ఔను.. రాజకీయాల్లో ప్రత్యర్థులను చూసుకుని, వారి వేస్తున్నవ్యూహాలను చూసుకుని కుళ్లుకుంటే ఏమొస్తుం ది? గుజరాత్లో ఇదే జరిగింది. బీజేపీ వేస్తున్న ఎత్తుగడలు చూసుకుని.. కాంగ్రెస్ పార్టీ కుళ్లుకుంది. ఓటు వేసి.. ప్రధాని మౌనంగా రాకుండా.. ర్యాలీగా వచ్చారని, ఓటర్లను ప్రభావితం చేశారని.. ఇది తప్పుకాదా! అని మీడియాకు స్టేట్మెంట్లు ఇచ్చింది. పత్రికల్లోనూ ఘనంగానే ఈ వార్త వచ్చింది.
కానీ, ఏం జరిగింది. బీజేపీ గెలిచింది. మోడీ అలా చేసినప్పుడు.. కాంగ్రెస్ నాయకులు కూడా అలానే చేస్తే సరిపోయేదికదా? టిట్ ఫర్ టాట్ అన్నట్టు.. తమ నేతలను కూడా రంగంలోకి దింపి.. ఓటేసిన తర్వాత.. ముందు కూడా ర్యాలీగా వెళ్లి హంగామా చేయిస్తే.. అంతో ఇంతోబాగానే ఓట్లు పడేవికదా! లేక ఏదైనా ఘర్షణ జరిగితే.. అప్పుడు ఎలానూ మోడీ ఇలా చేశాడు కాబట్టి.. మేం చేశామని చెప్పుకొనేందుకు ఛాన్స్ ఉండేది.
కానీ, మోడీని చూసి కుళ్లుకుని.. ఒళ్లు హూనం చేసుకుంది. ఇక, ఏపీలోనూ వైసీపీ అధినేత జగన్ వలంటీర్లను పక్కన పెట్టి గృహ సారథులను ప్రవేశ పెడుతున్నారు. వీరు పూర్తిగా పార్టీకి పనిచేస్తారు. దాదాపు ఐదున్నర లక్షల మందిని రంగంలోకి దింపుతున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లేలా బ్లూప్రింట్ రెడీ చేసుకున్నారు. ప్రతి ఓటునూ ఒడిసి పడుతున్నారు. మంచిదే.. దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఆయనకు ఉన్న స్వేచ్ఛను వాడుకుంటున్నారు.
దీనిని చూసి టీడీపీ కానీ, వామపక్షాలు కానీ, కాంగ్రెస్ కానీ, కుళ్లు కోవాల్సిన అవసరం లేదు. జగన్ ఏదో తప్పు చేస్తున్నాడని చెప్పి.. చేతులు దులుపుకొని పత్రికల్లో వచ్చే వార్తలు చదువుకుని బాధపడాల్సిన అవసరం లేదు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. సో.. ఆయా పార్టీలు కూడా వలంటీర్లను పెట్టి.. ప్రజల వద్దకు పంపిస్తే.. కాదనేవారు ఎవరుంటారు? వ్యూహానికి ప్రతి వ్యూహం వేస్తే.. అడ్డుకునేవారు ఎవరు ఉంటారు. అడ్డుకుంటే.. ఎలానూ న్యాయస్థానాలు ఉన్నాయి. సో.. ఇప్పుడు కావాల్సింది… జగన్ను చూసి కుళ్లు కోవడం కాదు.. అతనికి మించిన ఎత్తు వేసి.. పై ఎత్తులతో అధికారం దక్కించుకోవడమే!
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…