Political News

ప‌వ‌న్ బిగ్ టార్గెట్లో ఉన్న 20 నియోజ‌క‌వ‌ర్గాలు ఇవే…!


జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యూహాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనే అధికారంలో వ‌చ్చేస్తామ‌ని ఆయ‌న చెబుతున్నా.. అది సాధ్య‌మ‌య్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. సో.. ఇప్ప‌టికిప్పుడు అధికారం కోసం పోటీప‌డ‌డ‌కన్నా.. 2029 ఎన్నిక‌ల‌ను టార్గెట్ చేసుకుని.. ఇప్ప‌టి నుంచి పునాదులు బ‌లంగా వేసుకుంటే బెట‌ర్ అని ప‌వ‌న్ యోచిస్తున్న‌ట్టు స‌మాచారం. అందుకే ప‌వ‌న్ ఇటీవల కాలంలో త‌న మాట, వ్యూహం రెండూ మార్చుకున్నారు. 2023 కాక‌పోతే.. 2029 ఉంది.. సుదీర్ఘ‌కాలం పోరాటం చేయ‌డానికిసిద్ధ‌ప‌డ్డాను అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఇది తొలుత చాలా మందికి అర్ధం కాలేదు.కానీ, త‌ర్వాత‌.. ప‌వ‌న్ వ్యూహం తెలిసి ఔరా! అని అంటున్నారు. ఇప్ప‌టికిప్పుడు అధికారంలోకి వ‌చ్చే ఆలోచ‌న లేదనేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అయితే, దీనిలో భాగంగా ముందు పునాదులు బ‌లంగా వేసుకునే ప్ర‌క్రియ‌కు ప‌వ‌న్ శ్రీకారం చుట్టార‌ని స‌మాచారం. క‌నీసం 20 మంది త‌న వెంట ఎమ్మెల్యేల సైన్యం ఉంటే.. వారిని చూపించి.. వారి ద్వారా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో పాగా వేయాల‌నేది.. స్వ‌చ్ఛ‌మైన పాల‌న అందించేందుకు ఈ 20 మందిని ప్రాతిప‌దిక‌గా చేసుకుని ముందుకు సాగేందుకు ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా ముందుకుసాగాల‌నేది ప్ర‌ధాన ఉద్దేశం.

ఈ క్ర‌మంలోనే నాలుగు జిల్లాల్లో 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసేలా ప‌వ‌న్ అడుగులు ప‌డుతున్నాయ‌ని అంటున్నారు. వీటిలో విజ‌య‌న‌గ‌రం, ఉభ‌య గోదావ‌రి జిల్లాలు, అనంత‌పురం, క‌ర్నూలు ప్ర‌ధానంగా క‌నిపిస్తున్నాయి. ఒక్కొక్క జిల్లాలో ఐదేసి చొప్పున విజ‌యం ద‌క్కించుకునే వ్యూహం క‌నిపిస్తోంది. ఒక‌వేళ ఎక్క‌డైనా ఒక‌టి రెండు త‌గ్గినా.. మిగిలిన జిల్లాల్లో వాటిని క‌వ‌ర్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే..ప్ర‌స్తుతానికి జ‌న‌సేన వ్యూహం అయితే ఇదేన‌ని చెబుతున్నారు.

This post was last modified on December 11, 2022 12:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో వైసీపీ వాయిస్ క‌ట్‌…?

కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ కొంత మేర‌కు హ‌వా చెలాయిస్తున్న విష‌యం తెలిసిందే. అధికారంలో ఉన్న‌ప్పుడు ఇప్పుడు…

41 minutes ago

అదే చెక్క‌కుర్చీ… అదే టేబుల్‌… ఐదోసారి సీఎం!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఒక్క‌సారి ముఖ్య‌మంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…

3 hours ago

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

4 hours ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

5 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

7 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

7 hours ago