Pawan
ఏపీలో మరో ప్రతిపక్షంగా ఉన్న జనసేన వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని.. వైసీపీ అవినీతి, అక్కమాలపై యుద్ధం చేస్తామని తరచుగా చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయనున్నట్టు కొన్నాళ్ల కిందటే ప్రకటించారు. అయితే, ఎందుకో ఇది వాయిదా పడింది. అయితే, తాజాగా.. ఈ పర్యటనకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.
Pawan Kalyan చేపట్టనున్న రాష్ట్ర వ్యాప్త ఎన్నికల యాత్రకు ప్రత్యేక వాహనం సిద్ధమైంది. ఈ వాహనం తాలూకు వీడియోను పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘వారాహి’… రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ అని ప్రకటించారు. ఈ వాహనాం ట్రయల్ రన్ ను పవన్ కళ్యాణ్ బుధవారం హైదరాబాద్ లో పరిశీలించారు. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోను చర్చించారు
కాగా, ఈ వాహనానికి వారాహి అనే అమ్మవారి పేరుపెట్టారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతాయి. దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు. కాశీలో ఉన్న వారాహి అమ్మవారి ఆలయం ప్రపంచ ప్రసిద్ధం. నేరుగా ఆలయంలోకి ప్రవేశించి దర్శించుకునే అవకాశం లేదు. చిన్నపాటి కిటికీల గుండా మాత్రమే భక్తులు చూసేందుకు అనుమతిస్తారు. అది కూడా ఉదయం 6-7 గంటల మధ్యలోనే!
ఎందుకీ వాహనం.. అంటే 2024 అసెంబ్లీ జనరల్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యమని పదే పదే చెబుతున్న పవన్ కల్యాణ్ ఏపీ వ్యాప్తంగా ఈ వాహనంలో పర్యటించనున్నారు. కాగా ఈ బస్సు .. మిలిటరీ వాహనాన్ని పోలివుండడం ఆసక్తిని కలిగిస్తోంది. రంగు కూడా ఆర్మీ వాహన కలర్కు దగ్గరిగా ఉంది. ఈ వాహనానికి పవన్ ఇంకా రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో వాహనంపై ఎలాంటి నంబర్ కనిపించలేదు. దీంతో ఆర్టీఏ ఈ వాహనానికి అనుమతి ఇస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…