తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన జాతీయ పార్టీ బీఆర్ ఎస్ కార్యాలయాన్ని ఆయన ఈ నెల 14వ తేదీన అట్టహాసంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయల్దేరారు.
అయితే, బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి తెలంగాణ నుంచే కాకుండా.. కర్ణాటక, తమిళనాడు, బిహార్, యూపీల నుంచి కూడా పలువురు కీలక నేతలను కేసీఆర్ ఆహ్వానించారు.
అయితే, వారు వచ్చేందుకు, వెళ్లేందుకు ప్రత్యేకంగా ఫ్లైట్లు బుక్ చేసినట్టు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక నుంచి ఒకటి, తెలంగాణ నుంచి 13వ తేదీ మధ్యాహ్నం ఒకటి, తమిళనాడు నుంచి అదే రోజు ఉదయం ఒక ప్రత్యేక విమానం ఢిల్లీ వెళ్లనుందని.. దీనిలో ఎంపిక చేసిన కొందరు జాతీయ నాయకులు, సీపీఐ నేతలు కూడా వెళ్తున్నారని తెలుస్తోంది. వీరికి రాను పోను ఖర్చులతో పాటు.. ఢిల్లీలో ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేసినట్టు ప్రగతి భవన్ వర్గాలు తెలిపాయి.
ఢిల్లీలోని సర్దార్ పటేల్మార్గ్లో పార్టీ కార్యాలయ ప్రారంభం సందర్భంగా కేసీఆర్ అదే రోజు యాగం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ తదితరులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
14వ తేదీ యాగంతో పాటు ప్రారంభోత్సవానికి చెందిన ఏర్పాట్లు, కార్యాలయంలో అవసరమైన ఫర్నీచర్ వంటి వాటిని పరిశీలించారు. ఇక, అదేరోజు లేదా తెల్లవారి కేసీఆర్ జాతీయ మీడియాతో మాట్లాడనున్నట్టు తెలుస్తోంది.
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…