కవితకు కేంద్ర దర్యాప్తు సంస్థల ఉచ్చు బిగుస్తోంది. ఏదో ఒక్క రోజు విచారణతో పని పూర్తయ్యిందనుకున్న బీఆర్ఎస్ నేతలకు అసలు విషయం తెలియడానికి కొంత టైమ్ పట్టింది. కవితకు సీబీఐ మరో నోటీసు పంపింది. తొలుత 160 సీఆర్పీసీ కింద ఏడున్నర గంటలు ఆమె నివాసంలోనే విచారించిన సీబీఐ అధికారులు ఇప్పుడు 91 సీఆర్పీసీ కింద నోటీసులు పంపారు.
నిజానికి ఆమె నివాసంలోనే 160 సీఆర్పీసీ కింద ప్రశ్నించి 161 సీఆర్పీసీ కింద స్టేట్ మెంటి రికార్డు చేసిన సీబీఐ అధికారులు తాజాగా 91 సీఆర్పీసీ కింద నోటీసులు సర్వ్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఆమె వద్ద ఉన్న అన్ని డాక్యుమెంట్లు సమర్పించేందుకు రావాలని అధికారులు సందేశం పంపారు. హాజరు కావాల్సిన తేదీని, ప్రదేశాన్ని సస్పెన్స్ లో ఉంచినప్పటికీ ఆ పని ఢిల్లీలో త్వరలోనే పూర్తవుతుందని చెబుతున్నారు. అంటే ఈ సారి మరిన్ని ప్రశ్నలు సిద్ధమవుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…
బీఆర్ఎస్ నేతల పై సీబీఐ, ఈడీ ముప్పేట దాడికి సిద్ధమవుతున్నాయని కూడా తాజాగా సంకేతాలు అందుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో ఆమె ప్రమేయం ఉన్నట్లు అధికారులు ఇప్పటికే పూర్తి సాక్ష్యాధారాలు సేకరించారు.
బ్యాంకుల లావాదేవీలను తీసుకొచ్చి మరీ ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికే జైల్లో ఉన్న శరద్ చంద్రారెడ్డి, అరోరాతో ఉన్న ఆర్థిక లావాదేవీలను అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నిజానికి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉంది. అయితే అందుకు భిన్నంగా కవితను ఫిక్స్ చేసేందుకు శరద్ చంద్రారెడ్డి వాగ్మూలమే ప్రధానమవుతుందని భావిస్తున్నారు… అమిత్ అరోరా కేవలం పావు మాత్రమేనని, శరద్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్ అసలు కింగ్ పిన్స్ అని సీబీఐ అనుమానిస్తోంది.
వాళ్ల ద్వారానే కోట్లాది రూపాయలు కవిత, సిసోడియాలకు అంది ఉంటాయని అనుమానిస్తున్నారు. ఇప్పుడు నిజం రాబట్టాలంటే మరింత లోతైనా విచారణ అనివార్యమవుతోంది. ఢిల్లీలో కూర్చోబెడితే అన్ని విషయాలు బయట పడతాయని సీబీఐ నమ్మకం.
This post was last modified on December 12, 2022 10:31 am
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…