ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమై చాలా రోజులైంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఘరంగా ఓడిపోయింది. ఒక్క సారి కూడా కాదు.. రెండు సార్లు ఆ పని జరిగింది. అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని గ్రాండ్ ఓల్డ్ పార్టీ అది. హేమాహేమలైన నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
హర్షకుమార్, కేవీపీ, పల్లంరాజు లాంటి నేతలు ఎటూ వెళ్లలేక పార్టీలోనే టైమ్ పాస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడైనప్పటి నుంచి రాష్ట్రాల్లో మార్పులు చేస్తున్నారు. ఏపీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరుజాను నియమించారు. ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీ ఒక జంబో కమిటీని కూడా వేసింది. వచ్చిందే తడవుగా రుద్రరాజు చాలా మాటలు చెబుతున్నారు….
తన నాయకత్వాన్ని పటిష్టం చేసుకునేందుకు రుద్రరాజు ద్విముఖ వ్యూహం అమలు చేయబోతున్నారట. గ్రామీణ స్థాయిలో తిరుగుతూ ఓటు బ్యాంకును పదిలం చేయబోతున్నానని రుద్రరాజు చెప్పుకుంటున్నారు. చాలా మంది నేతల్లాగే రుద్రరాజు కూడా పాదయాత్రలు చేస్తానని అంటున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేస్తారని ఏపీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత రుద్రరాజు పాదయాత్ర మొదలవుతుందని,చెబుతున్నారు.
అదే టైమ్ లో నారా లోకేష్ పాదయాత్ర, పవన్ కల్యాణ్ బస్సు యాత్ర కూడా ఉంటాయి. వారితో రుద్రరాజు ఎలా పోటీ పడగలరో చూడాలి. కాంగ్రెస్ కు కింది స్థాయిలో నేతలు ఉన్నారని, కేడర్ బలం ఉందని అందుకే పాదయాత్ర సక్సెస్ అవుతుందని రుద్రరాజు అనుచరులు వాదిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే మాత్రం అలాంటి అవకాశాలు లేవని ఇతర పార్టీల నేతలు అంటున్నారు…
రాష్ట్ర విభజన సమయంలో పార్టీని వీడి వెళ్లిపోయిన లీడర్లు, కేడర్లను తిరిగి రప్పించే ఘర్ వాపసీ కార్యక్రమం రుద్రరాజు మదిలో ఉన్న రెండో వ్యూహం. పార్టీకి రాజీనామా చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి నేతలు రాజకీయాల్లో లేకపోయిన మీడియాకు తన అభిప్రాయాలు చెబుతూ క్రియాశీలంగా ఉంటున్నారు. లగడపాటి రాజగోపాల్ కూడా పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు రుద్రరాజు బృందం ఇప్పటికే ఒక జాబితాను రూపొందించింది.
పేరున్న నేతలతోపాటు… క్షేత్రస్థాయిలో పట్టు ఉండి పార్టీకి దూరమైన నేతలను స్వయంగా కలుసుకుని తిరిగి కాంగ్రెస్ లో పనిచేయాలని కోరబోతోంది. వైసీపీ, టీడీపీ పట్ల ఓటర్లు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో కష్టపడితే కాంగ్రెస్ కు అవకాశం ఉంటుందని కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. మరి రుద్రరాజు టీమ్ మాటలు వాళ్లు నమ్ముతారో లేదో చూడాలి..
ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…
నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…
తెలుగులో సినిమాలు చేస్తున్నంత వరకు సగటు గ్లామర్ హీరోయిన్లలో ఒకరి లాగే ఉండేది తాప్సి పన్ను. కానీ తర్వాత బాలీవుడ్కు…
నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…
ముంబై పుణె ఎక్స్ప్రెస్వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…
అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…