ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశం ఉంది. తమకు తోచిన విధంగా ప్రజలలో ప్రచారం చేసుకునేందుకు కూడా అవకాశం ఉంది. కానీ, అదేంటో ఏపీలో మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వస్తుంటే.. అధికార పార్టీ వైసీపీ వెన్నులో వణుకు పుడుతున్నట్టు వ్యవహరిస్తోందని అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా.. ఆయన పర్యటనలు ఎక్కడ ఉన్నా.. వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారు.
ఇటీవల కాలంలో చంద్రబాబు బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి, నినాదాలతో ప్రజా కార్యక్రమా లు చేపట్టారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఆయన ప్రచారం చేస్తున్నారు. తద్వారా పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఇదే వైసీపీకి కంటగింపుగా మారింది. తమకు ఎక్కడ గండికొడతారో.. అని భయపడుతున్నారో.. లేక, తాము ఓడిపోవడం ఖాయమని అనుకుంటున్నారో తెలియదుకానీ, అడుగడుగునా అడ్డు తగులుతున్నారు.
ఉమ్మడి కృష్ణాలోని నందిగామలో చంద్రబాబు పర్యటించినప్పుడు.. రాళ్లు రువ్వారు. నరసరావు పేటలో నిర్వహించిన సభలోనూ గలాభా సృష్టించారు. అయితే, ఎటొచ్చీ.. కర్నూలులో మాత్రం వైసీపీ నాయకులు మౌనంగా ఉన్నారు. దీంతో ఆ రెండు చోట్ల చంద్రబాబు సభలకు జనాలు రాలేదన్న ప్రచారం చేసుకునే ప్రయత్నం చేసినా.. కర్నూలులో మాత్రం జనాల తాకిడిని చూసి.. వైసీపీ నేతలు నివ్వెర పోయారు. ఇక, అప్పటి నుంచి చంద్రబాబు పర్యటనలకు మళ్లీ అడ్డంకులు సృష్టిస్తున్నారు.
తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన చేపట్టారు. అయితే.. ఈ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో వైసీపీ నాయకులపైకి వెళ్లారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాటలు.. కుమ్ములాటలు జరిగాయి. అయితే, ఈ పరిణామాలను గమనిస్తున్నవారు.. చంద్రబాబు పర్యటన అంటే వైసీపీ వెన్నులో వణుకు వస్తోందా? అనే చర్చ చేస్తుండడం గమనార్హం.
This post was last modified on December 9, 2022 8:50 am
విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు.…
ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన సినిమాల లిస్టు తీస్తే ఖచ్చితంగా టాప్ త్రీలో ఉండే మూవీ అవతార్. మూడో భాగం…
ఫస్ట్ విడుదల కావాల్సిన బైకర్ హఠాత్తుగా వెనక్కు తగ్గడంతో శర్వానంద్ మరో సినిమా నారీనారీ నడుమ మురారి ముందుకు వచ్చేసింది.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై…
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…