Political News

స‌జ్జ‌ల‌కు ష‌ర్మిల వార్నింగ్!

వైసీపీ ముఖ్య నాయ‌కుడు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల వార్నింగ్ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల‌ను క‌లిపి ఉంచాల‌న్న‌దే త‌మ ల‌క్ష్య‌మ‌ని వ్యాఖ్యానించిన‌ స‌జ్జ‌ల‌పై ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సజ్జల చేసిన‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. “ఆయ‌న ఏ మూడ్‌లో ఉండి మాట్లాడారో కానీ, స‌జ్జ‌ల చేసిన వ్యాఖ్య‌లు అర్థం లేనివి” అని ష‌ర్మిల అన్నారు.

అంతేకాదు, తెలంగాణ ఏర్పాటు, రాష్ట్రం అనేది ఒక వాస్త‌వ‌మ‌ని షర్మిల తెలిపారు. ఎంతో మంద బలిదానాలు, ఎంతో మంది త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలవడం అసాధ్యమ‌ని అన్నారు. ఇప్పుడు కొత్త‌గా స‌జ్జ‌ల ఏమీ తెలియ‌న‌ట్టుగా మాట్లాడ‌డం స‌రికాద‌న్నారు.

“కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయి. ఒక సారి విభ‌జించిన రాష్ట్రాలను ఎలా క‌లుపుతారు?” అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా అదిరిపోయే కామెంట్ చేశారు ష‌ర్మిల‌.. “మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడం మీద కాదు, మీ ప్రాంత అభివృద్ధి మీద. మీ హక్కుల కోసం పోరాటం చేయండి. మీ ప్రాంతానికి న్యాయం చేయండి” అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం త‌గ‌ద‌ని గ‌ట్టిగానే ష‌ర్మిల హెచ్చ‌రించారు. నిజానికి తెలంగాణ‌లో అధికార పార్టీ నాయ‌కులు ఇంకా స్పందించేలోపునే ష‌ర్మిల చేసిన ఈ హెచ్చ‌రిక‌లు వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, స‌జ్జ‌ల చేసిన వ్యాఖ్య‌ల‌పై టీఆర్ ఎస్ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Satya

Recent Posts

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

59 minutes ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

2 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

3 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

5 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

5 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

7 hours ago