Political News

ప‌వ‌న్ బిగ్ టార్గెట్లో ఉన్న 20 నియోజ‌క‌వ‌ర్గాలు ఇవే…!


జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యూహాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనే అధికారంలో వ‌చ్చేస్తామ‌ని ఆయ‌న చెబుతున్నా.. అది సాధ్య‌మ‌య్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. సో.. ఇప్ప‌టికిప్పుడు అధికారం కోసం పోటీప‌డ‌డ‌కన్నా.. 2029 ఎన్నిక‌ల‌ను టార్గెట్ చేసుకుని.. ఇప్ప‌టి నుంచి పునాదులు బ‌లంగా వేసుకుంటే బెట‌ర్ అని ప‌వ‌న్ యోచిస్తున్న‌ట్టు స‌మాచారం. అందుకే ప‌వ‌న్ ఇటీవల కాలంలో త‌న మాట, వ్యూహం రెండూ మార్చుకున్నారు. 2023 కాక‌పోతే.. 2029 ఉంది.. సుదీర్ఘ‌కాలం పోరాటం చేయ‌డానికిసిద్ధ‌ప‌డ్డాను అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఇది తొలుత చాలా మందికి అర్ధం కాలేదు.కానీ, త‌ర్వాత‌.. ప‌వ‌న్ వ్యూహం తెలిసి ఔరా! అని అంటున్నారు. ఇప్ప‌టికిప్పుడు అధికారంలోకి వ‌చ్చే ఆలోచ‌న లేదనేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అయితే, దీనిలో భాగంగా ముందు పునాదులు బ‌లంగా వేసుకునే ప్ర‌క్రియ‌కు ప‌వ‌న్ శ్రీకారం చుట్టార‌ని స‌మాచారం. క‌నీసం 20 మంది త‌న వెంట ఎమ్మెల్యేల సైన్యం ఉంటే.. వారిని చూపించి.. వారి ద్వారా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో పాగా వేయాల‌నేది.. స్వ‌చ్ఛ‌మైన పాల‌న అందించేందుకు ఈ 20 మందిని ప్రాతిప‌దిక‌గా చేసుకుని ముందుకు సాగేందుకు ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా ముందుకుసాగాల‌నేది ప్ర‌ధాన ఉద్దేశం.

ఈ క్ర‌మంలోనే నాలుగు జిల్లాల్లో 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసేలా ప‌వ‌న్ అడుగులు ప‌డుతున్నాయ‌ని అంటున్నారు. వీటిలో విజ‌య‌న‌గ‌రం, ఉభ‌య గోదావ‌రి జిల్లాలు, అనంత‌పురం, క‌ర్నూలు ప్ర‌ధానంగా క‌నిపిస్తున్నాయి. ఒక్కొక్క జిల్లాలో ఐదేసి చొప్పున విజ‌యం ద‌క్కించుకునే వ్యూహం క‌నిపిస్తోంది. ఒక‌వేళ ఎక్క‌డైనా ఒక‌టి రెండు త‌గ్గినా.. మిగిలిన జిల్లాల్లో వాటిని క‌వ‌ర్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే..ప్ర‌స్తుతానికి జ‌న‌సేన వ్యూహం అయితే ఇదేన‌ని చెబుతున్నారు.

This post was last modified on December 11, 2022 12:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

1 hour ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

2 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

9 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago