Pawan
ఏపీలో మరో ప్రతిపక్షంగా ఉన్న జనసేన వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని.. వైసీపీ అవినీతి, అక్కమాలపై యుద్ధం చేస్తామని తరచుగా చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయనున్నట్టు కొన్నాళ్ల కిందటే ప్రకటించారు. అయితే, ఎందుకో ఇది వాయిదా పడింది. అయితే, తాజాగా.. ఈ పర్యటనకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.
Pawan Kalyan చేపట్టనున్న రాష్ట్ర వ్యాప్త ఎన్నికల యాత్రకు ప్రత్యేక వాహనం సిద్ధమైంది. ఈ వాహనం తాలూకు వీడియోను పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘వారాహి’… రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ అని ప్రకటించారు. ఈ వాహనాం ట్రయల్ రన్ ను పవన్ కళ్యాణ్ బుధవారం హైదరాబాద్ లో పరిశీలించారు. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోను చర్చించారు
కాగా, ఈ వాహనానికి వారాహి అనే అమ్మవారి పేరుపెట్టారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతాయి. దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు. కాశీలో ఉన్న వారాహి అమ్మవారి ఆలయం ప్రపంచ ప్రసిద్ధం. నేరుగా ఆలయంలోకి ప్రవేశించి దర్శించుకునే అవకాశం లేదు. చిన్నపాటి కిటికీల గుండా మాత్రమే భక్తులు చూసేందుకు అనుమతిస్తారు. అది కూడా ఉదయం 6-7 గంటల మధ్యలోనే!
ఎందుకీ వాహనం.. అంటే 2024 అసెంబ్లీ జనరల్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యమని పదే పదే చెబుతున్న పవన్ కల్యాణ్ ఏపీ వ్యాప్తంగా ఈ వాహనంలో పర్యటించనున్నారు. కాగా ఈ బస్సు .. మిలిటరీ వాహనాన్ని పోలివుండడం ఆసక్తిని కలిగిస్తోంది. రంగు కూడా ఆర్మీ వాహన కలర్కు దగ్గరిగా ఉంది. ఈ వాహనానికి పవన్ ఇంకా రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో వాహనంపై ఎలాంటి నంబర్ కనిపించలేదు. దీంతో ఆర్టీఏ ఈ వాహనానికి అనుమతి ఇస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
This post was last modified on December 7, 2022 10:31 pm
విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు.…
ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన సినిమాల లిస్టు తీస్తే ఖచ్చితంగా టాప్ త్రీలో ఉండే మూవీ అవతార్. మూడో భాగం…
ఫస్ట్ విడుదల కావాల్సిన బైకర్ హఠాత్తుగా వెనక్కు తగ్గడంతో శర్వానంద్ మరో సినిమా నారీనారీ నడుమ మురారి ముందుకు వచ్చేసింది.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై…
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…