తమిళనాడులో చోటు చేసుకున్న పరిణామం ఏపీకి చెందిన ఒక మంత్రి ఇబ్బందికి గురి చేసేలా మారిందంటున్నారు. మంత్రి స్టిక్కర్ ఉన్న కారు కావటం.. సదరు మంత్రి ఏపీకి చెందిన నేత కావటం ఈ అంశానికి ప్రాధాన్యత పెరిగింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఆరంబాక్కం చెక్ పోస్టు వద్ద పోలీసులు ఒక కారును ఆపారు. ఆ కారు మీద ఏపీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డిపేరుతో ఉన్న స్టిక్కర్ ఉంది. ఏపీ విద్యుత్.. అటవీ – పర్యావరణం.. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు. కారును తనిఖీ చేయగా అందులో రూ.4కోట్ల నగదు.. కొంత బంగారం లభించింది. ఈ కారు ప్రకాశంజిల్లా ఒంగోలునుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఈ ఉదంతంలో ముగ్గురిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. సదరు కారుతో కానీ.. కారుకు అంటించిన మంత్రి స్టిక్కర్ తోకానీ తనకు సంబంధం లేదని మంత్రి బాలినేని స్పష్టం చేస్తున్నారు. పోలీసులకు పట్టుబడిన కారుకు అంటించిన స్టిక్కర్ అసలైనది కాదని.. జిరాక్స్ కాపీగా చెబుతున్నారు. అంతేకాదు.. కారు తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉందని.. తనకే మాత్రం సంబంధం లేదన్నారు. కారులోని డబ్బుతోనూ.. బంగారంతోనూ తనకు సంబధం లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. కారులో ఒంగోలు వారు ఉండటంతో ఒంగోలు ఎమ్మెల్యేకు సంబంధం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి స్టిక్కర్ ను సామాన్యులు అంటించే సాహసం చేయరని.. అలా చేయాలంటూ అంతో ఇంతో రాజకీయ సంబంధాలు ఉంటేనే సాధ్యమవుతుందన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on July 16, 2020 3:44 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…