జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. 2024 ఎన్నికలకు సంబంధించి ప్రజల్లోకి వెళ్లి పార్టీ తరఫున ప్రచారం చేసుకునేందుకు భారీ వాహనం రెడీ చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి వారాహి(అమ్మవారి పేరు) అనేపేరును కూడా ఆయన పెట్టుకున్నారు. దీనికి సంబంధించి గత వారం విడుదల చేసిన ట్విట్టర్ వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపింది. ఇద్దరు సర్దార్జీలు కుడి ఎడమలు నడిచి రాగా.. మధ్య ఠీవీగా వారాహి వాహనం దూసుకువస్తున్న వీడియో.. పార్టీ అభిమానులను, కార్యకర్తలను మంత్రుముగ్ధుల ను చేసింది.
అయితే, దీనిపై రాజకీయ దుమారం కూడా అంతే రేంజ్లో రేగింది. వైసీపీ మాజీ మంత్రి, సీనియర్ నేత పేర్ని నాని వారాహిపై విమర్శలు గుప్పించారు. ఆలివ్ కలర్లో వాహనాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని..కేవలం సైనికులకు మాత్రమే పరిమితమైన రంగునుఎలా వేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది రిజిస్ట్రేషన్ చట్టానికి వ్యతిరేకమని కూడా చెప్పారు. పవన్ లక్ష పుస్తకాలు చదివాడుకదా.. మరో పుస్తకం.. వెహికల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ను కూడాచదువుకోవాలంటూ చురకలు అంటించారు.
ఇక, షెడ్యూల్ ప్రకారం ఈ వాహనానికి హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తి చేసి.. అక్కడే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి ఏపీలోకి తీసుకురావాలని.. దీనికి అట్టహాసంగా సంబరాలు కూడా చేయాలని నిర్ణయించారు. అయితే, ఇది పేర్ని నాని చెప్పినట్టుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలోనే ఇబ్బందులు ఎదుర్కొంది. లారీ ఛాసిస్ను బస్సుగా మార్చడంపై అభ్యంతరాలు తెలిపినట్టు సమాచారం. ఇది చూసేందుకు కూడా అలానే ఉండడం గమనార్హం.
అదేవిధంగా ప్రచార వాహనం బస్సు అని చెప్పినప్పుడు బస్సుకు ఉండాల్సిన హైట్ ఉండాలని, కానీ, ఇది అంతకుమించిన హైట్(ఎత్తు) ఉందని అభ్యంతరం తెలిపినట్టు తెలిసింది. ఇక, వారాహి వాహనానికి వినియోగించిన చక్రాలు కూడా..గనుల్లో వాడే టిప్పర్లకు ఉండే టైర్లను వినియోగించడంపైనా అధికారులు అభ్యంతరం తెలిపారని సమాచారం. ఇలాంటి టైర్లు వినియోగించడం.. సాధారణ రోడ్లపై సాధ్యం కాదు.
ఇక, ఆర్మీకి సంబందించిన వాహనాలకు వినియోగించే ఆలివ్ గ్రీన్ కలర్ ను సివిల్ వాహనానికి ఉపయోగిస్తారనేది కూడా ప్రధాన అభ్యంతరంగా కనిపించింది. ఇవన్నీ మార్చుకుని వస్తేనే రిజిస్ట్రేషన్ చేయగలమని చెప్పడంతో వారాహి రిజిస్ట్రేషన్ వాయిదా పడిందని తెలిసింది. మొత్తానికి ఈ పరిణామాన్ని ముందే ఊహించారో.. లేదో.. కానీ, ఇప్పుడు మాత్రం మార్పులు తప్పవు. దీనివెనుక ఏ రాజకీయకుట్ర కూడా లేదు. కేవలం నిబంధనలు, చట్టం మాత్రమే ఉండడం విశేషం.
This post was last modified on December 11, 2022 9:56 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…