Political News

విజయమ్మ ఆ మాట అన్నాకే కేవీపీ బయటపడ్డారా ?

ఒక వ్యక్ తిపై లేదా ఒక ప్రభుత్వం పై అసంతృప్తి రాత్రికి రాత్రే బయటపడదు. అది క్రమంగా బయటపడే మానసిక వ్యవస్థ. అదే విధంగా ఒక నాయకుడి పై కూడా అభిమానం లేదా వ్యతిరేకత ఒకరు చెప్పినప్పుడు బయటకు వచ్చేది కాదు. పరిణామాలు గమనించాలి, నాయకుడు చేస్తున్న తప్పులను అర్థం చేసుకోవాలి. తప్పులు హద్దు మీరుతున్నాయన్న నిర్ణయానికి రావాలి. అప్పుడే విమర్శించాలి, తప్పులను బయట పెట్టాలన్న కోరిక కలుగుతోంది. అది అసంతృప్తిగా, ఆగ్రహంగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో మనకెందుకులే అని కూడా వదిలేస్తుంటారు. జగన్ విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు కూడా అదే పని చేసి ఉండొచ్చని చెబుతున్నారు..

కేవీపీ, వైఎస్ కు అంతరాత్మ అనేవారు. ఇద్దరు కలిసి చదువుకున్నారు.. కాంగ్రెస్ లో కలిసి పనిచేసేవారు. వైఎస్ తో ఏదైనా పనిచేయించుకోవాలంటే కేవీపీతో చెప్పిస్తే సరిపోతుందనేవారు. అలాంటి కేవీపీ .. జగన్ పార్టీ పెడితే ఆయనతో చేరలేదు. ఆ పార్టీ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఎవరైనా రాజకీయ నిరుద్యోగులు తన వద్దకు వచ్చి వైసీపీలో చేరడంపై సలహా అడిగితే …అల్లుడికి మీకు కుదరదులే వద్దనే వారు. అల్లుడి ఆలోచన వేరు, మీ ఆలోచన వేరు అని చెప్పేవారు. జగన్ కూడా ఎప్పుడూ కేవీపీని పిలిచిన దాఖలాలు కనిపించలేదు.

వైఎస్ కుటంబంపై కేవీపీకి అభిమానం ఎక్కువ, వైఎస్ సతీమణి విజయమ్మ అంటే గౌరవం. జగన్ ఒంటెత్తు పోకడ బాగానే తెలుసు. అందుకే వారితో పెట్టుకోకుండా, ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. వైసీపీ వారి అరాచకాలు, అవినీతి, రాజకీయ ప్రత్యర్థులను వాళ్లు అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న తీరును చూసి కేవీపీ కాస్త నొచ్చుకున్న మాట వాస్తవం. అయినా మౌనం వహించారు. అలాంటి కేవీపీ ఇప్పుడు నోరు తెరిచారు. జగన్ ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోశారు.

విభజన హామీల కోసం జగన్ పోరాడటం లేదని కేవీపీ ఆరోపించారు. బంగారు భవిష్యత్తు కలిగిన ఆంధ్రప్రదేశ్ పాలనను చూస్తే ఆవేదన కలుగుతుందన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించడం లేదన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపలేకపోతున్నారన్నారు. పోలవరం దుస్థితి చూస్తే బాధేస్తుందన్నారు. ఇంకా చాలా మాటలే అనేశారు. నిజానికి ఈ సమస్యలు చాలా రోజులుగా ఉన్నవే. అయినా కేవీపీ ఎన్నడూ విమర్శించలేదు.. జగన్ పార్టీలో విజయమ్మ ఉన్నారనే కేవీపీ వెనుకాడినట్లు సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఆమె నొచ్చుకుంటారని కేవీపీ మాట్లాడలేదని చెబుతున్నారు. ఇప్పుడు వైసీపీ పదవికి విజయమ్మ రాజీనామా చేశారు. హైదరాబాద్ లో ఉంటూ ఆ రాష్ట్రంతో మాకేమీ పని అని ఏపీని ఉద్దేశించి పెద్ద కామెంటే చేశారు. తనయుడు జగన్ తో విజయమ్మ తెగదెంపులు చేసుకున్నారని, కూతురు షర్మిల రాజకీయ జీవితం కోసమే ఫుల్ టైమ్ పనిచేయబోతున్నారని కేవీపీకి అర్థమైంది. ఇక పై జగన్ ను విమర్శిస్తే విజయమ్మ ఫీలయ్యేదేమీ లేదని నిర్థారణకు వచ్చిన తర్వాతే కేవీపీ వాగ్బాణాలు మొదలు పెట్టారనుకోవాలి.

ఏపీ దౌర్భార్యానికి కారణమైన అన్ని అంశాలను ఆయన ప్రస్తావించారు. ముందు ముందు కేవీపీ చాలా విషయాలు చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. మొదటి నుంచి జగన్ తీరు ఎలా ఉండేదో కూడా ఆయన వివరిస్తారనుకోవాలి. ఫ్యామిలీ ఫ్రెండ్ కదా మరి…

This post was last modified on December 12, 2022 10:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

44 minutes ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

1 hour ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

4 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

5 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

6 hours ago

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

8 hours ago