కవితకు కేంద్ర దర్యాప్తు సంస్థల ఉచ్చు బిగుస్తోంది. ఏదో ఒక్క రోజు విచారణతో పని పూర్తయ్యిందనుకున్న బీఆర్ఎస్ నేతలకు అసలు విషయం తెలియడానికి కొంత టైమ్ పట్టింది. కవితకు సీబీఐ మరో నోటీసు పంపింది. తొలుత 160 సీఆర్పీసీ కింద ఏడున్నర గంటలు ఆమె నివాసంలోనే విచారించిన సీబీఐ అధికారులు ఇప్పుడు 91 సీఆర్పీసీ కింద నోటీసులు పంపారు.
నిజానికి ఆమె నివాసంలోనే 160 సీఆర్పీసీ కింద ప్రశ్నించి 161 సీఆర్పీసీ కింద స్టేట్ మెంటి రికార్డు చేసిన సీబీఐ అధికారులు తాజాగా 91 సీఆర్పీసీ కింద నోటీసులు సర్వ్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఆమె వద్ద ఉన్న అన్ని డాక్యుమెంట్లు సమర్పించేందుకు రావాలని అధికారులు సందేశం పంపారు. హాజరు కావాల్సిన తేదీని, ప్రదేశాన్ని సస్పెన్స్ లో ఉంచినప్పటికీ ఆ పని ఢిల్లీలో త్వరలోనే పూర్తవుతుందని చెబుతున్నారు. అంటే ఈ సారి మరిన్ని ప్రశ్నలు సిద్ధమవుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…
బీఆర్ఎస్ నేతల పై సీబీఐ, ఈడీ ముప్పేట దాడికి సిద్ధమవుతున్నాయని కూడా తాజాగా సంకేతాలు అందుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో ఆమె ప్రమేయం ఉన్నట్లు అధికారులు ఇప్పటికే పూర్తి సాక్ష్యాధారాలు సేకరించారు.
బ్యాంకుల లావాదేవీలను తీసుకొచ్చి మరీ ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికే జైల్లో ఉన్న శరద్ చంద్రారెడ్డి, అరోరాతో ఉన్న ఆర్థిక లావాదేవీలను అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నిజానికి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉంది. అయితే అందుకు భిన్నంగా కవితను ఫిక్స్ చేసేందుకు శరద్ చంద్రారెడ్డి వాగ్మూలమే ప్రధానమవుతుందని భావిస్తున్నారు… అమిత్ అరోరా కేవలం పావు మాత్రమేనని, శరద్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్ అసలు కింగ్ పిన్స్ అని సీబీఐ అనుమానిస్తోంది.
వాళ్ల ద్వారానే కోట్లాది రూపాయలు కవిత, సిసోడియాలకు అంది ఉంటాయని అనుమానిస్తున్నారు. ఇప్పుడు నిజం రాబట్టాలంటే మరింత లోతైనా విచారణ అనివార్యమవుతోంది. ఢిల్లీలో కూర్చోబెడితే అన్ని విషయాలు బయట పడతాయని సీబీఐ నమ్మకం.
This post was last modified on December 12, 2022 10:31 am
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…