చేసిన పాపం చెప్తే పోతుంది
చేసిన మంచి చెప్పకుంటే ఫలిస్తుంది
గుర్తుందా… సరిగ్గా 10 రోజుల క్రితం బస్సు కోసం వెళ్తున్న ఒక అంధుడి కోసం ఒక మహిళ పరుగెత్తి బస్సును ఆపి అంధుడిని ఎక్కించి పంపిన వీడియో గుర్తుందా? దేశమంతా ఆ వీడియో వైరల్ అయ్యింది. నిస్వార్థంగా ఆమె చేసిన మంచి పనికి ఇల్లు గిఫ్టుగా వచ్చింది. అద్భుతం కదా.
ఆ చిరుద్యోగి పేరు. సుప్రియ. కేరళలోని తిరుపత్తూర్ జిల్లా పరిధిలోని తిరువల్లూరు ఆమె స్వంతూరు. అదే ఊర్లో జోయ్ ఆలుక్కాస్ లో పనిచేస్తున్నారు. చిరుద్యోగి. విధులకు వెళ్లే సమయంలో ఒక అంధుడు బస్సు కోసం ప్రయత్నించడం గమనించారు సుప్రియ. బస్సు అతడిని పట్టించుకోకుండా వెళ్లిపోవడం చూసి పరుగెత్తి బస్సును ఆపారు. అనంతరం ఆ అంధుడిని తీసుకొచ్చి ఎక్కించింది. తర్వాత తన దారిన తాను పోయింది.
బస్సు ఆపిన చోటులో పక్కనే ఉన్న ఓ భవనం పై నుంచి ఎవరో ఈ సంఘటనను వీడియో తీశారు. ఇది ఐపీఎస్ విజయ్ కుమార్ కు చేరింది. ఆయన ఆ వీడియోను పోస్టు చేస్తూ దయ కంటే మంచి ఏముంటుంది అంటూ కామెంట్ చేశారు. అది బాగా వైరల్ అయ్యి జోయ్ అలుక్కాస్ కంపెనీ యజమాని దృష్టికి వెళ్లింది.
దీంతో కంపెనీ యజమాని ఆమె మనసును గుర్తించి ఇంటికెళ్లి అభినందించారు. అదే ఆమె ఆనందానికి అవధుల్లేవు అన్నట్టు సంతోషపెట్టింది. ఓ చిన్న ఇరుకైన అద్దె ఇంట్లో ఉంటున్న విషయం తెలుసుకున్న యజమాని మరుసటి రోజు ఆమెను త్రిస్సూర్ కి రమ్మని పిలిచారు. అక్కడికెళ్లాక ఏకంగా ఒక ఇల్లు గిఫ్టుగా ఇచ్చాడు. ఆమె సంతోషం పట్టలేక కన్నీరు పెట్టుకుంది. ఈ సంఘటన మనకు ఓ స్ఫూర్తి. మనం చేసే సాయం ఫొటోలు వీడియోలు తీసి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు గమనిస్తాడు. భగవద్గీతలో చెప్పినట్లు మనం కర్మ చేయాలి. ఫలితం భగవంతుడికి వదిలేయాలి. అది ఇంత అందంగా, అద్భుతంగా ఉంటుంది.
This post was last modified on July 16, 2020 9:05 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…