తమిళనాడులో చోటు చేసుకున్న పరిణామం ఏపీకి చెందిన ఒక మంత్రి ఇబ్బందికి గురి చేసేలా మారిందంటున్నారు. మంత్రి స్టిక్కర్ ఉన్న కారు కావటం.. సదరు మంత్రి ఏపీకి చెందిన నేత కావటం ఈ అంశానికి ప్రాధాన్యత పెరిగింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఆరంబాక్కం చెక్ పోస్టు వద్ద పోలీసులు ఒక కారును ఆపారు. ఆ కారు మీద ఏపీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డిపేరుతో ఉన్న స్టిక్కర్ ఉంది. ఏపీ విద్యుత్.. అటవీ – పర్యావరణం.. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు. కారును తనిఖీ చేయగా అందులో రూ.4కోట్ల నగదు.. కొంత బంగారం లభించింది. ఈ కారు ప్రకాశంజిల్లా ఒంగోలునుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఈ ఉదంతంలో ముగ్గురిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. సదరు కారుతో కానీ.. కారుకు అంటించిన మంత్రి స్టిక్కర్ తోకానీ తనకు సంబంధం లేదని మంత్రి బాలినేని స్పష్టం చేస్తున్నారు. పోలీసులకు పట్టుబడిన కారుకు అంటించిన స్టిక్కర్ అసలైనది కాదని.. జిరాక్స్ కాపీగా చెబుతున్నారు. అంతేకాదు.. కారు తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉందని.. తనకే మాత్రం సంబంధం లేదన్నారు. కారులోని డబ్బుతోనూ.. బంగారంతోనూ తనకు సంబధం లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. కారులో ఒంగోలు వారు ఉండటంతో ఒంగోలు ఎమ్మెల్యేకు సంబంధం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి స్టిక్కర్ ను సామాన్యులు అంటించే సాహసం చేయరని.. అలా చేయాలంటూ అంతో ఇంతో రాజకీయ సంబంధాలు ఉంటేనే సాధ్యమవుతుందన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on July 16, 2020 3:44 pm
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…