తెలంగాణ సీఎం కేసీఆర్..రాష్ట్ర రాజధాని హైదరాబాద్ గొప్పదనాన్ని వేనోళ్ల చాటారు. తాజాగా ఆయన మైండ్స్పేస్ వద్ద ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం అనంతరం.. పోలీస్ అకాడమీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
హైదరాబాద్ను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ఎయిర్ పోర్టు వరకు మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషకరమని, కాలుష్య రహితంగా మార్చడానికి మెట్రో చాలా అవరసమని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
దేశ రాజధాని ఢిల్లీ కంటే హైదరాబాద్ పెద్దదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే, మరింతగా అద్భుతమైన నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని తెలిపారు. చరిత్రలో సుప్రసిద్ధ నగరం ఇదేనని చెప్పారు. అంతేకాదు.. 1912లోనే భాగ్యనగరానికి విద్యుత్ వెలుగులు వచ్చాయని తెలిపారు.
హైదరాబాద్ను పవర్ ఐ ల్యాండ్గా మార్చేందుకుతీవ్రంగా శ్రమిస్తున్నట్టు సీఎం తెలిపారు. న్యూయార్క్, లండన్, పారిస్లో కరెంట్ పోవచ్చు కానీ హైదరాబాద్లో మాత్రం కరెంట్ పోదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోందని నొక్కి చెప్పారు. అదేసమయంలో… కాలుష్య రహితంగా మార్చడానికి మెట్రో చాలా అవసరమని అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీ కంటే హైదరాబాద్ పెద్దది. అద్భుతమైన నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. కాలుష్య రహితంగా మార్చడానికి మెట్రో చాలా అవసరం. ఎయిర్పోర్టు వరకు మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషకరం అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
This post was last modified on December 9, 2022 8:48 pm
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…