ఏపీ అధికార పార్టీ వైసీపీ విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ సభకు అదే సమయంలో ప్రతిపక్షం టీడీపీ చెక్ పెట్టింది. వైసీపీ నిర్వహించిన సభకు ప్రతిగా టీడీపీ తీసుకువచ్చిన JayahoBC అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దేశవ్యాప్తంగా #TDPJayahoBC అనే హ్యాష్ట్యాగ్ టాప్లో ట్రెండ్ అయింది. టీడీపీ హయాంలో బీసీలకు జరిగిన మేలు, వైసీపీ హయాంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ ఐ-టీడీపీ విభాగం దీనిని ఆన్లైన్లో ట్రెండ్ చేసింది.
తమకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ ఆ హ్యాష్ట్యాగ్ను జత చేస్తూ బీసీ వర్గాలు, బీసీ యువత ట్వీట్స్తో జోరెత్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. గత ప్రభుత్వం బీసీలకు అమలు చేసిన సంక్షేమాన్నివిస్మరించి.. నవరత్నాల పేరుతో అన్యాయం చేస్తోందని ఆయా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ముఖ్యంగా యాదవ, రజక, చేనేత వృత్తి కులాలకు గతంలో టీడీపీ ప్రభుత్వం ఆదుకుందని తెలిపారు.
అయితే, వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందన్న భావనను వ్యక్తం చేశారు. పేదరికంలో మగ్గుతున్న యాదవులకు ప్రభుత్వం చేసింది శూన్యమని వాపోతున్నారు. రజక, నాయీ బ్రాహ్మణులకు ఆదరణ పనిముట్లను నిలిపేశారని పలువురు పేర్కొన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఆయా కులాల స్వయం ఉపాధి పథకాలను అమలు చేసిందని పలువురు తెలిపారు.
అయితే, వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఎత్తేసిందని వారు అభిప్రాయపడ్డారు. అదేసమయంలో గౌడ, అగ్నికుల క్షత్రియ కులాలకు కూడా గతంలో ఉన్న పలు పథకాలను రద్దు చేసిందని వైసీపీ పై నిప్పులు చెరిగారు. మొత్తానికి వైసీపీ బీసీ సభకు ప్రతిగా ఆన్లైన్లో టీడీపీ చేసిన ప్రయోగం సక్సెస్ కావడం పట్ల టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on December 7, 2022 2:37 pm
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…