కవితకు కేంద్ర దర్యాప్తు సంస్థల ఉచ్చు బిగుస్తోంది. ఏదో ఒక్క రోజు విచారణతో పని పూర్తయ్యిందనుకున్న బీఆర్ఎస్ నేతలకు అసలు విషయం తెలియడానికి కొంత టైమ్ పట్టింది. కవితకు సీబీఐ మరో నోటీసు పంపింది. తొలుత 160 సీఆర్పీసీ కింద ఏడున్నర గంటలు ఆమె నివాసంలోనే విచారించిన సీబీఐ అధికారులు ఇప్పుడు 91 సీఆర్పీసీ కింద నోటీసులు పంపారు.
నిజానికి ఆమె నివాసంలోనే 160 సీఆర్పీసీ కింద ప్రశ్నించి 161 సీఆర్పీసీ కింద స్టేట్ మెంటి రికార్డు చేసిన సీబీఐ అధికారులు తాజాగా 91 సీఆర్పీసీ కింద నోటీసులు సర్వ్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఆమె వద్ద ఉన్న అన్ని డాక్యుమెంట్లు సమర్పించేందుకు రావాలని అధికారులు సందేశం పంపారు. హాజరు కావాల్సిన తేదీని, ప్రదేశాన్ని సస్పెన్స్ లో ఉంచినప్పటికీ ఆ పని ఢిల్లీలో త్వరలోనే పూర్తవుతుందని చెబుతున్నారు. అంటే ఈ సారి మరిన్ని ప్రశ్నలు సిద్ధమవుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…
బీఆర్ఎస్ నేతల పై సీబీఐ, ఈడీ ముప్పేట దాడికి సిద్ధమవుతున్నాయని కూడా తాజాగా సంకేతాలు అందుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో ఆమె ప్రమేయం ఉన్నట్లు అధికారులు ఇప్పటికే పూర్తి సాక్ష్యాధారాలు సేకరించారు.
బ్యాంకుల లావాదేవీలను తీసుకొచ్చి మరీ ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికే జైల్లో ఉన్న శరద్ చంద్రారెడ్డి, అరోరాతో ఉన్న ఆర్థిక లావాదేవీలను అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నిజానికి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉంది. అయితే అందుకు భిన్నంగా కవితను ఫిక్స్ చేసేందుకు శరద్ చంద్రారెడ్డి వాగ్మూలమే ప్రధానమవుతుందని భావిస్తున్నారు… అమిత్ అరోరా కేవలం పావు మాత్రమేనని, శరద్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్ అసలు కింగ్ పిన్స్ అని సీబీఐ అనుమానిస్తోంది.
వాళ్ల ద్వారానే కోట్లాది రూపాయలు కవిత, సిసోడియాలకు అంది ఉంటాయని అనుమానిస్తున్నారు. ఇప్పుడు నిజం రాబట్టాలంటే మరింత లోతైనా విచారణ అనివార్యమవుతోంది. ఢిల్లీలో కూర్చోబెడితే అన్ని విషయాలు బయట పడతాయని సీబీఐ నమ్మకం.
This post was last modified on December 12, 2022 10:31 am
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…