ఏపీ గురించి ఇప్పుడు ఏం చెప్పుకోవాలి? ఏం మిగిలింది? ఇదీ.. ఇప్పుడు పబ్లిక్ టాక్. ఎన్నికలకు సమ యం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ప్రజలను కలుస్తున్నాయి. వారు ఏం చెబుతారా? అని మైకు గొట్టాలు పెడుతున్నారు. ఈ క్రమంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు చెబుతు న్న మాట చాలా ఆలోచనాత్మకంగా ఉండడం గమనార్హం.
ఏం చెబుతాం.. ప్రాంతాలు.. కులాల మధ్య ఇప్పుడు వివాదాలు తెర మీదికి వస్తున్నాయి. మూడు ప్రాంతా లుగా ప్రజలు విడిపోతున్నారనే భావన వ్యక్తమవుతోంది అని మేధావులు అభిప్రాయపడ్డారు. గత కొన్ని రోజులుగా.. ఏపీలో పరిణామాలను గమనిస్తే.. వీరి అభిప్రాయం కూడా నిజమేనని తెలుస్తోంది. ఇటీవల విశాఖలో వైసీపీ నాయకులు రాజధాని సభను ఏర్పాటు చేశారు.
రెండు రోజుల కిందట కర్నూలులో సీమ గర్జన సభ పెట్టారు. ఈ పరిణామాలను గమనించిన ప్రజలు తమ ముందుకు వచ్చిన చానెళ్ల ముందు నిర్మొహమాటంగా ఇదే విషయాన్ని చెబుతున్నారు. అదేసమయంలో కులాల గురించి కూడా ప్రస్తావన చేస్తున్నారు. కులాల మధ్య కుంపట్లు పెట్టేలా.. వ్యవహరిస్తున్నారు అని కొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు.
మొత్తంగా చూస్తే.. ఏపీలో పరిస్థితి కులాలు-ప్రాంతాల మధ్య రాజకీయంగా మారిపోయిందనే టాక్ అయితే జోరుగా వినిపిస్తుండడం గమనార్హం. ఇక, ఎన్నికల నాటికి ఈ వాదన మరింత బలంగా వినిపించినా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు పరిశీలకులు. నిజానికి గత ఎన్నికలకు ముందు.. అభివృద్ధి గురించిన ప్రస్తావన రాష్ట్రంలో ఎక్కువగా జరిగింది. ప్రజలు కూడా ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయి.. ప్రాంతాలు, కులాలుగా చర్చ జరుగుతుండడం గమనార్హం.
This post was last modified on December 7, 2022 7:58 pm
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…