ఏపీ సీఎం జగన్ వచ్చే ఎన్నికలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ వేశారు. ఆయన తరచుగా చెబుతున్నట్టు.. గెలిచితీరాలనే సంకల్పాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా.. ఎవరికీ ఇబ్బంది లేని రీతిలో వ్యూహాత్మక రాజకీయానికి తెరదీశారు. అదే.. గృహ సారథులు కాన్సెప్ట్. దీనిని సీఎం జగన్ తాజాగా తన పార్టీ సమన్వయ కర్తలు, పరిశీలకులకు చెప్పారు.
గృహ సారథులు అంటే.. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు వలంటీర్లను నియమిస్తారు. వీరిలో ఒకరు ఖచ్చితంగా మహిళ ఉండాలి. వీరిద్దరూ కూడా.. ఆ 50 ఇళ్ల పరిధిలో కుటుంబాలను తరచుగా కలుస్తుండాలి. ప్రబుత్వ పథకాలు వస్తున్నాయా? రావట్లేదా తెలుసుకోవాలి. వస్తుంటే.. నెలనెల లేదా.. ఏడాది గ్రాస్గా ఎంత మొత్తంగా వారు ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారు.
అనే విషయాన్ని వారికి వివరించి.. వైసీపీకి ఓటేయించేలా చేయాలి. ఒకవేళ పథకాలు రాకపోతుంటే.. వారి అర్హతను బట్టి ఏదో ఒక పథకం వారికి ఇప్పించే లా సిఫారసు చేయాలి. మొత్తంగా.. ఈ 50 ఇళ్లలోని పురుషులు, మహిళలను ఈ గృహసారథులు.. వైసీపీవైపు మళ్లించగలగాలి. అయితే.. ఇప్పటికే వలంటీర్లు ఉన్నారనే సందేహం వస్తుంది.
వలంటీర్లు ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ.. ప్రభుత్వంతో ముడి పడిఉన్నారు. సో.. వారితో రేపు ఎన్నికల సమయంలో చిక్కులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల .. వారిని ఎలక్టోరల్ విధులకే దూరం పెట్టింది. సో రేపు.. కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా నిలువరిస్తుంది. అందుకే.. గృహసారథులు కాన్సెప్ట్ను తెరమీదికి తెచ్చారు.
వీరికి ఏమిస్తారంటే..
గృహసారథులుగా నియమితులయ్యేవారు చురుగ్గా ఉండాలి. 18-35 ఏళ్లలోపు వారై ఉండాలి. యాక్టివ్గా పార్టీ కోసం పనిచేయాలనే సంకల్పం ఉన్నవారు అయి ఉండాలి. వీరికి ఎలాంటి జీతం ఉండదు. కేవలం 5 లక్షలకు కుటుంబ బీమా చేయిస్తారు. పార్టీ కీలక సమావేశాలకు ప్రతినిధులుగా పిలుస్తారు.
This post was last modified on December 9, 2022 9:45 pm
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…