Political News

డ్యాం షూర్‌: ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు..!

ఏపీలో అధికార పార్టీ వైసీపీ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తోంద‌నే వార్త‌లు త‌రుచుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, దీనికి సంబంధించి ఎవ‌రూ పెద్ద‌గా స్పందించ‌డం లేదు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాత్రం ముంద‌స్తే కాదు.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు పెట్టినా తామురెడీగానే ఉన్నామ‌ని చెబుతున్నారు. కానీ, వైసీపీ నేత‌లు మాత్రం ముంద‌స్తు ఉండ‌ద‌ని.. 18 నెల్ల‌లో వ‌చ్చే సార్వ‌త్రిక స‌మ‌ర‌మే ఉంటుంద‌ని చెబుతున్న విష‌యం తెలిసిందే.

అయితే, తాజాగా బీజేపీ కీల‌క‌నాయ‌కుడు స‌త్య‌కుమార్ మాత్రం ఏపీలో ముంద‌స్తుపై కీల‌క స‌మాచారం వెల్ల‌డించారు. ఖ‌చ్చితంగా ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని ఆయ‌న చెప్పారు. అంతేకాదు.. తారీకులు , ద‌స్తావేజులు అంటూ.. కొన్ని నెల‌లు కూడా ఆయ‌న చెప్పుకొని రావ‌డం సంచ‌ల‌నంగా మారింది.

వైసీపీ పూర్తి కాలం అధికారంలో ఉంటే ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరుగుతుందని తెలిసే.. ముందస్తు వ్యూహానికి సీఎం జగన్ పావులు కదుపుతున్నారని సత్యకుమార్ అన్నారు. వచ్చే ఏప్రిల్, మే నెలల్లోనే వైసీపీ ముందస్తు ఎన్నికలు వెళ్లేందుకు సన్నద్ధమవుతోంద‌ని, దీనికి సంబంధించిన ప‌క్కా స‌మాచారం త‌న ద‌గ్గ‌ర ఉంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

ఎన్నికలంటే యుద్ధమని అభివర్ణించిన జగన్.. ముందుస్తు ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. రానున్న ఉపాధ్యాయ‌, ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని కోట్ల రూపాయ‌లైనా వెద‌జ‌ల్లి గెలిచేప్లాన్ చేస్తున్న‌ట్టు త‌న‌కు స‌మాచారం ఉంద‌న్నారు. ఇది జ‌రిగిన మ‌రుక్ష‌ణం.. అంటే.. ఏప్రిల్ నుంచి మే మ‌ధ్య‌లో ఎప్పుడైనా ముందస్తుకువెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని స‌త్య‌కుమార్ చెప్పారు.

This post was last modified on December 10, 2022 8:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హడావిడి చేసిన ‘డెవిల్’ ఎలా ఉన్నాడు

జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…

1 hour ago

`పిన్నెల్లి జైలు`తో ప‌ల్నాడు వైసీపీ విల‌విల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు భారీ దెబ్బ త‌గిలింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ల్నాడు రాజ‌కీయాల్లో ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చ‌క్రం తిప్పిన పిన్నెల్లి…

1 hour ago

ఇండిగో… కోపాలు తగ్గించేందుకు ఆఫర్లు

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…

2 hours ago

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…

2 hours ago

పంచాయతీ ఎన్నికల్లో పైచేయి ఎవరిది?

తెలంగాణ పంచాయ‌తీ ఎన్నిక‌ల తొలిద‌శ పోలింగ్ ముగిసింది. గురువారం ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల…

3 hours ago

అఖండ తాండవానికి మరో ఎదురుదెబ్బ

న‌ట‌సింహం బాల‌య్య హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన అఖండ్‌-2 సినిమాల‌కు బాలారిష్టాలు తీర‌డం లేదు. ఈ నెల తొలి…

3 hours ago