తెలంగాణ సీఎం కేసీఆర్..రాష్ట్ర రాజధాని హైదరాబాద్ గొప్పదనాన్ని వేనోళ్ల చాటారు. తాజాగా ఆయన మైండ్స్పేస్ వద్ద ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం అనంతరం.. పోలీస్ అకాడమీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
హైదరాబాద్ను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ఎయిర్ పోర్టు వరకు మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషకరమని, కాలుష్య రహితంగా మార్చడానికి మెట్రో చాలా అవరసమని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
దేశ రాజధాని ఢిల్లీ కంటే హైదరాబాద్ పెద్దదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే, మరింతగా అద్భుతమైన నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని తెలిపారు. చరిత్రలో సుప్రసిద్ధ నగరం ఇదేనని చెప్పారు. అంతేకాదు.. 1912లోనే భాగ్యనగరానికి విద్యుత్ వెలుగులు వచ్చాయని తెలిపారు.
హైదరాబాద్ను పవర్ ఐ ల్యాండ్గా మార్చేందుకుతీవ్రంగా శ్రమిస్తున్నట్టు సీఎం తెలిపారు. న్యూయార్క్, లండన్, పారిస్లో కరెంట్ పోవచ్చు కానీ హైదరాబాద్లో మాత్రం కరెంట్ పోదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోందని నొక్కి చెప్పారు. అదేసమయంలో… కాలుష్య రహితంగా మార్చడానికి మెట్రో చాలా అవసరమని అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీ కంటే హైదరాబాద్ పెద్దది. అద్భుతమైన నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. కాలుష్య రహితంగా మార్చడానికి మెట్రో చాలా అవసరం. ఎయిర్పోర్టు వరకు మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషకరం అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…