Political News

పొరపాటు చేసి తల పట్టుకుంటున్న కేజ్రీవాల్

ఎంతటి నాయకుడైనా ఏదోక పొరపాటు చేస్తారంటారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా పొరపాటు చేసి ఇప్పుడు తలపట్టుకుంటున్నారు గజరాత్ ఎన్నికల్లో ఆయా రామ్ గయా రామ్ లకు టికెట్లిచ్చి ఇప్పుడు ఆయన ఇబ్బందుల్లో పడ్డారు.

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 156 స్థానాలు పొందింది. తొలి సారి పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సత్తా చాటింది. 12 శాతం ఓటు షేర్ తో ఐదు స్థానాల్లో గెలిచింది. ఈ క్రమంలో ఆప్ కు జాతీయ హోదా పొందే సువర్ణావకాశాన్ని సాధించింది. అంతవరకు బాగానే ఉన్నా.. గుజరాత్ లో ఆప్ కు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి..

ఆప్ తరపున గెలిచిన ఐదుగురిలో ముగ్గురు పక్క చూపులు చూసే పరిస్థితి ఏర్పడింది. విసావదార్ ఎమ్మెల్యే భూపత్ భయానీ, బోతాడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉమేష్ మఖ్వానా, గారియాధార్ ఎమ్మెల్యే సుధీర్ వాఘానీ… ఇప్పుడు అధికార బీజేపీలో చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు..

నిజానికి ఆ ముగ్గురు బీజేపీలో పుట్టి పెరిగిన వారే, అక్కడ టికెట్ రాకపోవడంతో ఆప్ లో చేరి కేజ్రీవాల్ ఇచ్చిన బీ ఫార్మ్ తీసుకుని గెలిచారు. ఇప్పుడు బీజేపీ అధికారానికి రాగానే సొంత పార్టీలోకి వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పైగా గుజరాత్ ప్రజలు బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ ఇచ్చారని, ఆ మెజార్టీని గౌరవించడం తమ ధర్మమని చెబుతున్నారు.దానితో చేసిన పొరపాటును కేజ్రీవాల్ గ్రహించారు.

అయినా ఇప్పుడు చేయగలిగిందేముంది మెజార్టీ వర్గం వెళ్లిపోతుండటంతో పార్టీ ఫిరాయింపుల చట్టం పరిధిలోకి కూడా రారని తెలిపోయింది. మరో పక్క ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం.. దానితో గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ బలం 162కు పెరుగుతుంది….

Satya

Recent Posts

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

27 minutes ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

1 hour ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

1 hour ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

2 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

2 hours ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

4 hours ago