hours ago