ఏపీలో అధికార పార్టీ వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్తోందనే వార్తలు తరుచుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, దీనికి సంబంధించి ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ముందస్తే కాదు.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా తామురెడీగానే ఉన్నామని చెబుతున్నారు. కానీ, వైసీపీ నేతలు మాత్రం ముందస్తు ఉండదని.. 18 నెల్లలో వచ్చే సార్వత్రిక సమరమే ఉంటుందని చెబుతున్న విషయం తెలిసిందే.
అయితే, తాజాగా బీజేపీ కీలకనాయకుడు సత్యకుమార్ మాత్రం ఏపీలో ముందస్తుపై కీలక సమాచారం వెల్లడించారు. ఖచ్చితంగా ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ఆయన చెప్పారు. అంతేకాదు.. తారీకులు , దస్తావేజులు అంటూ.. కొన్ని నెలలు కూడా ఆయన చెప్పుకొని రావడం సంచలనంగా మారింది.
వైసీపీ పూర్తి కాలం అధికారంలో ఉంటే ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరుగుతుందని తెలిసే.. ముందస్తు వ్యూహానికి సీఎం జగన్ పావులు కదుపుతున్నారని సత్యకుమార్ అన్నారు. వచ్చే ఏప్రిల్, మే నెలల్లోనే వైసీపీ ముందస్తు ఎన్నికలు వెళ్లేందుకు సన్నద్ధమవుతోందని, దీనికి సంబంధించిన పక్కా సమాచారం తన దగ్గర ఉందని ఆయన వెల్లడించారు.
ఎన్నికలంటే యుద్ధమని అభివర్ణించిన జగన్.. ముందుస్తు ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రానున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని కోట్ల రూపాయలైనా వెదజల్లి గెలిచేప్లాన్ చేస్తున్నట్టు తనకు సమాచారం ఉందన్నారు. ఇది జరిగిన మరుక్షణం.. అంటే.. ఏప్రిల్ నుంచి మే మధ్యలో ఎప్పుడైనా ముందస్తుకువెళ్లడం ఖాయంగా కనిపిస్తోందని సత్యకుమార్ చెప్పారు.
This post was last modified on December 10, 2022 8:57 am
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…