తమిళనాడులో చోటు చేసుకున్న పరిణామం ఏపీకి చెందిన ఒక మంత్రి ఇబ్బందికి గురి చేసేలా మారిందంటున్నారు. మంత్రి స్టిక్కర్ ఉన్న కారు కావటం.. సదరు మంత్రి ఏపీకి చెందిన నేత కావటం ఈ అంశానికి ప్రాధాన్యత పెరిగింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఆరంబాక్కం చెక్ పోస్టు వద్ద పోలీసులు ఒక కారును ఆపారు. ఆ కారు మీద ఏపీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డిపేరుతో ఉన్న స్టిక్కర్ ఉంది. ఏపీ విద్యుత్.. అటవీ – పర్యావరణం.. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు. కారును తనిఖీ చేయగా అందులో రూ.4కోట్ల నగదు.. కొంత బంగారం లభించింది. ఈ కారు ప్రకాశంజిల్లా ఒంగోలునుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఈ ఉదంతంలో ముగ్గురిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. సదరు కారుతో కానీ.. కారుకు అంటించిన మంత్రి స్టిక్కర్ తోకానీ తనకు సంబంధం లేదని మంత్రి బాలినేని స్పష్టం చేస్తున్నారు. పోలీసులకు పట్టుబడిన కారుకు అంటించిన స్టిక్కర్ అసలైనది కాదని.. జిరాక్స్ కాపీగా చెబుతున్నారు. అంతేకాదు.. కారు తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉందని.. తనకే మాత్రం సంబంధం లేదన్నారు. కారులోని డబ్బుతోనూ.. బంగారంతోనూ తనకు సంబధం లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. కారులో ఒంగోలు వారు ఉండటంతో ఒంగోలు ఎమ్మెల్యేకు సంబంధం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి స్టిక్కర్ ను సామాన్యులు అంటించే సాహసం చేయరని.. అలా చేయాలంటూ అంతో ఇంతో రాజకీయ సంబంధాలు ఉంటేనే సాధ్యమవుతుందన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on July 16, 2020 3:44 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…