చేసిన పాపం చెప్తే పోతుంది
చేసిన మంచి చెప్పకుంటే ఫలిస్తుంది
గుర్తుందా… సరిగ్గా 10 రోజుల క్రితం బస్సు కోసం వెళ్తున్న ఒక అంధుడి కోసం ఒక మహిళ పరుగెత్తి బస్సును ఆపి అంధుడిని ఎక్కించి పంపిన వీడియో గుర్తుందా? దేశమంతా ఆ వీడియో వైరల్ అయ్యింది. నిస్వార్థంగా ఆమె చేసిన మంచి పనికి ఇల్లు గిఫ్టుగా వచ్చింది. అద్భుతం కదా.
ఆ చిరుద్యోగి పేరు. సుప్రియ. కేరళలోని తిరుపత్తూర్ జిల్లా పరిధిలోని తిరువల్లూరు ఆమె స్వంతూరు. అదే ఊర్లో జోయ్ ఆలుక్కాస్ లో పనిచేస్తున్నారు. చిరుద్యోగి. విధులకు వెళ్లే సమయంలో ఒక అంధుడు బస్సు కోసం ప్రయత్నించడం గమనించారు సుప్రియ. బస్సు అతడిని పట్టించుకోకుండా వెళ్లిపోవడం చూసి పరుగెత్తి బస్సును ఆపారు. అనంతరం ఆ అంధుడిని తీసుకొచ్చి ఎక్కించింది. తర్వాత తన దారిన తాను పోయింది.
బస్సు ఆపిన చోటులో పక్కనే ఉన్న ఓ భవనం పై నుంచి ఎవరో ఈ సంఘటనను వీడియో తీశారు. ఇది ఐపీఎస్ విజయ్ కుమార్ కు చేరింది. ఆయన ఆ వీడియోను పోస్టు చేస్తూ దయ కంటే మంచి ఏముంటుంది అంటూ కామెంట్ చేశారు. అది బాగా వైరల్ అయ్యి జోయ్ అలుక్కాస్ కంపెనీ యజమాని దృష్టికి వెళ్లింది.
దీంతో కంపెనీ యజమాని ఆమె మనసును గుర్తించి ఇంటికెళ్లి అభినందించారు. అదే ఆమె ఆనందానికి అవధుల్లేవు అన్నట్టు సంతోషపెట్టింది. ఓ చిన్న ఇరుకైన అద్దె ఇంట్లో ఉంటున్న విషయం తెలుసుకున్న యజమాని మరుసటి రోజు ఆమెను త్రిస్సూర్ కి రమ్మని పిలిచారు. అక్కడికెళ్లాక ఏకంగా ఒక ఇల్లు గిఫ్టుగా ఇచ్చాడు. ఆమె సంతోషం పట్టలేక కన్నీరు పెట్టుకుంది. ఈ సంఘటన మనకు ఓ స్ఫూర్తి. మనం చేసే సాయం ఫొటోలు వీడియోలు తీసి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు గమనిస్తాడు. భగవద్గీతలో చెప్పినట్లు మనం కర్మ చేయాలి. ఫలితం భగవంతుడికి వదిలేయాలి. అది ఇంత అందంగా, అద్భుతంగా ఉంటుంది.
This post was last modified on July 16, 2020 9:05 pm
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…
సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…