Political News

స‌జ్జ‌ల‌కు ష‌ర్మిల వార్నింగ్!

వైసీపీ ముఖ్య నాయ‌కుడు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల వార్నింగ్ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల‌ను క‌లిపి ఉంచాల‌న్న‌దే త‌మ ల‌క్ష్య‌మ‌ని వ్యాఖ్యానించిన‌ స‌జ్జ‌ల‌పై ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సజ్జల చేసిన‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. “ఆయ‌న ఏ మూడ్‌లో ఉండి మాట్లాడారో కానీ, స‌జ్జ‌ల చేసిన వ్యాఖ్య‌లు అర్థం లేనివి” అని ష‌ర్మిల అన్నారు.

అంతేకాదు, తెలంగాణ ఏర్పాటు, రాష్ట్రం అనేది ఒక వాస్త‌వ‌మ‌ని షర్మిల తెలిపారు. ఎంతో మంద బలిదానాలు, ఎంతో మంది త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలవడం అసాధ్యమ‌ని అన్నారు. ఇప్పుడు కొత్త‌గా స‌జ్జ‌ల ఏమీ తెలియ‌న‌ట్టుగా మాట్లాడ‌డం స‌రికాద‌న్నారు.

“కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయి. ఒక సారి విభ‌జించిన రాష్ట్రాలను ఎలా క‌లుపుతారు?” అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా అదిరిపోయే కామెంట్ చేశారు ష‌ర్మిల‌.. “మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడం మీద కాదు, మీ ప్రాంత అభివృద్ధి మీద. మీ హక్కుల కోసం పోరాటం చేయండి. మీ ప్రాంతానికి న్యాయం చేయండి” అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం త‌గ‌ద‌ని గ‌ట్టిగానే ష‌ర్మిల హెచ్చ‌రించారు. నిజానికి తెలంగాణ‌లో అధికార పార్టీ నాయ‌కులు ఇంకా స్పందించేలోపునే ష‌ర్మిల చేసిన ఈ హెచ్చ‌రిక‌లు వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, స‌జ్జ‌ల చేసిన వ్యాఖ్య‌ల‌పై టీఆర్ ఎస్ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on December 8, 2022 9:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

29 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago