కవితకు కేంద్ర దర్యాప్తు సంస్థల ఉచ్చు బిగుస్తోంది. ఏదో ఒక్క రోజు విచారణతో పని పూర్తయ్యిందనుకున్న బీఆర్ఎస్ నేతలకు అసలు విషయం తెలియడానికి కొంత టైమ్ పట్టింది. కవితకు సీబీఐ మరో నోటీసు పంపింది. తొలుత 160 సీఆర్పీసీ కింద ఏడున్నర గంటలు ఆమె నివాసంలోనే విచారించిన సీబీఐ అధికారులు ఇప్పుడు 91 సీఆర్పీసీ కింద నోటీసులు పంపారు.
నిజానికి ఆమె నివాసంలోనే 160 సీఆర్పీసీ కింద ప్రశ్నించి 161 సీఆర్పీసీ కింద స్టేట్ మెంటి రికార్డు చేసిన సీబీఐ అధికారులు తాజాగా 91 సీఆర్పీసీ కింద నోటీసులు సర్వ్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఆమె వద్ద ఉన్న అన్ని డాక్యుమెంట్లు సమర్పించేందుకు రావాలని అధికారులు సందేశం పంపారు. హాజరు కావాల్సిన తేదీని, ప్రదేశాన్ని సస్పెన్స్ లో ఉంచినప్పటికీ ఆ పని ఢిల్లీలో త్వరలోనే పూర్తవుతుందని చెబుతున్నారు. అంటే ఈ సారి మరిన్ని ప్రశ్నలు సిద్ధమవుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…
బీఆర్ఎస్ నేతల పై సీబీఐ, ఈడీ ముప్పేట దాడికి సిద్ధమవుతున్నాయని కూడా తాజాగా సంకేతాలు అందుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో ఆమె ప్రమేయం ఉన్నట్లు అధికారులు ఇప్పటికే పూర్తి సాక్ష్యాధారాలు సేకరించారు.
బ్యాంకుల లావాదేవీలను తీసుకొచ్చి మరీ ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికే జైల్లో ఉన్న శరద్ చంద్రారెడ్డి, అరోరాతో ఉన్న ఆర్థిక లావాదేవీలను అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నిజానికి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉంది. అయితే అందుకు భిన్నంగా కవితను ఫిక్స్ చేసేందుకు శరద్ చంద్రారెడ్డి వాగ్మూలమే ప్రధానమవుతుందని భావిస్తున్నారు… అమిత్ అరోరా కేవలం పావు మాత్రమేనని, శరద్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్ అసలు కింగ్ పిన్స్ అని సీబీఐ అనుమానిస్తోంది.
వాళ్ల ద్వారానే కోట్లాది రూపాయలు కవిత, సిసోడియాలకు అంది ఉంటాయని అనుమానిస్తున్నారు. ఇప్పుడు నిజం రాబట్టాలంటే మరింత లోతైనా విచారణ అనివార్యమవుతోంది. ఢిల్లీలో కూర్చోబెడితే అన్ని విషయాలు బయట పడతాయని సీబీఐ నమ్మకం.
This post was last modified on December 12, 2022 10:31 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…