Political News

రూ.4 కోట్లతో తమిళనాడులో పట్టుబడిన కారు ఏపీ మంత్రిదా?

తమిళనాడులో చోటు చేసుకున్న పరిణామం ఏపీకి చెందిన ఒక మంత్రి ఇబ్బందికి గురి చేసేలా మారిందంటున్నారు. మంత్రి స్టిక్కర్ ఉన్న కారు కావటం.. సదరు మంత్రి ఏపీకి చెందిన నేత కావటం ఈ అంశానికి ప్రాధాన్యత పెరిగింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఆరంబాక్కం చెక్ పోస్టు వద్ద పోలీసులు ఒక కారును ఆపారు. ఆ కారు మీద ఏపీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డిపేరుతో ఉన్న స్టిక్కర్ ఉంది. ఏపీ విద్యుత్.. అటవీ – పర్యావరణం.. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు. కారును తనిఖీ చేయగా అందులో రూ.4కోట్ల నగదు.. కొంత బంగారం లభించింది. ఈ కారు ప్రకాశంజిల్లా ఒంగోలునుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు.

ఈ ఉదంతంలో ముగ్గురిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. సదరు కారుతో కానీ.. కారుకు అంటించిన మంత్రి స్టిక్కర్ తోకానీ తనకు సంబంధం లేదని మంత్రి బాలినేని స్పష్టం చేస్తున్నారు. పోలీసులకు పట్టుబడిన కారుకు అంటించిన స్టిక్కర్ అసలైనది కాదని.. జిరాక్స్ కాపీగా చెబుతున్నారు. అంతేకాదు.. కారు తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉందని.. తనకే మాత్రం సంబంధం లేదన్నారు. కారులోని డబ్బుతోనూ.. బంగారంతోనూ తనకు సంబధం లేదని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. కారులో ఒంగోలు వారు ఉండటంతో ఒంగోలు ఎమ్మెల్యేకు సంబంధం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి స్టిక్కర్ ను సామాన్యులు అంటించే సాహసం చేయరని.. అలా చేయాలంటూ అంతో ఇంతో రాజకీయ సంబంధాలు ఉంటేనే సాధ్యమవుతుందన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on July 16, 2020 3:44 pm

Share
Show comments
Published by
Satya
Tags: YSRCP MLA

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago