జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లోనే అధికారంలో వచ్చేస్తామని ఆయన చెబుతున్నా.. అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సో.. ఇప్పటికిప్పుడు అధికారం కోసం పోటీపడడకన్నా.. 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకుని.. ఇప్పటి నుంచి పునాదులు బలంగా వేసుకుంటే బెటర్ అని పవన్ యోచిస్తున్నట్టు సమాచారం. అందుకే పవన్ ఇటీవల కాలంలో తన మాట, వ్యూహం రెండూ మార్చుకున్నారు. 2023 కాకపోతే.. 2029 ఉంది.. సుదీర్ఘకాలం పోరాటం చేయడానికిసిద్ధపడ్డాను అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇది తొలుత చాలా మందికి అర్ధం కాలేదు.కానీ, తర్వాత.. పవన్ వ్యూహం తెలిసి ఔరా! అని అంటున్నారు. ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చే ఆలోచన లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, దీనిలో భాగంగా ముందు పునాదులు బలంగా వేసుకునే ప్రక్రియకు పవన్ శ్రీకారం చుట్టారని సమాచారం. కనీసం 20 మంది తన వెంట ఎమ్మెల్యేల సైన్యం ఉంటే.. వారిని చూపించి.. వారి ద్వారా ప్రజల మనసుల్లో పాగా వేయాలనేది.. స్వచ్ఛమైన పాలన అందించేందుకు ఈ 20 మందిని ప్రాతిపదికగా చేసుకుని ముందుకు సాగేందుకు పవన్ వ్యూహాత్మకంగా ముందుకుసాగాలనేది ప్రధాన ఉద్దేశం.
ఈ క్రమంలోనే నాలుగు జిల్లాల్లో 20 నియోజకవర్గాల్లో పాగా వేసేలా పవన్ అడుగులు పడుతున్నాయని అంటున్నారు. వీటిలో విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు, అనంతపురం, కర్నూలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క జిల్లాలో ఐదేసి చొప్పున విజయం దక్కించుకునే వ్యూహం కనిపిస్తోంది. ఒకవేళ ఎక్కడైనా ఒకటి రెండు తగ్గినా.. మిగిలిన జిల్లాల్లో వాటిని కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే..ప్రస్తుతానికి జనసేన వ్యూహం అయితే ఇదేనని చెబుతున్నారు.
This post was last modified on December 11, 2022 12:39 pm
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…